Karimnagar

News June 28, 2024

సిరిసిల్ల: మొన్న ప్రియుడు.. ఈరోజు ప్రియురాలు మృతి

image

సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. కాగా మొన్న ప్రియుడు.. ఈ రోజు ప్రియురాలు చనిపోయింది. గూడెం గ్రామానికి చెందిన <<13504961>>చందు<<>>, భాగ్యలక్ష్మి కరీంనగర్‌లోని ఓ పార్కులో ఈ నెల 24న పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రియుడు అక్కడే చనిపోగా.. ప్రియురాలు ఎల్లారెడ్డిపేటలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు మరణించింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News June 28, 2024

కొండగట్టులో ఘనంగా జ్యేష్ఠాభిషేకం

image

ప్రముఖ కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి పుణ్యక్షేత్రంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకంఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అష్టోత్తర శతకళశాలతో శ్రీ స్వామివారికి అభిషేకాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ చంద్రశేఖర్, స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు జితేంద్ర స్వామి, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి స్వామి, సూపరింటెండెంట్ శ్రీనివాస్ శర్మ తదితరులు ఉన్నారు.

News June 28, 2024

కరీంనగర్: నియామకపత్రం అందుకున్నా ‘నో జాబ్’!

image

నియామకపత్రం అందుకున్నప్పటికీ ఓ అభ్యర్థిని ఉద్యోగానికి దూరమైంది. కరీంనగర్ (D) గంగాధర (M) నారాయణపూర్‌కు చెందిన భానుప్రియ గురుకులంలో PGT గణితం దివ్యాంగుల కోటాలో ఎంపికై నియామకపత్రం అందుకుంది. 40% వైకల్యం ఉన్నవారు దివ్యాంగులుగా అర్హులు కాగా ఆమెకు 68% ఉన్నట్లు సదరం క్యాంపులో గుర్తించారు.అయితే తాజా వైద్య పరీక్షల్లో 39% వైకల్యం ఉందని తేలడంతో ఆమె ఉద్యోగానికి అనర్హురాలంటూ తేల్చారు. న్యాయం చేయాలని కోరుతోంది.

News June 28, 2024

కరీంనగర్: నర్సింహులపల్లిలో అరుదైన విగ్రహం!

image

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నర్సింహులపల్లిలో నాలుగో శతాబ్దం నాటి సున్నపు రాతితో చేసిన 3 అంగుళాల ఎత్తున్న అరుదైన వరాహమూర్తి శిల్పాన్ని గుర్తించినట్లు తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఉత్తరాభిముఖుడైన ఈ మూర్తి అపురూపమైనదని శిల్పాన్ని పరిశీలించిన స్థపతి చరిత్రకారులు డా.ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. గతంలో ఇదే గ్రామంలో పురాతన రాతి పరికరాలు లభించినట్లు వారు గుర్తు చేశారు.

News June 28, 2024

కరీంనగర్: 4 వరకు బీ ఫార్మసీ పరీక్ష ఫీజు గడువు

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించే బీ ఫార్మసీ (ఎనిమిదో సెమిస్టర్) పరీక్ష ఫీజు గడువు జులై 4 వరకు ఉందని ఎస్‌యూ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. అపరాధ రుసుం రూ.300తో జులై 8 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News June 28, 2024

గోదావరిఖని: వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

image

గోదావరిఖని పట్టణంలోని ఓ కాలనీలో కొనసాగుతున్న వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు గురువారం అర్ధరాత్రి ఆకస్మిక దాడి చేశారు. వ్యభిచార గృహం నిర్వాహకురాలితో పాటు నలుగురు విటులు, మరి కొందరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. దూర ప్రాంతాల నుంచి మహిళలు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది.

News June 28, 2024

నేడు కొండగట్టులో జ్యేష్ఠాభిషేకం

image

మాల్యాల మండలం కొండగట్టు శ్రీఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం జ్యేష్ఠాభిషేకం నిర్వహించనున్నట్లు ఈవో చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం స్వామి వారికి సుగంధ ద్రవ్యాలు కలిపిన 108 కలశాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించి పూజలు చేయనున్నట్లు చెప్పారు. ప్రతి సంవత్సరం గ్రీష్మ రుతువులో వేసవి తాపం తగ్గి వర్షాలు సమృద్ధిగా కురవాలని స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం చేస్తామని అర్చకులు కపిందర్ పేర్కొన్నారు.

News June 28, 2024

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి

image

జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేశ్‌పై జరిగిన దాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. ఉద్యోగులపై దాడులు సరికాదని రవాణా శాఖ మంత్రిగా ఉద్యోగులకు అండగా ఉంటానని అన్నారు. కమీషనర్ రమేశ్‌పై జరిగిన దాడి ఘటనపై పోలీసులతో మాట్లాడారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు. భవిష్యత్తులో అధికారులపై దాడి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు.

News June 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ఆర్డిఓ ఆఫీసును తనిఖీ చేసిన కలెక్టర్.
@ మెట్పల్లి మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి.
@ వేములవాడ రాజన్న ఆలయానికి భక్తుడి రూ.35 లక్షల విరాళం.
@ బోయిన్పల్లి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ కమలాపూర్ మండలంలో స్కూల్ వ్యాన్, కారు ఢీ.. ముగ్గురికి తీవ్ర గాయాలు.
@ కరీంనగర్‌లో గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి.

News June 27, 2024

రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని మంత్రి వినతి

image

మంత్రి శ్రీధర్ బాబు, MLA అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నేడు కేంద్ర సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి జితన్ రామ్ మాంఝీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలను నెలకొల్పాలని, దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని కోరామన్నారు. దీంతో కేంద్ర మంత్రి సాగుకూలంగా స్పందించినట్లు తెలిపారు.