Karimnagar

News February 17, 2025

కరీంనగర్ తొమ్మిది రోజుల్లో తెర.. విజేత ఎవరో..!?

image

రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతగా నిలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ హీట్ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్, టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. కాగా..తొమ్మిది రోజులే ప్రచార సమయం ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేస్తూ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. విజేతలపై మీ కామెంట్..?

News February 16, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

✓ శంకరపట్నం మండలంలో చికిత్స పొందుతూ యువరైతు మృతి ✓ మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు✓ కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ధర్మపురికి చెందిన మహిళా మృతి✓ జగిత్యాల పట్టణంలో ప్రముఖ చిత్రకారుడు మచ్చ రవి గుండెపోటుతో మృతి✓ జగిత్యాల: ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషయం✓ ఇల్లంతకుంట మండలంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

News February 16, 2025

జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News February 16, 2025

పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

image

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.

News February 16, 2025

కరీంనగర్: చికిత్స పొందుతూ యువరైతు మృతి

image

శంకరపట్నం(M) ఇప్పలపల్లె గ్రామానికి చెందిన ఏడీగ మధు(33) అనే ఓ యువరైతు 6రోజుల క్రితం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గమనించిన చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News February 16, 2025

జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

image

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి <<15470497>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

News February 16, 2025

కాటారం సబ్ డివిజన్ అడవుల్లో పెద్దపులి!

image

కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్‌లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.

News February 16, 2025

కరీంనగర్: ‘కేసీఆర్‌కు పట్టిన గతే సీఎంకు పడుతుంది’

image

ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే  మాజీ సీఎంలు కేసీఆర్‌, కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

News February 16, 2025

కరీంనగర్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

image

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.

error: Content is protected !!