India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. గత 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.3°C నమోదు కాగా, మానకొండూర్ 40.9, గన్నేరువరం 40.4, రామడుగు 40.2, జమ్మికుంట 40.1, చొప్పదండి 39.9, తిమ్మాపూర్ 39.7, చిగురుమామిడి 39.6, శంకరపట్నం 39.5, కరీంనగర్ రూరల్ 39.4, సైదాపూర్ 39.3, కరీంనగర్ 39.2, వీణవంక 39.0, కొత్తపల్లి 38.6, హుజూరాబాద్ 38.4, ఇల్లందకుంట 38.0°C గా నమోదైంది.
హుజురాబాద్ పట్టణంలోని సాయి రూప ఫంక్షన్ హాల్లో ఈ నెల 19న స్వచ్ఛ ఎగ్జిబిషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. జిల్లాలోనే తొలిసారిగా పర్యావరణంపై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు,, జమ్మికుంట కృషి విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎగ్జిబిషన్లను ప్రదర్శిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథులుగా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పాల్గొంటారాని తెలిపారు.
KCRకు సెంటిమెంట్ జిల్లా అయిన ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో ఈనెల 27న BRS రజతోత్సవ సభ నిర్వహించనున్న విషయం తెలిసిందే. 20లక్షల మందితో 1500ఎకరాల్లో సభ ఏర్పాటు చేయనున్నారు. TRSని పెడుతున్నట్లు మొదటిసారిగా KNR గడ్డపైనే KCR ప్రకటించారు. రైతుబంధు, దళితబంధు పథకాలను కూడా ఈ జిల్లాలోనే ప్రారంభించారు. అధికారం కొల్పోయిన తర్వాత ఉమ్మడి KNR(ఎల్కతుర్తి)లో BRS మొదటిసారిగా భారీఎత్తున సభ పెడుతున్నందున ఆసక్తి నెలకొంది.
లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ నియమాకం చేస్తూ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి,సీనియర్ సివిల్ జడ్జి K.వెంకటేష్ ఉత్తర్వులు జారీచేశారు. డిప్యూటీ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్గా T.మహేష్, అసిస్టెంట్ లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్గా K.మౌనిక నియమితులయ్యారు. ఆర్థిక స్థోమత లేని నిందితులకు వీరు ఉచిత న్యాయ సహాయం అందిస్తారు. లీగల్ డిఫెన్స్ కౌన్సిల్స్ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ అభినందించారు.
కరీంనగర్ కలెక్టర్లో ఇందిరమ్మఇండ్ల పథకంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికచేసిన 15 గ్రామాలలో 2027 మందికి ఇల్లు మంజూరు చేసామని పేర్కొన్నారు. 730 ఇండ్లకు పూర్తయిందని,114 బేస్మెంట్ లెవల్కు చేరాయని తెలిపారు. రెండోదఫా ఇండ్లను గ్రామాలు, మున్సిపల్వార్డుల వారిగా మంజూరు చేసేందుకు అలాట్మెంట్ జాబితా తయారుచేయాలని అన్నారు.
గురువారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర మున్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ LRSపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 30 వరకు LRS చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రచారం కల్పించాలన్నారు. ఫీజు చెల్లిస్తే లేఔట్ల భూక్రమబద్ధీకరణ మంజూరు పత్రాలను జారీ చేయాలని, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఏసీ ప్రపుల్ దేశాయ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కల్యాణ మండపంలో గురువారం భూ భారతి కొత్త ఆర్.ఓ.ఆర్ చట్టంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యకమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ఆర్డీవో మహేశ్వర్ హాజరై మాట్లాడారు. భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం పై రైతులకు అవగాహన కల్పించారు. భూభారతిపై ఎలాంటి సందేహాలు ఉన్న అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.
కరీంనగర్ కశ్మీర్ గడ్డలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి డిజిటల్ తరగతులను ప్రారంభించారు. డిజిటల్ విద్యా బోధనతో విద్యార్థులకు త్వరగా అవగాహన కలుగుతుందన్నారు. ఉపాధ్యాయులు మెలకువలతో పాఠాలను బోధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు అధికంగా వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 41.0°C నమోదు కాగా, రామడుగు 40.9, జమ్మికుంట 40.8, మానకొండూర్ 40.7, చిగురుమామిడి, తిమ్మాపూర్ 40.3, చొప్పదండి, కరీంనగర్ రూరల్ 40.2, కరీంనగర్, గన్నేరువరం 40.0, శంకరపట్నం, కొత్తపల్లి 39.9, వీణవంక 39.3, హుజూరాబాద్ 38.7, ఇల్లందకుంట 38.6, సైదాపూర్ 38.1°C గా నమోదైంది.
భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై ప్రజలకు ఈనెల 17 నుంచి 30వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాల్లో అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు.17న తిమ్మాపూర్, గన్నేరువరం, 19న హుజురాబాద్, 22న రామడుగు, గంగాధర, 23న చొప్పదండి, 24న మానకొండూర్, శంకరపట్నం, 25న జమ్మికుంట, ఇల్లందకుంట, 26న కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, 29న చిగురుమామిడి, సైదాపూర్, 30న వీణవంక మండలాల్లో సదస్సులు నిర్వహించనున్నారు.
Sorry, no posts matched your criteria.