India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

SRR ప్రభుత్వ కళాశాల (అటానమస్)లో రాబోయే విద్యా సంవత్సరం 2026-27 ప్రవేశాల కరపత్రాన్ని కళాశాల ప్రిన్సిపల్, ప్రొఫెసర్ కె.రామకృష్ణ అధ్యాపక బృందంతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. SRR కళాశాల ప్రస్తుత సంవత్సర అడ్మిషన్లలో రాష్ట్రస్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో కూడా ఇదేవిధంగా అడ్మిషన్లు రావడానికి అధ్యాపకులు అందరూ కృషి చేయాలన్నారు.

ఉమ్మడి KNRజిల్లా మున్సిపాలిటీల్లో ప్రచారం హోరెత్తుతోంది. అయితే జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ వేరు. ఎన్నికలు సమస్యలకంటే తాయిలాల చుట్టే తిరుగుతున్నాయి. వాడల్లో డ్రైనేజీలు, రోడ్లు, తాగునీటి సమస్యలపై అభ్యర్థులను ఓటర్లు ప్రశ్నించడం మానేశారు. “ఎవరు ఎంత ఇస్తున్నారు? ఏ పార్టీ మందు పోస్తోంది?” అనే చర్చపైనే ప్రధాన దృష్టి సారించారు. అభ్యర్థులు కూడ కేవలం ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు.

సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28కి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.

కరీంనగర్ జిల్లాలో రేపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించనున్నారు. హుజురాబాద్, జమ్మికుంట మండలాల్లో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. అనంతరం స్థానిక నేతలతో సమావేశమై రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం మంత్రి తుమ్మల హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. అందుకు తగ్గట్లు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేశారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.జితేందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ లో ఏర్పాట్లు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా వచ్చిన వార్త క్లిప్పింగ్ లను సేకరించి తగు చర్యకై పంపించాలని అన్నారు.

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ ను జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు జి.జితేందర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ లో ఏర్పాట్లు పరిశీలించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘన జరిగినట్లుగా వచ్చిన వార్త క్లిప్పింగ్ లను సేకరించి తగు చర్యకై పంపించాలని అన్నారు.

జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం, ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్, కాకినాడలో గల రాష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం, అలంకరణ చేపను అందించారు. మహిళలు విభిన్న రంగాల్లో విజయం సాధించాలన్నారు.

జిల్లా మత్స్యశాఖ సహకారంతో కరీంనగర్ మహిళా మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి చెందిన 19మంది సభ్యులు అలంకరణ చేపల పెంపకం, ఉత్పత్తి రంగంలో ఆంధ్రప్రదేశ్, కాకినాడలో గల రాష్ట్ర ఫిషరీస్ టెక్నాలజీ సంస్థలో మూడు రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతిని క్యాంపు కార్యాలయంలో కలిసి స్వయంగా తయారు చేసిన అక్వేరియం, అలంకరణ చేపను అందించారు. మహిళలు విభిన్న రంగాల్లో విజయం సాధించాలన్నారు.
Sorry, no posts matched your criteria.