India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నిరుద్యోగులకు ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. SEPT 3న జిల్లా ఉపాధి కార్యలయంలో ఈ JOB MELA నిర్వహిస్తునట్లు చెప్పారు. 120పోస్టులు ఉన్నాయని.. ఫార్మాసిస్టు, సేల్స్ అసిస్టెంట్, ఆడిట్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. 10TH నుంచి ఫార్మసీ చదివినవారు అర్హులని, వయసు 18-30ఏళ్లలోపు ఉండాలన్నారు. 9392310323, 9908230384 నంబర్లను సంప్రదించవచ్చు.
కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలోకి వచ్చే ప్రధాన కాలువ చింతకుంట వద్ద చేపలు పట్టెందుకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో పడిన రహీం మృతదేహం లభ్యమైనట్లు శనివారం కొత్తపల్లి పోలీసులు తెలిపారు. అబ్దుల్ రహీం(20) అనే వ్యక్తి గురువారం చేపలు పట్టడానికి వెళ్లి చింతకుంట ఎస్ఆర్ఎం కాలేజ్ వెనకాల ఉన్న వరద కాలువలో పడి గల్లత్తు కాగా, రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
వయోవృద్ధులు, తల్లిదండ్రుల పోషణ, సంక్షేమ చట్టం 2007 అమలు తీరు, ట్రిబ్యునల్ ఉత్తర్వులు, అమలుపై వృద్ధుల సంక్షేమ కమిటీ సభ్యులు అధికారులతో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సీపీ గౌస్ ఆలంతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. వయోవృద్ధుల పోషణ, సంరక్షణ చట్టం అనుసరించి ట్రిబ్యునల్ ఇస్తున్న ఉత్తర్వులను పాటిస్తున్నది లేనిది పర్యవేక్షించాలన్నారు. తద్వారా వృద్ధులు, తల్లిదండ్రులకు న్యాయం చేయాలన్నారు
KNR జిల్లాలో పౌరహక్కుల దినోత్సవం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు విజిలెన్స్ & మానిటరింగ్ కమిటీ జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేసింది. ప్రతి నెల 30న జరిగే ఈ సమావేశాల గురించి ప్రజలకు తెలియజేయాలని కోరింది. సమావేశం జరిగే గ్రామం, మండలం గురించి 2 లేదా 3 రోజుల ముందు తెలియజేయాలని సూచించింది. ఈ మేరకు ప్రజలు ఈ సమావేశాలలో పాల్గొని తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చని SC అభివృద్ధి శాఖ DD నాగైలేశ్వర్ తెలిపారు.
SRR కళాశాలలోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ప్రముఖ రంగస్థల కళాకారుడు తూర్పాటి కిష్టయ్య హాజరై మాట్లాడుతూ.. మన తెలుగు భాషలో ఎంతో రసరమ్యమైన పద్యాలు ఉన్నాయన్నారు. ప్రిన్సిపల్ రామకృష్ణ మాట్లాడుతూ.. మాతృభాషను విస్మరిస్తే అవి మనం కోల్పోతామని తెలిపారు. తెలుగు విభాగ అధ్యక్షులు డా. బూర్ల చంద్రశేఖర్ తదితరులున్నారు.
కరీంనగర్ జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు, అపరిశుభ్ర లాట్రిన్లపై సర్వే నిర్వహించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మే 21 నుంచి జూన్ 20వ తేదీ వరకు 318 గ్రామపంచాయతీలు, నాలుగు మున్సిపాలిటీలో ఈ సర్వే జరిగింది. సర్వేలో ఎవరూ మాన్యువల్ స్కావెంజర్లు లేరని, అపరిశుభ్ర లాట్రిన్లు కూడా లేవని తేలింది. దీంతో కరీంనగర్ జిల్లాను మాన్యువల్ స్కావెంజర్ రహిత జిల్లాగా కలెక్టర్ పమేలా సత్పతి గురువారం ప్రకటించారు.
కరీంనగర్ లోని లోయర్ మానేరు జలాశయాన్ని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే గురువారం సందర్శించారు. డ్యాములోకి వస్తున్న వరద ప్రవాహం వివరాలు తెలుసుకున్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. జిల్లాలోని కుంటలు, చెరువుల పరిస్థితిని ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.
TG యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా నూతన కోఆర్డినేటర్ నియామకం గురువారం జరిగింది. కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్లుగా కడారి కుమార్, ముక్కెర సతీష్ కుమార్ లు నియామకమయ్యారు. అదేవిధంగా మల్లికార్జున్, ప్రశాంత్ లను కో-కో ఆర్డినేటర్లుగా నియమించారు. వీరితో పాటు 6 అసెంబ్లీ కోఆర్డినేటర్లను నూతనంగా ఎంపిక చేశారు. స్థానిక సంస్థల విజయం కోసం పార్టీ కార్యక్రమాలను సోషల్ మీడియా ప్రచారంలో నియామకాలు జరిగాయి.
కరీంనగర్ లోయర్ మానేరు డ్యాంలో వరద ప్రవాహం పెరుగుతుండడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మిడ్ మానేరు నుంచి వరద లోయర్ మానేరు డ్యాంలోకి వస్తుందని, రేపు 10 గంటల వరకు స్పిల్వే వరద గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలే అవకాశం ఉందని తెలిపారు. నది దిగువన గుండా పరిసర ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మానేరు నదిని దాటే ప్రయత్నాలు చేయవద్దని కోరారు.
KNR బస్టాండ్ ఆవరణలోని సమావేశ మందిరంలో ఆర్టీసీలో 2024-25 ఆర్థిక సం.కి సంబంధించి 4వ త్రైమాసికంలో, 2025-26 ఆర్థిక సం.మొదటి త్రైమాసికంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రగతి చక్ర అవార్డుల ప్రదానం చేశారు. ఇందులో భాగంగా రెండు త్రైమాసికాలకు గాను 57మంది ఉద్యోగులు, 2 బస్ స్టేషన్లకు అవార్డులు ప్రదానం చేశారు. KNR RM బి.రాజు, డిప్యూటీ RMలు ఎస్. భూపతిరెడ్డి, పి.మల్లేశం ఉద్యోగులకు అవార్డులు అందించారు.
Sorry, no posts matched your criteria.