India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
2026లో హజ్ యాత్రకు వెళ్లే సీనియర్ సిటిజన్లకు హజ్ కమిటీ కొత్త ప్యాకేజీ ప్రకటించింది. సాధారణంగా ఈ యాత్ర 42 రోజుల పాటు ఉంటుంది. అయితే వృద్ధులు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకంగా 20 రోజుల హజ్ యాత్ర చేపట్టనుంది. ఇది కోరుకున్న వారికి మాత్రమేనని స్పష్టం చేసింది. ఈ షార్ట్టర్మ్ యాత్రకు ఎంత మొత్తం ఖర్చవుతుందనేది త్వరలో చెబుతామని హజ్ కమిటీ కమిటీ ఈవో సాజిద్ అలీ తెలిపారు.
వచ్చే ఏడాది హజ్ యాత్రకు వెళ్లేందుకు 11,414 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలంగాణ హజ్ కమిటీ తెలిపింది. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 7న గడువు ముగిసింది. 2, 3 రోజుల్లో డ్రా తీసి యాత్రికులను ఎంపిక చేయనున్నారు. యాత్రకు ఎంపికైన వారు మొదటి విడతలో రూ.1.5 లక్షలు చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలని కమిటీ పేర్కొంది.
అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్జెండర్లకు ఉచిత డిగ్రీ కోర్సు అందివ్వనున్నట్లు వీసీ ప్రొ.ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇది అమలు చేస్తామన్నారు. ఇంటర్ తత్సమాన విద్యార్హత కలిగిన ట్రాన్స్ జెండర్లు కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు రూ.500 చెల్లిస్తే చాలు, స్టడీమెటీరియల్ అందించి చదివిస్తామని తెలిపారు. ట్రాన్స్జెండర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
CM రేవంత్ రెడ్డి అమీర్పేట, బల్కంపేట ప్రాంతాల్లో పర్యటించి, వరద పరిస్థితిని పరిశీలించడంతో హైడ్రా అలెర్ట్ అయింది. ఇక్కడ శాశ్వత పరిష్కారం చూపేందుకు నడుం బిగించింది. షార్ట్, మీడియం, లాంగ్ టర్మ్ విధానాలు అవలంబించి ఉపశమనం కల్పించనుంది. ఇకముందు వరద సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టనుంది. అమీర్పేట నుంచి వెంగళరావునగర్ వరకు హైడ్రా అధికారులు స్టడీ చేయనున్నారు.
నగరంలో సాధారణ వర్షపాతాన్ని మించి సగటున 22% అత్యధికంగా నమోదైందని అధికారులు వెల్లడించారు. సిటీవ్యాప్తంగా సాధారణంగా 343 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉంది. గరిష్ఠంగా 439.4 మి.మీ వర్షం నమోదు కావడం గమనార్హం. రంగారెడ్డిలో 292.2 మి.మీటర్ల వర్షపాతానికి 401.7 మిల్లీ మీటర్లు రికార్డు అయ్యింది. మేడ్చల్లో 331.0 మి.మీ నమోదు కావాల్సి ఉండగా.. 342.2 మి.మీ నమోదు అయినట్లు అధికారులు తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీలు బండెన్క బండి గడుతున్నాయి. టికెట్ కోసం ఢిల్లీకి, ఓట్ల కోసం గల్లీకి నేతలు క్యూ కడుతున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో మంత్రుల కాన్వాయ్లు కృష్ణానగర్లో తిరుగుతున్నాయి. బస్తీ బస్తీలో బీజేపీ అంటూ యూసఫ్గూడకు నిన్నే కేంద్రమంత్రి వచ్చారు. ప్రధాన పార్టీల హడావిడి ఒకెత్తయితే, ఇక కొత్త పార్టీల ఆర్భాటం మరో ఎత్తు. జూబ్లీహిల్స్లో తామే పోటీ అంటూ కొత్త జెండాలు మోసుకొస్తున్నారు.
హుస్సేన్సాగర్కు వరద కొనసాగుతోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 మీటర్లు కాగా ప్రస్తుతం 513.50 మీటర్లుగా ఉంది. నగరంలో కురిసిన వర్షాలతో సాగర్కి వచ్చే నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో సాగర్కి ఇన్ ఫ్లో 1027 క్యూసెక్కులు కాగా అవుట్ ఫ్లో 1130 క్యూసెక్కులుగా ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.
త్వరలో జరగనున్న జూబ్లీహీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో శివసేన UBT పార్టీ పోటీ చేస్తుందని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు డాక్టర్ గౌట్ గణేశ్ స్పష్టం చేశారు. ఆదివారం నారాయణగూడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా గోషామహల్ ప్రాంతానికి చెందిన రాధిక తన అనుచరులతో కలిసి శివసేన (UBT) పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేసి, ప్రచారం చేస్తామని గణేశ్ తెలిపారు.
HYD శివారు నందివనపర్తి ఆలయాలకు పుట్టినిల్లు. నాడు నూటొక్క నందులు ఉండేవని, ఓంకారేశ్వరాలయం, సిద్ధేశ్వరాలయం, ఏకశిలా నంది ఇక్కడ ప్రధానమైనవని గ్రామస్థులు చెబుతారు. ఏకశిలా నంది ఆలయంలో 8 అడుగుల నంది విశేషంగా ఆకర్షిస్తోంది. హనుమాన్, జ్ఞాన సరస్వతి టెంపుల్స్ కూడా ఉన్నాయి. దీంతో నందివనపర్తి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. HYD నుంచి గంట జర్నీ కావడంతో ప్రతి సోమవారం ఇక్కడికి భక్తులు వెళుతుంటారు.
10th క్లాస్ మనిషి జీవితంలో ఒక ఎమోషన్. పాఠశాల స్నేహం గుర్తొచ్చి ఐదేళ్లు, పదేళ్లకోసారి అంతా ఆత్మీయంగా కలుస్తుంటారు. 50 ఏళ్ల తర్వాత ఎర్రమంజిల్లోని ప్రభుత్వ పాఠశాల అపూర్వ కళయికకు వేదికైంది. 1975లో 10వ తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆదివారం సందడి చేశారు. నాడు తెలుగు పాఠాలు చెప్పిన టీచర్ హైమావతిని చీఫ్ గెస్ట్గా పిలిచారు. మళ్లీ దొరకరంటూ విద్యార్థులను బెంచీల్లో కూర్చొబెట్టి మరీ పాఠాలు చెప్పారు.
Sorry, no posts matched your criteria.