India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
లైఫ్ సైన్సెస్ కంపెనీలకు రాజధానిగా హైదరాబాద్ ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం గచ్చిబౌలిలో లిల్లీ ఫార్మా కంపెనీని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. 2047 వరకు 30 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మారేందుకు కృషి చేస్తున్నామని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ గ్లోబల్ జీసీసీ రాజధానిగా ఎదిగిందని పేర్కొన్నారు.
బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కల్తీ కల్లు వ్యవహారంలో అబ్కారీ శాఖ సీరియస్ అయ్యింది. ఇందులో భాగంగా బాలానగర్ ఎక్సైజ్ CI వేణు కుమార్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని డీటీఎఫ్ నర్సిరెడ్డి, ఏఈఎస్లు మాధవయ్య, జీవన్ కిరణ్, ఈఎస్ ఫయాజ్ అధికారులకు సంబంధించిన పాత్రపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
జేఎన్టీయూ హైదరాబాద్ & జర్మనీలో టాప్-3లో ఉన్న Reutlingen పబ్లిక్ యునివర్సిటీ కలసి సంయుక్తంగా అందిస్తున్న 3 ఇంటర్నేషనల్ డిగ్రీ కోర్సులలో అడ్మిషన్లు మొదలయ్యాయి. జేఈఈ, టీజీఎంసెట్, గేట్ & టీజీపీజీసెట్ రాసిన విద్యార్థులు www.jntuh.ac.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. కోర్సులో ఎంపికైన విద్యార్థులకు స్కాలర్షిప్ ఉంటుంది. వారానికి 20 గంటల పనికి పర్మిషన్, 18 నెలల వర్క్ పర్మిట్ కూడా లభిస్తుంది.
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం ‘పీ.వీ.రమణ రంగస్థల స్మారక పురస్కారం’ ప్రదానం చేయనున్నారు. 2024-25 సంవత్సరానికిగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు యూనివర్సిటీ ఓ సర్కులర్ విడుదల చేసింది. ఆగస్టు 1లోగా రంగస్థలంలో కృషి చేసిన నటులు, సాంకేతిక నిపుణులు అర్హులైన వారు తెలుగు విశ్వవిద్యాలయం బాచుపల్లి ప్రాంగణంలో తమ బయోడేటాతో దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు.
HYD సైబర్ క్రైమ్ పోలీసులు వివిధ కేసుల్లో మొత్తం 25 మందిని అరెస్టు చేసి రూ.3.67కోట్లను బాధితులకు రిఫండ్ చేశారు. పట్టుబడిన నేరగాళ్లపై దేశవ్యాప్తంగా 453 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోని వాటి సంఖ్య 66గా ఉంది. ఈ క్రమంలో చైల్డ్ పోర్న్ వీడియోల కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు 22 కేసులు నమోదు చేశారు.
యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ పాసై మెయిన్కు అర్హత సాధించిన అభ్యర్థులకు సింగరేణి సంస్థ గుడ్ న్యూస్ ప్రకటించింది. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి గడువు పొడిగించింది. ఈనెల 12 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సంస్థ సీఎండీ బలరాం తెలిపారు. ఈ పథకం కింద అభ్యర్థులకు రూ.లక్ష ఆర్థికసహాయం అందజేస్తామన్నారు.
‘అన్నా.. మన ఓయూలో డిగ్రీ, పీజీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అడ్మిషన్ల నోటిఫికేషన్ను అధికారులు మరచిపోయినట్టున్నారు’ అని విద్యార్థులు చర్చించుకుంటున్నారు. ఈ విద్యా సంవత్సరానికి ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదు. అంబేడ్కర్, IGNO వర్సిటీలు నోటిఫికేషన్ విడుదల చేసి అడ్మిషన్లు ప్రారంభించాయి. ఓయూ అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయడంలేదు. ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేయాలని పలువురు కోరుతున్నారు.
జర్నలిస్టులు ఇక ఎప్పుడు పడితే అప్పుడు GHMC ప్రధాన కార్యాలయంలోకి వెళ్లడానికి వీలుపడకపోవచ్చు. రెగ్యులర్ జర్నలిస్టులతో పాటు యూట్యూబ్ ఛానళ్ల వారు నిత్యం అధికారులను కలిసేందుకు వస్తున్నారని, దీంతో విధినిర్వహణకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. అందుకే అక్రిడిటేషన్ ఉన్న వారిని మాత్రమే వారానికి ఒకసారి అనుమతించాలని నిర్ణయించినట్లు సమాచారం.
తెలంగాణలో మూడు పార్టీలు మాయం కానున్నాయి. అన్ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ పార్టీలైన ఏపీ రాష్ట్ర సమైక్య సమితి పార్టీ, జాతీయ మహిళా పార్టీ, యువ తెలంగాణ పార్టీలు రాష్ట్రంలో 2019 నుంచి లోక్సభ, అసెంబ్లీ, ఉపఎన్నికల్లో పోటీచేయలేదు. దీంతో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఆయా పార్టీలకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ తొలగింపు ప్రతిపాదనకు నోటీసులు పంపించారు.
కల్తీ కల్లు <<17017648>>రాజేసిన అగ్గి<<>> ఇంకా చల్లారడంలేదు. ఈ ప్రమాదపు కల్లు తాగి అస్వస్థతకు గురై చికిత్స పొందుతూ పెద్ద గంగారాం (70) అర్ధరాత్రి 1:30కు గాంధీ హాస్పిటల్లో మృతి చెందాడు. కూకట్పల్లి PS పరిధిలోని ఆదర్శనగర్లో ఆయన నివాసం ఉండేవారు. ఈయన మరణంతో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. 30 మందికి పైగా వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స పొంతుతున్నారు.
Sorry, no posts matched your criteria.