Hyderabad

News July 16, 2024

HYD: టాస్కుల పేరుతో రూ.11.21 లక్షలు స్వాహా 

image

ఓ యువతి వద్ద రూ.11.21 లక్షలను సైబర్ నేరగాళ్లు దోచేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ యువతికి ‘కాయిన్ సీఎక్స్’ కంపెనీ పేరుతో ఓ మెసేజ్  వచ్చింది. దాంట్లో వీడియోలకు లైక్‌లు కొట్టి పెట్టుబడులు పెడితే లాభాలు ఇస్తామని ఉంది. మొదటగా 3 టాస్కులు చేసి పెట్టుబడి పెట్టగా లాభాలు వచ్చాయి. దీంతో విడతలవారీగా రూ.11.21 లక్షలు పెట్టుబడి పెట్టింది. విత్ డ్రా కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

News July 16, 2024

HYD:‘విడాకులు ఇచ్చినా.. ఆయనే కావాలి’

image

కోర్టు విడాకులు మంజూరు చేశాక.. తిరిగి ఆయనే భర్తగా కావాలని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించిన ఘటన శంషాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాల్‌దర్వాజకు చెందన సిద్ధార్థ్, కవితల పెళ్లి తర్వాత గొడవలు జరిగాయి. వారిద్దరు కోర్టును ఆశ్రయించగా విడాకులు మంజూరు చేసింది. దీని తర్వాత సిద్ధార్థ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి మళ్లీ ఆయనే కావాలని ఇటీవల పోలీసులను ఆశ్రయించారు ఆ మహిళ.

News July 15, 2024

హైదరాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

> ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి> కన్నుల పండువగా జగన్నాథుడి రథయాత్ర> బోడుప్పల్ నూతన మేయర్‌గా తోటకూర అజయ్ యాదవ్> బాలాపూర్‌‌లో ప్రయాణిస్తున్న కారులో చెలరేగిన మంటలు> రాజేంద్రనగర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేత > ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సెక్రటేరియట్ ముట్టడి> గచ్చిబౌలి DLF వద్ద అగ్ని ప్రమాదం > దుండిగల్‌లో 3.8 కిలోల గంజాయి సీజ్

News July 15, 2024

హైదరాబాద్: పోస్టాఫీసులో 115 ఉద్యోగాలు

image

10వ తరగతి అర్హతతో BPM/ABPM జాబ్స్ భర్తీ చేయనున్నారు. HYD సిటీ డివిజన్‌లో 16, HYD సార్టింగ్ డివిజన్‌లో 12, HYD సౌత్ ఈస్ట్‌ డివిజన్‌లో 25, సికింద్రాబాద్ డివిజన్‌లో 62 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి BPM‌కు రూ.12 వేలు+అలవెన్సులు, ABPMకు రూ.10 వేలు+అలవెన్సులు శాలరీ ఇస్తారు. పూర్తి వివరాలకు www.appost.gdsonlineను సంప్రదించవచ్చు.
SHARE IT

News July 15, 2024

HYD: అధికారులకు కమిషనర్‌ ఆమ్రపాలి కీలక ఆదేశాలు

image

స్వచ్ఛ ఆటోల పనితీరుపై దృష్టి పెట్టాలని ZCలకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశాలు జారీ చేశారు. జోనల్ కమిషనర్లు, అడిషనల్ కమిషనర్లు, ఎంటమాలజి చీఫ్‌లతో ఆమె సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ ఆటో సిబ్బంది హాజరును పర్యవేక్షించాలన్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోలు రాత్రిపూట మాత్రమే చెత్త సేకరించేలా చూడాలన్నారు. వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద పెద్ద సంపుల నిర్మాణానికి టెండర్లు పిలవాలన్నారు.

News July 15, 2024

జూబ్లీహిల్స్: శ్రీనగర్‌కాలనీలో బోనాల చెక్కుల పంపిణీ

image

శ్రీనగర్ కాలనీలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బోనాల వేడుకల నిర్వహణ కోసం ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి చెక్కులను అందజేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఆషాఢ మాసబోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గతం లో కంటే ఎక్కువ నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వం రూ. 15 కోట్లు మంజూరు చేస్తే .. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 20 కోట్లు మంజూరు చేసిందన్నారు.

News July 15, 2024

గచ్చిబౌలి DLF వద్ద అగ్ని ప్రమాదం

image

గచ్చిబౌలిలోని DLF బిల్డింగ్ గేట్ నంనంబర్-3 వద్ద గోల్కొండ చెఫ్స్ పక్కన టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టిఫిన్ సెంటర్‌‌లోని కిచెన్‌లో మంటల చెలరేగాయని ప్రత్యక్షసాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కిచెన్ నుంచి అందరిని బయటికి పంపడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజిన్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

News July 15, 2024

HYD: మహిళపై అత్యాచారయత్నం

image

మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నానికి పాల్పడ్డ ఘటన అల్వాల్ PSపరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీ‌నగర్‌కు చెందిన మహిళ శనివారం యాప్రాల్ నుంచి ఆటోలో అల్వాల్‌కు వచ్చింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆటోలో ఎక్కి ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. లోతుకుంటలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించగా.. ఆమె తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News July 15, 2024

HYD: PSలో హోంగార్డు హల్‌చల్

image

‘నా కొడుకునే రిమాండ్ చేస్తారా మీకెంత ధైర్యం ఉండాలి’ అంటూ ఓ హోంగార్డు PSలో హల్‌చల్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఘట్కేసర్‌కు చెందిన ఏ.వెంకటేశ్‌‌ను చైన్‌స్నాచింగ్ కేసులో పోలీసులు రిమాండ్ చేశారు. నిందితుడి తండ్రి హోంగార్డుగా పని చేస్తున్నారు. శనివారం రాత్రి స్థానిక PSలోకి వెళ్లి ఏకంగా క్రైమ్ సీఐ శ్రీనివాస్‌నే ‘నీ అంతు చూస్తా’ అంటూ ఇష్టమొచ్చినట్లు తిడుతూ రచ్చచేశారు. అతడి మీద కూడా కేసు నమోదైంది.

News July 15, 2024

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీ విస్తరణకు ప్లాన్

image

ఓఆర్ఆర్ వరకు జీహెచ్ఎంసీని విస్తరించినందుకు ప్రభుత్వం నెమ్మదిగా అడుగులు వేస్తోంది. ఇటీవల వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి దీనిపై నివేదిక సిద్ధం చేసి నిపుణుల కమిటీకి అందజేశారు. ఓఆర్ఆర్ లోపల ఉన్న మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు, గ్రామ పంచాయతీలను కలిపి జీహెచ్ఎంసీ కిందికి తీసుకువస్తే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం భావిస్తుంది.