India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD చందానగర్ ఖజానా జువెలర్స్ దోపిడీ కేసులో పురోగతి లభించింది. నగర శివారులో ఇద్దరు దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. దోపిడీ ఘటనపై నిందితులను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. దుండగులు వాడిన వెపన్స్, బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. కాగా 15 నిమిషాల్లో దోపిడీ చేసి దొంగలు పరారయ్యారు.
కొడంగల్ నియోజకవర్గంలోని పలు ఆలయాల అభివృద్ధిపై అధికారులతో CM రేవంత్ రెడ్డి ఈరోజు HYDలో సమీక్షించారు. కొడంగల్లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం, దౌల్తాబాద్లోని శ్రీ వేంకటేశ్వర స్వామి గుడి, కోస్గిలోని శివాలయం, వేణుగోపాల స్వామి గుడిని సమూలంగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 6 ఎకరాల విస్తీర్ణంలో టీటీడీ తరహాలో కొడంగల్లోని చారిత్రక శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయం అభివృద్ధి చేయాలన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా పలు రైళ్లను చర్లపల్లి మీదుగా నడుపుతున్న విషయం తెలిసేందే. అయితే పనులు పూర్తి కానుండటంతో సెప్టెంబర్ 7 నుంచి మళ్లీ సికింద్రాబాద్ మీదుగా నడిపేందుకు అధికారులు నిర్ణయంచినట్లు సమాచారం. జన్మభూమి, శాతవాహన, ఎల్టీటీ, హదాప్సర్, షిరిడీ (కాకినాడ), షిరిడీ (మచిలీపట్నం), వాస్కోడాగామా రైళ్లు మళ్లీ సికింద్రాబాద్లో ప్రయాణికులకు సేవలందిస్తాయి. SHARE IT
HYD నార్సింగి PS పరిధిలో ఓ బీటెక్ విద్యార్థిని ఈరోజు సూసైడ్ చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో సెకండియర్ చదువుతున్న సుస్మిత(19) ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటుంది. ఈ క్రమంలో హాస్టల్లోనే ఉరేసుకుని చనిపోయింది. సుస్మిత స్వస్థలం నిజామాబాద్ జిల్లా అక్కునూరుగా పోలీసులు గుర్తించారు. ఆమె ఆత్మహత్యకు కుటుంబ కలహాలా..?, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్లో నేడు ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని జరిపారు. మూడు ఆడ ఏనుగులను (వనజ, ఆశ, సీత)ను సాధారణ ఎగ్జిబిషన్ ఎన్క్లోజర్ నుంచి బయటకు తీసుకొచ్చి, జూలో సుమారు 3 కిలోమీటర్లు నడిపించారు. వనజ, ఆశ, సీత, విజయ్ అనే నాలుగు ఏనుగులకు ప్రత్యేక జంబో విందు వడ్డించారు. పలువురు అధికారులతోపాటు, సందర్శకులు పాల్గొన్నారు.
నేటి భారతావని యువకులది. కానీ.. రియాల్టీలో కొందరు గంజాయితాగి HYDలో సృష్టిస్తున్న ఆగడాలు కళ్ల ముందే ఉన్నాయి. తాత్కాలిక ఆనందాలకు మరికొందరు మత్తులో తేలుతున్నారు. టీనేజ్లో లవ్ ఫెయిల్ అని, ఫ్రెండ్స్తో సరదాకని అలవాటు చేసుకుని భవిష్యత్ను అంధకారం చేసుకుంటున్నారు. ‘యంగ్ ఏజ్లోనే మన సక్సెస్ వల్ల సమాజంలో పేరెంట్స్కు అందే గౌరవం ఇచ్చే కిక్కుకంటే ఈ మత్తులో ఏముంది బ్రో ఆలోచించండి’.
నేడు ఇంటర్నేషనల్ యూత్ డే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో INC టికెట్ దాదాపు అజారుద్దీన్కే ఖరారు అవుతోందన్న ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన ఢిల్లీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అజ్జు భాయ్ అనుచరుల సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కెర్లు కొడుతున్నాయి. ఢిల్లీలో జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక మీద చర్చ జరిగిందని, టికెట్ను అజారుద్దీన్కే ఫైనల్ చేస్తారని ఆయన వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
HYD యువతి చికాగోలో అర్థాంతరంగా తనువు చాలించింది. బాధితుల వివరాల ప్రకారం.. దుండిగల్ పరిధిలోని గండిమైసమ్మలో నివాసం ఉండే శ్రీనురావు పెద్ద కుమార్తె శ్రీజవర్మ (23) ఉన్నత చదువు కోసం చికాగో వెళ్లింది. అపార్ట్మెంట్కు పక్కనే ఉన్న రెస్టారెంట్లో తినడానికి రాత్రి నడుచుకుంటూ వెళ్తుంటే వెనకాల నుంచి ట్రక్ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిందని బంధువులు వాపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భారీ వర్షాలకు మైత్రివనం, స్వర్ణజయంతి కాంప్లెక్స్ సెల్లార్లలోకి వరద నీరు, వ్యర్థాలు వచ్చి చేరాయి. నీటిని తొలగించి చేతులు దులుపుకున్న అధికారులు వ్యర్థాల గురించి పట్టించుకోవడం లేదు. సెల్లార్లలో ఎక్కడా చూసినా అపరిశుభ్రతనే. దుర్వాసనతో స్థానిక వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. CM ఇన్స్పెక్షన్ చేసిన ఏరియాలోనూ నిర్లక్ష్యం ఏంటని నిలదీస్తున్నారు. ఇకనైనా వ్యర్థాలను తొలగించాలని వ్యాపారులు కోరుతున్నారు.
నగర గల్లీల్లోని రోడ్లను మరమ్మతులు చేసిన వారం రోజులకే మళ్లీ అదే సమస్య ఉత్పన్నమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కురుస్తోన్న వర్షాలకు కంకర తేలడంతో వాహనచోదకులు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్యాచ్వర్క్స్పై అనేకసార్లు ఫిర్యాదు చేసినా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని వాహనాదారులు వాపోతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఈ సమస్య పునరావృతం అవుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై మీ కామెంట్?
Sorry, no posts matched your criteria.