Karimnagar

News February 17, 2025

కరీంనగర్: నేటి నుంచి విద్యార్థులకు కంటి పరీక్షలు

image

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నేటి నుంచి ఈ నెల 28 వరకు కంటి పరీక్షలు చేయనున్నట్లు జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ సాజిత అతహరి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 1,730మందికి, HZB ఏరియా ఆసుపత్రిలో 858 మంది విద్యార్థులందరికి పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో 858, HZB ఏరియా ఆసుపత్రిలో 100మంది విద్యార్థులకు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని పేర్కొన్నారు.

News February 17, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అధికం

image

ఉమ్మడి KNR, MDK, ADB, NZB జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్‌లోనే దాదాపు 45 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి. దీంతో అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులందరూ KNR కేంద్రంగానే ప్రచారంపై దృష్టి పెడుతున్నారు. అన్ని పార్టీల అధినేతలు KNR కేంద్రంగానే తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. దాదపు 3 లక్షల 50వేల పైచిలుకు ఓట్లలో సగం ఉమ్మడి KNR జిల్లాలోనే ఉన్నాయి.

News February 17, 2025

కరీంనగర్ : నేటి సదరం క్యాంపు రద్దు

image

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో ఈ నెలలో 17 & 18 తేదిలలో జరుగు సదరం క్యాంపులను నిలిపివేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి శ్రీధర్ తెలిపారు. సదరం వెబ్‌సైట్‌లో ఏర్పడిన సాంకేతిక లోపాలు కారణంగా నేడు సోమవారం, మంగళవారం నిర్వహించే సదరం క్యాంప్‌లు రద్దు చేశామన్నారు. 

News February 17, 2025

కరీంనగర్ తొమ్మిది రోజుల్లో తెర.. విజేత ఎవరో..!?

image

రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యతగా నిలిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎలక్షన్ హీట్ కొనసాగుతుంది. గ్రాడ్యుయేట్, టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఈనెల 27న పోలింగ్ జరగనుంది. కాగా..తొమ్మిది రోజులే ప్రచార సమయం ఉండడంతో అభ్యర్థులు జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎవరికి వారే గెలుపుపై లెక్కలు వేస్తూ క్యాడర్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నారు. విజేతలపై మీ కామెంట్..?

News February 16, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

image

✓ శంకరపట్నం మండలంలో చికిత్స పొందుతూ యువరైతు మృతి ✓ మంథని: రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలు✓ కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ధర్మపురికి చెందిన మహిళా మృతి✓ జగిత్యాల పట్టణంలో ప్రముఖ చిత్రకారుడు మచ్చ రవి గుండెపోటుతో మృతి✓ జగిత్యాల: ట్రాక్టర్, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషయం✓ ఇల్లంతకుంట మండలంలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్టు

News February 16, 2025

జగిత్యాల: కుంభమేళా వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి

image

మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో JGTL(D) ధర్మపురికి చెందిన వెంగళ ప్రమీల చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందారు. 10 రోజులక్రితం కుటుంబసభ్యులతో కలిసి 2 కార్లలో కుంభమేళాకు వెళ్లి వస్తుండగా గురువారం ఒక కారుకు ప్రమాదం జరిగింది. వెంటనే ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రమీల మృతిచెందింది. ప్రమీల గోదావరి నది తీరాన కొబ్బరికాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంది. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News February 16, 2025

పన్నుల వసూళ్లలో హుజూరాబాద్ రెండో స్థానం

image

ఇంటి పన్నుల వసూళ్లలో HZB మున్సిపాలిటీ రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచిందని కమిషనర్ సమ్మయ్య తెలిపారు. గతంలో వసూళ్లలో 5వ స్థానంలో ఉన్నదానిని తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉద్యోగుల సహకారంతో రూ.2.03కోట్లు వసూలుచేసి, 76.95శాతం వసూళ్లతో రికార్డు సాధించగలిగామన్నారు. మున్సిపల్ పరిధిలో ఇంటి పన్ను కట్టేవారు 9,431 మంది ఉన్నారన్నారు. ఉద్యోగులు, ప్రజల సహకారంతో రాష్ట్రంలో మొదటి స్థానం కోసం కృషి చేస్తున్నామన్నారు.

News February 16, 2025

కరీంనగర్: చికిత్స పొందుతూ యువరైతు మృతి

image

శంకరపట్నం(M) ఇప్పలపల్లె గ్రామానికి చెందిన ఏడీగ మధు(33) అనే ఓ యువరైతు 6రోజుల క్రితం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గమనించిన చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

News February 16, 2025

జగిత్యాల: మొన్న తల్లి మృతి.. నేడు పిల్లలు

image

JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి <<15470497>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 16, 2025

కరీంనగర్: టీచర్లు పట్టం కట్టేది ఎవరికో.!

image

KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.