India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్లోని ఆర్ అండ్ బి వసతి గృహంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కతో స్వాగతం పలికారు. జిల్లాలో ఇసుక యార్డులు, ఇసుక లారీల బుకింగ్లు, నిల్వల వివరాలను జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయనకు వివరించారు.
శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కోతులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాటి ధాటిని తట్టుకోలేక పోతున్నారు. గడిచిన 15 రోజుల్లోనే వాటి దాడిలో 39 మంది గాయపడ్డారని వైద్యాధికారి డా.శ్రావణ్ తెలిపారు. జనవరి మాసంలో 42 మంది కుక్క కాటుకు, 46 మంది కోతుల దాడికి గురైనట్లు వెల్లడించారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కరీంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం వీరాస్వామి శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ తాటి చెట్టుపై కల్లు గీసి దిగుతుండగా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
ఓ ఉపాధ్యాయురాలు తన పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డును వినూత్నరీతిలో తయారుచేశారు. జగిత్యాల(D) మెట్పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు రమ్య (శోభారాణి)-మురళి దంపతుల పెళ్లిరోజు ఈనెల 15న ఉంది. పెళ్లిరోజును శుభాకాంక్షల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు. ‘choose the correct answer’, ‘true or false’, ‘match the followings’ తో వెరైటీగా క్రియేట్ చేశారు. ఈ పెళ్లిరోజు శుభాకాంక్షల కార్డు పలువురిని ఆకట్టుకుంటుంది.
పొన్నం ప్రభాకర్పై పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 feb 13న లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం ఆయన HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల నిర్వహణపై కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారులు ముఖ్యపాత్ర పోషిస్తారని, అందువల్ల ఎన్నికల విధులను ఎంతో జాగ్రత్తగా నిర్వర్తించాలన్నారు.
రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.
Sorry, no posts matched your criteria.