India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తీరంగా కార్యక్రమంతో దేశం త్రివర్ణ శోభితమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. యావత్ భారతదేశం ఒక్క తాటిపైకి వచ్చి, జాతి మొత్తం సగర్వంగా త్రివర్ణ పతాకం వైపు చూసేలా చేసిందని తెలిపారు. స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువారం న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు 477.51 అడుగులకు గాను ప్రస్తుతం 13.87 టిఎంసిలు నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 2,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 3,810 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంజయ్ నగర్కు చెందిన లింగమ్మ(63) అనే మహిళకు కీలు మార్పిడి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. డాక్టర్లు రాజు, యాకూబ్ ఆమెకు పరీక్షలు నిర్వహించి, మోకాలులోని కీలును తొలగించారు. మూడు రోజుల అనంతరం ఆమె యథాస్థితికి వచ్చి నడుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ హిమబిందు, ఆసుపత్రి సూపరిండెంటెండ్ దయాల్ సింగ్ వైద్యులను అభినందించారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాలుడు అఖిల్(9) పాముకాటు గురై మృతి చెందాడు. అయితే తండ్రి లేకపోగా.. అఖిల్ తల్లి నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో వరంగల్ MGMకు తరలించారు. ఈ క్రమంలో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతు బుధవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కాదేది కళకు అనర్హం అన్నట్టు సూక్ష్మకళలో రాణిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్. బ్లాక్ బోర్డుపై రాసేందుకు మాత్రమే ఉపయోగించే చాక్ పీస్పై 78 జాతీయ పతాకాలు చెక్కి ఆకట్టుకుంటున్నారు. ఇదివరకు కూడా రెండు బియ్యపు గింజలపై, 8 సెంటీమీటర్ల చాక్ పీస్పై 284 ఇంగ్లిష్ అక్షరాలతో జాతీయ గీతాన్ని చెక్కి ప్రశంసలు అందుకున్నారు.
కాకులు కొట్లాడుకుంటూ కరెంట్ తీగలకు తగలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయిన ఘటన KNR పట్టణంలో జరిగింది. అధికారుల ప్రకారం.. మంకమ్మతోటలోని లేబర్ అడ్డా హన్మాన్ ఆలయం సమీపంలో సా.4:21కు రెండు కాకులు కొట్లాడుకుంటూ సమీపంలోని 11KV గీతా భవన్ ఫీడర్పై పడ్డాయి. దీంతో కాకులు అక్కడికక్కడే మృతి చెందగా.. పద్మనగర్ 33KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ప్రాంతాలకు కరెంట్ నిలిచిపోయింది. అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేరువేరుగా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు. పర్యటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
@ జగిత్యాల కలెక్టర్తో ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ
@ ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
@ సిరిసిల్లలో ఇంట్లో దూరిన నెమలి.. పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
@ మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కు పాల్పడిన పడిన వ్యక్తి అరెస్ట్
@ స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లు
పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ కలిసి పరిశీలించారు. మైదానంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. రేపు ఉ.9 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు జెండా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తమ కార్యాలయంలో వేడుకల అనంతరం పరేడ్ గ్రౌండ్కు రావాలని సూచించారు. మైదానంలో అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,23,427 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.50,261, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,930, అన్నదానం రూ.13,236, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.