Karimnagar

News December 7, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ తొలగిపోతుందని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News December 7, 2025

ఎన్నికలు పూర్తయ్యే వరకు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలు: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకు జిల్లా అంతటా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లాలో మూడో దశ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఎన్నికల కోడ్ తొలగిపోతుందని ఆమె స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

News December 6, 2025

గ్రామపంచాయతీ ఎన్నికల భద్రతపై సీపీ గౌష్ ఆలం సమీక్ష

image

గ్రామ పంచాయతీ ఎన్నికల భద్రత ఏర్పాట్లపై కరీంనగర్ సీపీ గౌష్ ఆలం శనివారం కమిషనరేట్‌లో పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని సీపీ స్పష్టం చేశారు. రౌడీ షీటర్ల బైండోవర్‌ను పూర్తి చేసి, వారిపై నిరంతర నిఘా ఉంచినట్లు తెలిపారు.

News December 6, 2025

రక్త సంబంధీకుల నుంచి బాబు దత్తత

image

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య ఆధ్వర్యం పిల్లలు లేని దంపతులు తమ రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత ఉత్తర్వులను శనివారం జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దంపతులకు అందజేశారు. దత్తత ప్రక్రియ తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండాలని, దీని కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

రక్త సంబంధీకుల నుంచి బాబు దత్తత

image

జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, మిషన్ వాత్సల్య ఆధ్వర్యం పిల్లలు లేని దంపతులు తమ రక్త సంబంధీకుల నుంచి 12 నెలల బాబును చట్టపరంగా దత్తత తీసుకున్నారు. ఈ దత్తత ఉత్తర్వులను శనివారం జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి దంపతులకు అందజేశారు. దత్తత ప్రక్రియ తప్పనిసరిగా చట్టబద్ధంగా ఉండాలని, దీని కోసం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.

News December 6, 2025

హోంగార్డుల సేవలు అమూల్యం: సీపీ గౌష్ ఆలం

image

63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీ గౌష్ ఆలం, శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డుల పాత్ర కీలకమని కొనియాడారు. అత్యవసర విధుల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ఆయన ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించారు. క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు పంపిణీ చేశారు.

News December 6, 2025

కరీంనగర్: ఈ నెల 22 వరకూ ఫీజు చెల్లించవచ్చు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ ప్రథమ, ద్వితీయ, ఎంబీఏ తృతీయ, ద్వితీయ విడత సప్లిమెంటరీ పరీక్షా ఫీజు గడువు ఈనెల 22 వరకు ఉన్నట్లు కరీంనగర్ స్టడీ సెంటర్ కో-ఆర్డినేటర్ ఏం సత్య ప్రకాష్ తెలిపారు. ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు.

News December 6, 2025

EVMలకు కట్టుదిట్టమైన భద్రత.. వివిధ పార్టీలతో పరిశీలన

image

ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్ శనివారం తనిఖీ చేశారు. ఆర్డీఓ మహేశ్వర్‌తో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా పలు పార్టీల ప్రతినిధులు ఈ పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవీఎంలు, వీవీప్యాట్లకు ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలు, పోలీస్ గార్డుల విధులను ఆమె పర్యవేక్షించారు.

News December 6, 2025

కరీంనగర్‌: అంబేడ్కర్‌కు బండి సంజయ్ నివాళి

image

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ సేవలను కొనియాడుతూ.. దేశాభివృద్ధికి ఆయన అందించిన స్ఫూర్తిని గుర్తుచేసుకున్నారు. అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

News December 6, 2025

కరీంనగర్‌లో రెచ్చిపోతున్న ‘భూ’ బకాసురులు..!

image

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో భూ మాఫియా మళ్లీ రెచ్చిపోతుంది. భగత్ నగర్‌లోని ఓ స్థలాన్ని మాజీ కార్పొరేటర్ కబ్జా చేయగా లేక్ PS ముందు ఓ ఫ్లాట్లో నిర్మించిన గోడను కూల్చేశారు. రాంనగర్‌లోని పార్క్ స్థలమూ కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. అభిషేక్ మహంతి CPగా ఉన్నప్పుడు కబ్జాలపై వచ్చే ఫిర్యాదుల పరిశీలనకు ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఏర్పాటు చేసి భూ బకాసురులపై ఉక్కుపాదం మోపారు. CP మారడంతో ఆ కార్యక్రమాలు నిలిచిపోయాయి.