Karimnagar

News August 30, 2024

KNR: క్షేత్ర స్థాయిలో రైతుల వివరాల సేకరణ

image

ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో రైతు రుణమాఫీ వివరాలను సేకరిస్తున్నారు. రూ.2 లక్షల లోపు పంట రుణం తీసుకున్న రైతులందరికీ ప్రభుత్వం డబ్బులు జమ చేసింది. అయితే సాంకేతిక సమస్యలు, బ్యాంకు తప్పిదాలు, ఆధార్, పట్టా పాస్ బుక్ తదితర సమస్యలతో కొందరు అర్హులకు రుణమాఫీ కాలేదు. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా నోడల్ ఆఫీసర్లు రుణమాఫీ జమకాని రైతుల నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు.

News August 30, 2024

వేములవాడ: పెళ్లి సంబంధాలు కుదరడం లేదని యువకుడి ఆత్మహత్య

image

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. వేములవాడ రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన విక్కుర్తి నవీన్ (27) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేసి మానేశాడు. కొంతకాలంగా అతడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో మనో వేదనకు గురై ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరేసుకున్నాడు. అతడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

News August 30, 2024

గోదావరిఖని: కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్య

image

రామగుండం కార్పొరేషన్ కార్పొరేటర్ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ కార్పొరేటర్ దాతు శ్రీనివాస్ కుమారుడు పవన్ (25) గోదావరిఖని గంగానగర్‌లోని వారి ఇంట్లో తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 30, 2024

కరీంనగర్: ప్రధాన జలాశయాలకు పరిమితంగా వరద నీరు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే ప్రధాన జలాశయాలకు ఈ వానాకాలంలో పరిమితంగానే వరద నీరు వచ్చి చేరింది. శ్రీరామసాగర్ జలాశయంలోకి 63 టీఎంసీల వరద రాగా ప్రాజెక్టు నుంచి ఎల్ఎండీ ఎగువన గల 0-146 కి.మీ పరిధిలోని ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీపాద ఎల్లంపల్లికి వస్తున్న వరదను నంది, గాయత్రి పంపుహౌజుల ద్వారా వరదకాలువలోకి ఎత్తిపోసి మధ్య మానేరు, దిగువ మానేరు జలాశయాలకు తరలిస్తున్నారు.

News August 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని మెట్పల్లిలో రైతుల మాహా ధర్నా. @ మల్యాల పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే. @ రౌడీషీటర్లకు, హిస్టరీ షీటర్లకు వేములవాడలో కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్పీ అఖిల్ మహాజన్. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవం.

News August 29, 2024

సిరిసిల్ల జిల్లాలో మహిళలకు కోళ్ల పంపిణీ

image

ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ముస్తాబాద్, కోనరావుపేట, తంగళ్లపల్లి, వేములవాడ రూరల్, బోయినపల్లి, గంభీరావుపేట, చందుర్తి మండలాల్లో 5,500 సోనాలి బ్రీడ్ కోళ్లు పంపిణీ చేశామని రాజన్న సిరిసిల్ల డీఆర్డీవో శేషాద్రి తెలిపారు. ఆయా మండలాల్లో 80 మంది మహిళల ఆర్థిక స్వావలంబనలో భాగంగా వారు పెంచుకునే స్థలాన్ని పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. ఒక్కొక్కరికి 35 నుంచి 50 కోళ్లు పంపిణీ చేశామన్నారు.

News August 29, 2024

పెద్దపల్లి: బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలో బాలల సంరక్షణ కార్యక్రమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మిషన్ వాత్సల్య కార్యక్రమ అమలుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి సంబంధిత మహిళా, శిశు, దివ్యాంగ సంక్షేమశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ సీసీఐలలో 6వ తరగతి చదువుతున్న పిల్లలందరినీ ఎంపిక చేసి రెసిడెన్షియల్ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పించాలని ఆదేశించారు.

News August 29, 2024

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో 16.9 టీఎంసీల నీరు

image

ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు గానూ16.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి  3,531 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అదేవిధంగా 10,134 క్యూసెక్కుల నీరు దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల పథకం కొనసాగుతోంది.

News August 29, 2024

కాటారంలో దొంగల బీభత్సం

image

కాటారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. మండలంలోని బస్వాపూర్‌లో అర్ధరాత్రి 2గం.కు ఓ ఇంట్లోకి చోరబడ్డారు. ఇంట్లోని రూ.లక్ష, 5 తులాల బంగారం, ఒక బైకును ఎత్తుకెళ్లారు. ఇంతటితో ఆగకుండా ఇంటియజమాని తిరుపతిని కట్టేసి అతడి భార్య గొంతు కోశారు. విషయం తెలుసుకున్న కాటారం డీఎస్పీ రామ్మోహన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News August 29, 2024

మేడిగడ్డ బ్యారేజీకి కొనసాగుతున్న వరద

image

కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీలోకి 2.58 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో చేరుతుండగా 85 గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు. బ్యారేజీ వద్ద 390 మీటర్ల ఎత్తులో గోదావరి నది ప్రవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యారేజీ వద్ద పకడ్బందీ జాగ్రత్తలు అధికారులు చేపట్టారు.