India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిమ్మాపూర్ మండలంలోని డైట్ కళాశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా సీనియర్ సివిల్ జడ్జి కే. వెంకటేష్ మాట్లాడుతూ, న్యాయ విజ్ఞాన సదస్సుల ద్వారా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ చట్టం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పోక్సో యాక్ట్ వంటి చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. సైబర్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా మెలగాలని ఆయన సూచించారు.
మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ MLA రసమయి బాలకిషన్పై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు CP గౌష్ ఆలంకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ నాయకులు అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. గోసి గొంగడి నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన రసమయి బాలకిషన్ ఈరోజు వందల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్లు ఎలా సంపాదించారో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
కరీంనగర్లో స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) నూతన కార్యాలయాన్ని సీపీ గౌష్ ఆలం శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. ఇంతకుముందు పోలీస్ కమిషనర్ నివాసం వద్ద ఉన్న ఎస్బీ కార్యాలయాన్ని, పోలీస్ హెడ్క్వార్టర్స్లోని అమరవీరుల స్మారక భవనంలోకి మార్చారు. నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం సీపీ దీనిని ప్రారంభించారు. నూతన భవనం ద్వారా ఎస్బీ మరింత మెరుగైన సేవలు అందించాలని సీపీ ఆకాంక్షించారు.
ప్రజలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా సివిల్ సప్లై అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు మండలంలోని గుండ్లపల్లి ఎక్స్ రోడ్డు వద్ద సివిల్ సప్లై అధికారుల పట్టుకున్నట్లు ఎస్సై వివరించారు. బొలెరోలో 50 క్వింటాళ్ల రేషన్ బియ్యం లభ్యమయ్యాయి. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదు మేరకు బొజ్జ రాజు పైన కేసు నమోదు చేశారు.
పిల్లలలో లోపపోషణ నివారణకు ఐసీడీఎస్, ఆరోగ్య శాఖ ద్వారా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గంగాధర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ మాసం, శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. శుక్రవారం సభలో భాగంగా ప్రతి శుక్రవారం ప్రభుత్వ పాఠశాల, ఆరోగ్య కేంద్రం అంగన్వాడీ సేవలను పర్యవేక్షిస్తామన్నారు.
‘బంద్ ఫర్ జస్టిస్’ తెలంగాణ బంద్కు తమ సంఘం సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ఏఐఎస్ఎఫ్ (AISF) రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి కరీంనగర్లో ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు పట్ల బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, వెంటనే గవర్నర్, రాష్ట్రపతి చేత ఆమోదింపజేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బంద్ ద్వారానైనా బీసీ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఆయన కోరారు.
కరీంనగర్లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం ‘స్వదేశీ ఉత్సవ్ – క్యాంపస్ ఎకో బజార్ ఫర్ స్వదేశీ దీపావళి ఫెరియా ఫెస్తా’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాతవాహన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ యు.ఉమేష్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. కళాశాల ప్రిన్సిపల్ కె. రామకృష్ణ, ప్రిన్సిపాల్ వరలక్ష్మి, అధ్యాపకులు, విద్యార్థులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు.
శంకరపట్నం మండలం తాడికల్, కేశవపట్నంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ తాడికల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధరకు ధాన్యం అమ్మాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 325 కేంద్రాల్లో కొనుగోలు కొనసాగుతుందని తెలిపారు.
మానకొండూరు పల్లే మీద చౌరస్తాలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దిష్టిబొమ్మ దహనం చేశారు. మాజీ ఎమ్మెల్యే రసమయిపై వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ నిరసన జరిగింది. “ఎమ్మెల్యే డౌన్డౌన్” అంటూ నినాదాలు చేయడంతో పోలీసులు చేరుకొని కార్యకర్తలను పోలీస్స్టేషన్కు తరలించారు.
KNR జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్ష పదవుల నియామక ప్రక్రియలో భాగంగా ఏఐసీసీ పరిశీలకులు శ్రీనివాస్ మానే గురువారం ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు. పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్తల ఆందోళనతో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ, అభిప్రాయాల సేకరణ కొనసాగింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నేతలు ఒక్కొక్కరుగా ప్రత్యేక గదిలోకి వెళ్లి పరిశీలకులకు తమ అభిప్రాయాన్ని తెలిపారు.
Sorry, no posts matched your criteria.