Karimnagar

News March 31, 2026

గ్రామసభలను విజయవంతం చేయాలి: కలెక్టర్

image

KNR జిల్లావ్యాప్తంగా ఏప్రిల్ 2న నిర్వహించే గ్రామసభలను సమన్వయంతో విజయవంతం చేయాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. ఎంపీడీవోలు, హౌసింగ్‌ అధికారులతో ఆమె ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి వంటి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, లబ్ధిదారుల వివరాలను సభల్లో వెల్లడించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనేలా చూడాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

News March 31, 2026

కరీంనగర్ బడ్జెట్ ‘తిరోగమనం’: సర్దార్ రవీందర్ సింగ్

image

కరీంనగర్ నగర మున్సిపల్ బడ్జెట్ అభివృద్ధికి కాక, తిరోగమనానికి నిదర్శనమని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి బడ్జెట్ కంటే ఎక్కువగా ఉందని ఆరోపించారు. హోర్డింగుల పన్ను మాఫీ చేస్తూ నెలకు రూ. 3 కోట్ల అక్రమ వసూళ్లు జరుగుతున్నాయని, దీనిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

News March 31, 2026

KNR: పౌల్ట్రీ హబ్‌లో సమ్మె సెగ

image

కరీంనగర్ జిల్లాలో ఏప్రిల్ 1 నుంచి చికెన్ విక్రయాలు నిలవనున్నాయి. కరీంనగర్, మానకొండూర్, హైదరాబాద్, చొప్పదండి నియోజకవర్గ కేంద్రాలుగా ఉన్న 1,000కి పైగా కోళ్ల ఫారాలు, 2000 మంది రైతులపై ఈ ప్రభావం పడనుంది. దీనివల్ల రోజువారీ 50 వేల కిలోల వినియోగం నిలిచిపోయి, నెలకు కోట్లాది రూపాయల టర్నోవర్ జరిగే పౌల్ట్రీ రంగం కుదేలయ్యే ప్రమాదం ఉంది.

News March 31, 2026

మహాలక్ష్మి పథకం మహిళా సాధికారతకు వేదిక: కలెక్టర్

image

‘మహాలక్ష్మి’ పథకం మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోందని కలెక్టర్ చిత్రా మిశ్రా పేర్కొన్నారు. కరీంనగర్ బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకు 6.91 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి, రూ,308.84 కోట్ల లబ్ధి పొందారని తెలిపారు. ఈ పొదుపు మహిళల ఆర్థికాభివృద్ధికి, విద్య, వైద్య అవసరాలకు తోడ్పడుతోందని కొనియాడారు. RM బి.రాజు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ సోలోమన్ ఉన్నారు.

News March 31, 2026

KNR: ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్‌డెడ్

image

కరీంనగర్ నగరంలోని వంతెనపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. హైదరాబాద్ నుంచి కరీంనగర్ వస్తున్న లారీ, ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ద్విచక్రవాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా కోహెడ మండలానికి చెందిన కిషన్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News March 31, 2026

KNR: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.

News March 31, 2026

KNR: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.

News March 31, 2026

KNR: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.

News March 31, 2026

KNR: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.

News March 31, 2026

KNR: ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించండి: కలెక్టర్

image

కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ చిత్రా మిశ్రా ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 225 ఫిర్యాదులు అందగా, వాటిని ఆయా శాఖలకు బదిలీ చేశారు.