India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లాలో కొత్తగా మంజూరైన 22 పూర్వ ప్రాథమిక పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం 22 మహిళా బోధకులు, 22 మహిళా ఆయాల నియామకానికి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైని తెలిపారు. బోధకులకు ఇంటర్, ఆయాలకు 7వ తరగతి అర్హత అని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈనెల 28న దరఖాస్తులను కరీంనగర్ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు కవ్వంపల్లి రాజేశం ఇటీవల అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం కవ్వంపల్లి ఇంటికి వెళ్లిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆయనను పరామర్శించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి కూడా బండి సంజయ్తోపాటు ఉన్నారు.
కరీంనగర్లోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంగళవారం ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వాహకులకు ‘క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, పీఎన్డీటీ చట్టం’పై వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు ఎవరైనా సేవా దృక్పథంతో పని చేయాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని సూచించారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం కొత్త దరఖాస్తులను స్వీకరించాలని KNR కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులతో సోమవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఇల్లు మంజూరైనప్పటికీ నిర్మాణానికి సుముఖత చూపని లబ్ధిదారుల స్థానంలో అర్హులైన కొత్త దరఖాస్తుదారులకు ఇళ్లను కేటాయించాలని ఆమె సూచించారు. ఇళ్ల నిర్మాణ దశలను ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
KNR-1డిపో ప్రత్యేక టూర్ ప్యాకేజీ ఏర్పాటుచేసినట్లు DM విజయ మాధురి తెలిపారు. టూర్ ప్యాకేజీలో అన్నవరం, పిఠాపురం శక్తిపీఠం, సింహాచలం, వైజాగ్ బీచ్, ద్వారకతిరుమల దర్శించడానికి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటుచేశామని చెప్పారు. AUG 29న సా.5 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి AUG 31న రాత్రి KNR చేరుకుంటుందని తెలిపారు. పెద్దలకు రూ.3,500, పిల్లలకు రూ.2,625 నిర్ణయించామన్నారు. వివరాలకు 7382849352 సంప్రదించాలన్నారు.
స్థానిక SRR కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాలలోని 5 NSS యూనిట్ల విద్యార్థులు ఇందులో భాగస్వాములై, సుమారు 80 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం విశేషం. విద్యార్థులు సేవాస్ఫూర్తి, మానవతా విలువలను ప్రతిబింబిస్తూ రక్తదానం చేసి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. ఈ కార్యక్రమాన్ని రెడ్క్రాస్ సొసైటీ, బ్రహ్మకుమారి సిస్టర్స్ సహకారంతో, ప్రభుత్వ వైద్యాధికారుల పర్యవేక్షణలో నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర ముదిరాజు పోరాట సమితి (TMPS) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కీసర సంపత్ నియమితులయ్యారు. తాడికల్లో సోమవారం జరిగిన పల్లెబాట కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సుంకరబోయిన మహేష్ ఈ మేరకు సంపత్కు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ నియామకం స్థానిక ముదిరాజు సమాజంలో ఉత్సాహాన్ని నింపింది. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
మానకొండూర్లోని భవిత కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సందర్శించారు. దివ్యాంగ విద్యార్థులకు బోధిస్తున్న తీరును పరిశీలించారు. పలువురు విద్యార్థులతో మాట్లాడారు. ఈ నెలలో బోధిస్తున్న అంశాలు, సిలబస్ గురించి ఉపాధ్యాయురాలిని అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఫిజియోథెరపిస్టు, స్పీచ్ థెరపీ సేవలను క్రమం తప్పకుండా అందించాలని ఆదేశించారు.
మానకొండూర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో 100 శాతం మంది విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలకు హాజరు కావాలని అన్నారు. పాఠశాల బాలికలు తయారు చేసిన మట్టి గణపతులను పరిశీలించి అభినందించారు. అనంతరం 8వ తరగతి గదిని సందర్శించి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు.
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ (జాతీయ సేవా పథకం) ఆధ్వర్యంలో సోమవారం పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు మట్టి వినాయకులను తయారు చేసి పూజలు నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమం పర్యావరణ పరిరక్షణ ప్రాధాన్యతను తెలియజేసే విధంగా జరిగింది.
Sorry, no posts matched your criteria.