India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లు లేని పేదల నుంచి 2023 డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు వారికి ఆర్థిక సహాయం అందించేందుకు దరఖాస్తులు స్వీకరించింది. అయితే ఇటీవల ప్రభుత్వం తొలి విడతలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లకు నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ పథకానికి మొత్తంగా 7,09,923 దరఖాస్తులు రాగా.. మొదటి విడతలో 42 వేల ఇళ్లకు నిధులు రానున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ <<13902837>>కార్పొరేషన్ కొత్త కమిషనర్<<>>గా చాహత్ బాజ్పాయ్ని నియమిస్తూ CS శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. 2019 IAS బ్యాచ్కు చెందిన చాహత్ బాజ్పాయ్ IIT కాన్పూరులో బీటెక్ పూర్తి చేశారు. ఈమె APతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ITDA ప్రాజెక్టు డైరెక్టర్గా, సబ్ కలెక్టర్గా, అదనపు కలెక్టర్గా పని చేశారు. కాగా రెండేళ్ల తర్వాత మళ్లీ IASకే కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు.
మూడేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా జిల్లాలో బీసీ సంక్షేమ శాఖలోనే రూ.131.35 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా BC, SC, ST, మైనార్టీ, EBC విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో బకాయిల భారం పెరిగింది.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమల వ్యాప్తి అధికంగా పెరిగింది. డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో చాలా మంది జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
కరీంనగర్ జిల్లాలోని రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వానకాలం సాగు మొదలై 2 నెలలు కావొస్తున్నా రైతు భరోసా పథకం అమలు ఊసేలేదు. రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నారు. కాగా జిల్లాలో 3,45,070 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయంగా ఇస్తే జిల్లా రైతులకు రూ.258.8 కోట్ల లబ్ధి చేకూరనుంది.
@ కోనరావుపేట మండలంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జగిత్యాల కలెక్టర్. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ జమ్మికుంట మండలంలో బైకును ఢీ కొట్టిన కారు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.
కరీంనగర్ కార్పొరేషన్ కొత్త కమిషనర్గా చాహత్ బాజ్పాయ్ని నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన చాహత్ బాజ్పాయ్ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్గా, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు.
కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమల వ్యాప్తి అధికంగా పెరిగింది. డెంగ్యూ, చికున్ గున్యా లాంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఒడిశాలోని మల్కాన్ గిరి- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం రైల్వే స్టేషన్ మార్గం మరో ఐదేళ్లలో అందుబాటులోకి రావడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్కు ప్రాధాన్యత పెరగనుంది. ఇప్పటికే నిజామాబాద్ ముంబై వరకు రైలు మార్గం ఉంది. రాఘవాపూర్ మణుగూరు మార్గం అటు నుంచి పాండురంగాపురం-మల్కాన్గిరి మార్గం ప్రారంభమైతే కోనార్పుట్ మీదుగా జార్ఖండ్ వైపు, మరోవైపు జైపూర్, అరకు, విశాఖ వరకు రైలుమార్గాలు అనుసంధానమవుతాయి.
కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రీజియన్లో 5.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 4.40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పగా 107 ఓఆర్ వచ్చింది. మూడు రోజుల్లో 450 అదనపు ట్రిప్పుల బస్సులను నడిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయిస్తే కరీంనగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలిచింది.
Sorry, no posts matched your criteria.