Hyderabad

News February 1, 2025

HYD: కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొంగులేటి కౌంటర్

image

కేసీఆర్ రేవంత్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ గర్జనలు, గంభీరాలు గమనిస్తున్నామని అన్నారు. ఇంకా ఫామ్ హౌస్‌లోనే ఉండి మాట్లాడతారా.. లేదా అసెంబ్లీకి వస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు. అసెంబ్లీకి రాకుండా ఎక్కడికి పోతాడో చూద్దామని అన్నారు. అసెంబ్లీకి వస్తే అప్పుడు మాట్లాడతామని అన్నారు.

News February 1, 2025

HYD: సీఎం రేవంత్ మిస్ గైడెడ్ మిసైల్‌లా పనిచేస్తున్నారు: కవిత

image

నీళ్ల విషయంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం నీచ రాజకీయం చేస్తున్నదని.. నీళ్ల విషయంలో రాజకీయాలు చేయడం మానేసి నిజాలు చెప్పాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో నీళ్లు-నిజాలు అంశంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కవితతోపాటు మేధావులు, విశ్రాంత ఇంజినీర్లు పాల్గొన్నారు. సీఎం రేవంత్ మిస్ గైడెడ్ మిసైల్‌లా పనిచేస్తున్నారని ఎద్దేవా చేశారు.

News February 1, 2025

HYD: కాగ్ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్ రావు

image

కాళేశ్వరం సహా తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం సుద్ధ తప్పు అని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందని.. మిషన్ భగీరథపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని పటాపంచలు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం విడుదల చేసిన ఎకానమిక్ సర్వే 2024-25 నివేదిక బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు.

News February 1, 2025

HYD: జీఎడీలో 160 మంది సెక్షన్ ఆఫీసర్స్ బదిలీలు

image

జీఏడీలోని వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తోన్న సెక్షన్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 160 మందిని వివిధ శాఖలకు బదిలీ చేశారు. హైదరాబాద్ జలమండలి, ఎంఏయూడీ, హోంశాఖ, రోడ్డు రవాణా, యువజన సర్వీసుల శాఖ, సివిల్ సప్లై, ప్లానింగ్, రెవెన్యూ, బీసీ, ఎస్సీ, పంచాయతీ రాజ్ విభాగాలకు ట్రాన్స్‌ఫర్ చేశారు.

News February 1, 2025

HYDలో రూ. 50కే డోర్ డెలివరీ!

image

HYDలో ఎక్కడికైనా కేవలం రూ.50కే కిలో వరకు బరువు కలిగిన సామగ్రిని డోర్ డెలివరీ చేస్తున్నట్లు ఆర్టీసీ కార్గో అధికారులు తెలిపారు. నగరవ్యాప్తంగా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. వస్తువు బరువు ప్రకారం ఛార్జీలు ఉంటాయని స్పష్టం చేశారు. ఈ సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉప్పల్, రామంతాపూర్, హబ్సిగూడ, ఎల్బీనగర్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా కార్గో కౌంటర్లు ఏర్పాటు చేశారు.SHARE IT

News January 31, 2025

HYD: తల్లి మృతి.. 9 రోజులు ఇంట్లోనే మృతదేహం

image

వారాసిగూడలో విషాద ఘటన వెలుగుచూసింది. తల్లి మృతి చెందడంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన కూతుళ్లు 9 రోజులుగా ఇంట్లోనే ఉండిపోయారు. దుర్వాసన రావడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా ఈ విషయం వెలుగుచూసింది. MLA పద్మారావు చొరవతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని గాంధీకి తరలించారు. మృతురాలు శ్రీ లలిత (45) అని పేర్కొన్నారు. తల్లిని కోల్పోయిన రవళిక (25), అశ్విత (22)  కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

News January 31, 2025

HYD: గద్దర్ జయంతి.. సీఎం సందేశం

image

గద్దర్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ నివాళులర్పించారు. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు, వివక్షలకు వ్యతిరేక గొంతుక అని సీఎం రేవంత్ స్మరించుకున్నారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతో పాటు, ఆయన పేరుతో అవార్డు నెలకొల్పి ఏటా కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ప్రదానం చేయాలని నిర్ణయించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

News January 31, 2025

HYD: ఆత్మహత్యలకు కాంగ్రెస్ అసమర్థతే కారణం: హరీశ్‌రావు

image

రాష్ట్రంలో జరుగుతున్న ఆత్మహత్యలన్నింటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా కాంగ్రెస్ అసమర్థ అనాలోచిత నిర్ణయాలే కారణమని మాజీ మంత్రి, MLA హరీశ్‌రావు విమర్శించారు. నాడు BRS హయాంలో నిర్మాణ రంగానికి స్వర్గధామంగా HYD ఉండేదన్నారు. అలాంటిది మేడ్చల్ గుండ్లపోచంపల్లిలో బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ప్లాట్లు అమ్ముడు పోలేదని ఉరేసుకునే పరిస్థితి రావడం శోచనీయన్నారు. రియల్ ఎస్టేట్ ఇప్పుడు బిల్డర్లకు నరకకూపం అయ్యిందన్నారు.

News January 31, 2025

HYD: గద్దర్‌కు ముఖ్యమంత్రి నివాళి

image

ప్రజా యుద్ధనౌక గద్దర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. గద్దర్ జయంతిని ప్రజా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడంతోపాటు ఆయన పేరుతో అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది. తన కలం, గళంతో గద్దర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదారని, సమాజంలో అసమానతలు వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు.

News January 31, 2025

శనివారం HYDలో కృష్ణా జలాలు బంద్

image

HYDలో ఫిబ్రవరి ఒకటో తేదీన కృష్ణా జలాలు బంద్‌ కానున్నాయి. నల్లగొండ జిల్లాలోని నాసర్లపల్లి సబ్‌స్టేషన్‌లోని 132 KV బల్క్‌ లోడ్‌ ఫీడర్‌ పీటీఆర్ మరమ్మతులకు గురైంది. దీంతో నాగార్జున్‌సాగర్‌లోని కోదండాపూర్‌లోని వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌, పంపింగ్‌ స్టేషన్లకు విద్యుత్‌ సరఫరాలో సమస్యలు తలెత్తాయి. దీనికి TG ట్రాన్స్‌కో అధికారులు శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గం. వరకు మరమ్మతులు చేయనున్నారు.