Hyderabad

News July 21, 2024

HYD: లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ.. జాగ్రత్త..!

image

రైతు రుణమాఫీ పేరిట సైబర్ నేరస్థులు కొత్త పంథాలో బ్యాంకు ప్రొఫైల్ పేరిట వాట్సప్ ద్వారా మెసేజెస్, APK ఫైల్స్ పంపిస్తున్నారని HYD రాచకొండ సైబర్ క్రైమ్ ఏసీపీ కరుణాకర్ రావు తెలిపారు. APK ఫైల్ లింక్ క్లిక్ చేస్తే సమాచారమంతా వారి చేతుల్లోకి వెళ్తుందని, తద్వారా గూగుల్, ఫోన్‌పే లాంటివి ఉపయోగించి బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తున్నారన్నారు. అలాంటి వాటిపట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 21, 2024

HYD: 2 నిమిషాల్లో స్కానింగ్.. ఇక చాలా ఈజీ

image

గ్రేటర్ HYDలో వర్షం వచ్చినప్పుడు వరద నీటి లోతుల్లోని వాహనాలను, వాహనాల్లో చిక్కుకున్న మనుషులను గుర్తించడం హ్యాండ్‌హెల్డ్ సోనర్ స్కానర్‌తో ఈజీ కానుంది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. దాదాపు 164 అడుగుల లోతు వరకు వెళ్తుంది. 2 నిమిషాల్లో 43 వేల చదరపు అడుగుల వరకు స్కాన్ చేసి, నీటి లోపల ఉన్న వాటి చిత్రాలను పంపిస్తుంది. త్వరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు జరుగుతుంది.

News July 21, 2024

HYD: సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ

image

మణికొండలోని కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో వివిధ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరుతున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ విమలా రెడ్డి తెలిపారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ విద్యార్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు.

News July 21, 2024

HYD: BCG టీకా అందించేది వీరికే..!

image

HYD, RR, MDCL,VKB జిల్లాల్లో BCG టీకాను కింది పేర్కొన్న వారికి అందిస్తారు.
✓ప్రస్తుతం 60 సంవత్సరాలు పైబడిన వారికి
✓BMI శరీర ద్రవ్యరాశి సూచిక 18 కన్నా తక్కువ ఉన్నవారికి
✓ మద్యపానం తాగేవారికి
✓కొన్ని ఏళ్లుగా ధూమపానం తాగే వారికి
✓క్షయవ్యాధి ఉన్నవారి కుటుంబసభ్యులకు ✓ 5 ఏళ్లుగా క్షయవ్యాధితో బాధపడుతున్న వారికి అందించనున్నారు.

News July 21, 2024

HYD: క్షయకు BCG టీకాతో చెక్

image

HYD, RR, MDCL, VKB జిల్లాల పరిధిలో పెద్దలకు BCG టీకా అందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. క్షయ వ్యాధిని అంతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆగస్టులో అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మేడ్చల్ జిల్లాలో TB వ్యాధిగ్రస్థులను గుర్తించేందుకు, సర్వే నిర్వహించి, శాంపిల్స్ సేకరించి టెస్టులు చేస్తున్నారు.

News July 21, 2024

HYD: GREAT.. 12 మంది చిన్నారులను కాపాడారు

image

సికింద్రాబాద్ రైల్వే ప్రొటెక్షన్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ బృందం 12 మంది చిన్నారులను కాపాడినట్లు వెల్లడించింది. ఇద్దరు హ్యూమన్ ట్రాఫికర్లు చిన్నారులను ఎత్తుకెళ్లడానికి యత్నించగా.. పక్కా సమాచారంతో రెస్క్యూ చేసి పిల్లలను రక్షించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

News July 21, 2024

HYD: ప్రతి ఒక్కరూ ఫోన్ నెంబర్ లింక్ చేసుకోండి..!

image

HYD నగరంలోని స్థానిక ఆధార్ సెంటర్లకు వెళ్లి మొబైల్ నంబర్ లింక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. బ్యాంక్ సీడింగ్, డాక్యుమెంట్, అప్డేట్ ఆధార్, ఈ-ఆధార్ కార్డు డౌన్‌లోడ్ వంటి సేవలు పొందడం కోసం మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం ముఖ్యమన్నారు. రూ.50 చెల్లించి మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవచ్చని, వెబ్‌లింక్ bhuvan-app3.nrsc.gov.in/aadhaar ద్వారా ఆధార్ సెంటర్లను చూసుకోండి.

News July 21, 2024

HYD: ప్రాణాలు కాపాడేందుకు నూతన టెక్నాలజీ!

image

గ్రేటర్ HYDలో వరదలు ముంచెత్తినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు DRF ఆధ్వర్యంలో నూతన టెక్నాలజీ వాడనున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ ఫైటింగ్ రోబోట్లు, సోనార్ స్కానర్, రిమోట్ కంట్రోల్ లైఫ్ బాయ్, టెక్నాలజీ యూనిట్‌లను అందుబాటులోకి తేనున్నారు. ఈ టెక్నాలజీ సాయంతో ఆపదలో ఉన్నవారిని కాపడటమే కాకుండా క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి ప్రత్యామ్నాయంగా సహకరిస్తుంది.

News July 21, 2024

HYD: ‘ఉద్యమకారులకిచ్చిన హామీలు అమలు చేయాలి’

image

ఈనెల 23 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విజ్ఞప్తి చేసింది. ఫోరం రాష్ట్ర ఛైర్మన్ చీమ శ్రీనివాస్ బషీర్‌బాగ్‌లో మాట్లాడుతూ.. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చాలన్నారు.

News July 21, 2024

HYD: ఐటీ కంపెనీలకు ఆర్టీసీ అద్దె బస్సులు

image

HYD నగరంలోని కొండాపూర్, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో నిత్యం సుమారు 20 వేల మంది ఉద్యోగులు కార్లలో ప్రయాణిస్తుంటారు. దీంతో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్య రోజుకు రోజుకు పెరుగుతోంది. ట్రాఫిక్ తగ్గించేందుకు పలు ఐటీ కంపెనీలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చేందుకు ఆర్టీసీ సంస్థ నుంచి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తామని ఎండీ సజ్జనార్ హామీ ఇచ్చారు.