Karimnagar

News April 16, 2025

KNR: పైలట్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండ్ పూర్తిచేయాలి: కలెక్టర్

image

పైలట్ ప్రాజెక్టులో ఎంపికైన గ్రామాల్లో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల గ్రౌండింగ్ వర్క్ పూర్తిచేయాలని మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. పథకం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో నిబంధనల ప్రకారం ‌కట్టుదిట్టమైన ప్రణాళికతో అత్యంత నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని సూచించారు. పొరపాటులకు తావివ్వరాదని అన్నారు. ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.

News April 16, 2025

KNR: భూ భారతి పై ప్రజలకు అవగాహన కల్పించాలి: కలెక్టర్ పమేలా

image

కరీంనగర్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూ భారతి నూతన రెవెన్యూ చట్టంపై తహశీల్దార్లతో కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష సమావేశం నిర్వహించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టంపై సదస్సులు ఏర్పాటు చేసే ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్రోడీకరించి భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి చట్టం రూపొందించిందన్నారు.

News April 16, 2025

ఇల్లందకుంట : రేపు సీతారామచంద్ర స్వామికి ఏకాంత సేవ

image

అపర భద్రాది గా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సందర్భంలో ఈ నెల 16 న బుధవారం స్వామి వారికి రాత్రి 9గంటలకు సప్త వర్ణాలు, మరియు అద్దాల మేడ దాతల చే స్వామి వారి ఏకాంత సేవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో సుధాకర్, ఆలయ ఛైర్మన్ ఇంగిలి రామా రావు, ధర్మకర్తలు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భగవంతుని కృప కు పాత్రులు కావాలని పేర్కొన్నారు .

News April 15, 2025

జమ్మికుంట యాక్సిడెంట్.. మృతుడు ఇతడే!

image

జమ్మికుంట<<16108193>> ఫ్లైఓవర్ యాక్సిడెంట్<<>> మృతుడి వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని దుర్గకాలనీకి చెందిన పూరంశెట్టి తిరుపతి (39)గా జమ్మికుంట పట్టణ సీఐ వరగంటి రవి తెలిపారు. మృతునికి భార్య సృజన, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.

News April 15, 2025

ఓపెన్ స్కూల్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి: కలెక్టర్ పమేలా

image

కరీంనగర్ జిల్లాలో ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు రాస్తున్న వారంతా శ్రద్ధతో చదివి 100 శాతం ఫలితాలు సాధించాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పదోతరగతి పరీక్షలు రాసే విద్యార్థులు, తల్లిదండ్రులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత రోజుల్లో ఏ చిన్న ఉద్యోగానికైనా, ఉపాధి అవకాశాలకైనా విద్యార్హతలు ముఖ్యమని కలెక్టర్ అన్నారు.

News April 15, 2025

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలు

image

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా శంకరపట్నం మండలంలో 39.3°C నమోదు కాగా, చిగురుమామిడి 39.2, గన్నేరువరం 38.9, జమ్మికుంట 38.7, మానకొండూరు, గంగాధర 38.5, తిమ్మాపూర్ 38.4, రామడుగు, కరీంనగర్ 38.3, కరీంనగర్ రూరల్ 38.2, వీణవంక 37.8, సైదాపూర్ 37.6, చొప్పదండి 37.0, హుజూరాబాద్ 36.7, కొత్తపల్లి 36.6, ఇల్లందకుంట 36.5°C గా నమోదైంది.

News April 14, 2025

KNR: అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసిన కలెక్టర్, పోలీస్ కమిషనర్

image

అంబేడ్కర్ జయంతి సందర్భంగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ అలం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు. ఆయన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని కోరారు. వారి వెంట జిల్లా అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News April 14, 2025

అలర్ట్: కరీంనగర్ జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదు

image

KNR జిల్లాలో ఎండ తీవ్రత పెరిగింది. గడచిన 24 గంటల్లో జిల్లా మొత్తం 40°C పై ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా మానకొండూర్ మండలంలో 43.0°C నమోదు కాగా, గంగాధర 42.9, రామడుగు 42.8, జమ్మికుంట 42.7, చిగురుమామిడి 42.6, కరీంనగర్ 42.5, వీణవంక 41.6, గన్నేరువరం 41.5, తిమ్మాపూర్ 41.4, ఇల్లందకుంట, కరీంనగర్ రూరల్ 41.2, చొప్పదండి 40.9, శంకరపట్నం 40.5, కొత్తపల్లి 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్ 40.2°C గా నమోదైంది.

News April 14, 2025

వేములవాడ: వ్యక్తి దారుణ హత్య

image

వేములవాడలోని ఓ ఫంక్షనల్ వద్ద ఆదివారం సాయంత్రం వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. నాగయ్యపల్లికి చెందిన చెట్టిపల్లి పరశురాం (39)ను గుర్తుతెలియని వ్యక్తులు హతమర్చారు. మృతుడు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News April 14, 2025

చొప్పదండి: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

image

చొప్పదండి పట్టణం బీసీ కాలనీకి చెందిన గాజుల కనకలక్ష్మి (55) శనివారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఎస్సై మామిడాల సురేందర్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు తమ తల్లిని చంపి మెడలో ఉన్న రెండు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకుపోయారని కూతురు నాగమణి ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.