Karimnagar

News September 10, 2024

కరీంనగర్: ఎమ్మెల్సీ పదవికి ఎత్తుగడలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 30 నుంచి ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించాలని కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో ప్రధాన పార్టీలు బలమైన నాయకులను పోటీలో దింపేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. ఆశావహులు కూడా పోటీలో నిలబడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.

News September 10, 2024

జగిత్యాల: విష జ్వరంతో విద్యార్థి మృతి

image

విష జ్వరంతో విద్యార్థి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. ధర్మపురి మండల కేంద్రంలో హనుమాన్ వీధికి చెందిన గజ్జల రామ్ చరణ్(10) 4వ తరగతి చదువుతున్నారు. వారం రోజులుగా జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఆసుపత్రిలో వైద్యం వికటించడంతోనే తమ కుమారుడు మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

News September 10, 2024

బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ప్రజావాణిలో వికలాంగుడి నిరసన

image

తనకు వికలాంగుల పెన్షన్ తో పాటుగా బ్యాటరీ సైకిల్ ఇవ్వాలని ఓ దివ్యాంగుడు జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశాడు. కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన సాయిలు అయిదేళ్ల క్రితం ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. అప్పటి నుంచి పనులకు వెళ్లలేక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నట్లు వాపోయాడు.

News September 9, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కాళోజి జయంతి. @ ధర్మారం మండలంలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ ముస్తాబాద్ మండలంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. @ తంగళ్ళపల్లి మండలంలో విద్యుత్ షాక్ కు గురైన విద్యార్థిని. @ జగిత్యాలలో డబుల్ బెడ్ రూమ్ ల దరఖాస్తులకు గడువు పెంపు. @ గురుకులాలను తనిఖీ చేయాలని అధికారులకు సూచించిన సిరిసిల్ల కలెక్టర్. @ సిరిసిల్ల ప్రజావాణికి 96 ఫిర్యాదులు.

News September 9, 2024

జగిత్యాల: తొమ్మిది మంది ఎమ్మార్వోల బదిలీ

image

జగిత్యాల జిల్లాలో 9 మంది ఎమ్మార్వోలను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. కథలాపూర్ ఎమ్మార్వోగా వి.వినోద్‌, పెగడపల్లి MROగా రవీందర్ నియామకమయ్యారు. ఆర్.శ్రీనివాస్ మెట్పల్లికి, కథలపూర్‌లో పనిచేస్తున్న ముంతాజ్బుద్ధిన్ బీర్పూర్ బదిలీ అయ్యారు. ఏ.శ్రీనివాస్ జగిత్యాల రూరల్, సి.రామ్మోహన్ జగిత్యాల అర్బన్‌కు బదిలీ చేశారు. వరందన్ సారంగాపూర్, రమేష్ కొడిమ్యాలకు బదిలీ అయ్యారు.

News September 9, 2024

శృంగేరి పీఠానికి బయలుదేరిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

image

వేములవాడ ఎమ్మెల్యే , ఆది శ్రీనివాస్ ఆదివారం రాత్రి శృంగేరి పీఠానికి బయలుదేరారు. దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు శృంగేరి పీఠాధిపతుల అనుమతులు పొందడానికి వెళ్లినట్టు తెలిపారు. వివిధ నిర్మాణాల నమూనాలు, నిర్మాణ ప్రాంతాల ఫొటోలతో పీఠాధిపతులకు వివరించనున్నారు.

News September 9, 2024

కరీంనగర్: భారీగా పెరుగుతున్న నిత్యావసర సరకుల ధరలు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూరగాయలు, వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా తగ్గిపోయింది. దీంతో ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. పది రోజుల్లోనే వెల్లుల్లి కిలో ధర రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.400 వరకు ఉంది. అటు ఉల్లి ధర కిలో రూ.30 ఉండగా, ప్రస్తుతం రూ.50 నుంచి రూ.60 దాకా పలుకుతోంది.

News September 9, 2024

కరీంనగర్: 20 లోపు దరఖాస్తులకు అవకాశం

image

కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో నాలుగో విడుత ప్రవేశాల కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ అశోక్ కుమార్ ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణత సాధించి, ఆసక్తి గల విద్యార్థులు www.iti.telangana.gov.in వెబ్ సైట్‌‌లో రూ.100 రుసుం చెల్లించి ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News September 9, 2024

వేములవాడలో రోడ్ల వెడల్పునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

image

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రోడ్ల వెడల్పు కోసం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మూలవాగు బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు ఇరుకు రోడ్లతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. రోడ్ల వెడల్పు కోసం ఏళ్ల తరబడి సర్వేలతో కాలయాపన చేశారు. కాగా ఎట్టకేలకు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో ప్రభుత్వం రోడ్ల విస్తరణకు ఆమోదం తెలిపింది. దీంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News September 9, 2024

జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి

image

జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఆదివారం రవీంద్రభారతిలో జరిగింది. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ.. జర్నలిస్ట్‌ల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జర్నలిస్ట్ కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.