Karimnagar

News September 15, 2024

జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. మరొకరి పరిస్థితి విషమం

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాస మూలమలుపు వద్ద ఆదివారం చోటుచేసుకుంది. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్న ట్రావెల్ బస్సు, వెల్గొండ నుంచి జగిత్యాల వైపు వస్తోన్న స్కూటీ, బైకును ఢీకొంది. దీంతో అల్లీపూర్‌కు చెందిన ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు తప్పని నిరీక్షణ!

image

కొత్త రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా మోక్షం కలగడం లేదు. తొమ్మిదేళ్ల క్రితం నిలిచిపోయిన రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ నేటికీ పునరుద్ధరించుకోలేదు. ఆహార భద్రతతో పాటు సంక్షేమ పథకాలకు ఈ కార్డే కీలకం కావడంతో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా మంది ప్రభుత్వం రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తోందని దరఖాస్తుదారులు ఎదురుచూస్తున్నారు.

News September 15, 2024

ఉమ్మడి KNR జిల్లాలో పాఠశాలల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఈ విధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 784 పాఠశాలల్లో 98,240 విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 1,071 పాఠశాలల్లో 1,57,648 విద్యార్థులు, జగిత్యాల జిల్లాలో 1,165 పాఠశాలల్లో 1,59,585 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 659 పాఠశాలల్లో 87,390 విద్యార్థులు ఉన్నారు.

News September 15, 2024

KNR: ట్రైన్‌పై రీల్స్.. విద్యుత్ వైర్లు తాకి గాయాలు

image

రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి యువకుడు గాయాలపాలైన ఘటన WGL జిల్లా కాజీపేటలో శనివారం జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల ప్రకారం.. KNR జిల్లా హుజురాబాద్‌కు చెందిన రాజ్ కుమార్(18) కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపై సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. MGMలో చికిత్స అందిస్తున్నారు.

News September 15, 2024

జగిత్యాల: విష జ్వరాలు తగ్గాలని గణపతి హోమం

image

విష జ్వరాలు తగ్గాలని జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ గ్రామంలో భరత్‌నగర్ యువసేన ఆధ్వర్యంలో శనివారం గణపతి హోమం నిర్వహించారు. గత రెండు నెలల నుంచి గ్రామంలో విష జ్వరాలతో పాటు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు వారు తెలిపారు. అనంతరం మహిళలు లక్ష్మీ పూజ, కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అనంతరం సామూహికంగా అన్నదానం నిర్వహించారు.

News September 15, 2024

గణేష్ నిమర్జనం ఉత్సవానికి పటిష్ట బందోబస్తు: ఎస్పీ అఖిల్ మహదేవ్

image

గణేష్ నిమజ్జనోత్సవానికి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని.. భక్తులు, మండపాల నిర్వహకులు పోలీస్ వారి సూచనలు పాటిస్తూ నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. శనివారం సాయంత్రం సిరిసిల్ల పట్టణ పరిధిలోని బివై నగర్, జేపీ నగర్, పద్మనగర్, సిక్ వాడ, సంజీవయ్య నగర్ మొదలగు ప్రాంతల్లో ఏర్పాటు చేసిన పలు గణేష్ మండపాలని పరిశీలించారు.

News September 15, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,90,723 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,71,772, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.57,700, అన్నదానం రూ.61,251 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూజలందుకుంటున్న గణనాథులు.
@ తంగళ్లపల్లి మండలంలో పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో తేలుకాటుతో వ్యక్తి మృతి.
@ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో విష జ్వరంతో బాలిక మృతి.
@ అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న సిరిసిల్ల కలెక్టర్.

News September 14, 2024

డీజేల వినియోగం, బాణసంచా వాడకంపై నిషేధం: KNR సీపీ

image

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి కీలక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న జరగనున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా జరిగే శోభయాత్ర రూట్లు, నిమజ్జన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా గణేశ్ శోభాయాత్రలో డీజేల వినియోగంతో పాటు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు.

News September 14, 2024

గోదావరి నది బ్రిడ్జిపై నిమజ్జనానికి ఏర్పాట్లు

image

గోదావరిఖని శివారు గోదావరి నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో MLA రాజ్ ఠాకూర్ చొరవతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 16న ఉదయం నుంచి సాయంత్రంలోగా నిమజ్జనం పూర్తి చేయాలని గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచన మేరకు బ్రిడ్జిపై నుంచి గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంటున్నారు.