Karimnagar

News August 8, 2024

కరీంనగర్: నెరవేరనున్న సొంతింటి కల!

image

దాదాపు నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న LRS దరఖాస్తుదారుల కల త్వరలోనే నెరవేరబోతోంది. తమ స్థలంలో సొంతింటి నిర్మాణం చేపట్టేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో దరఖాస్తులు పరిశీలించి క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. కాగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీల్లో 1,13,346 దరఖాస్తులు వచ్చాయి.

News August 8, 2024

కొండగట్టులో సమస్యలు!

image

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారి కానుకల ద్వారా ఏటా రూ.20 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది. కానీ.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం సరిగ్గా కావడం లేదు. శానిటేషన్ అంతంతమాత్రంగానే ఉండటం.. నిఘా నేత్రాల పర్యవేక్షణ లేకపోవడం సమస్యగా మారింది. శ్రీరాముని ఆలయంలో అర్చకులు ఉండటం లేదని భక్తులు చెబుతున్నారు.

News August 8, 2024

కరీంనగర్: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఆర్ఎంపీ వైద్యం వికటించి చికిత్స పోందుతున్న శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన ముంజ లక్ష్మయ్య మరణించినట్లు కేశవపట్నం ఎస్సై రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. లక్ష్మయ్యకు విరేచనాలు అవుతుండటంతో ఆర్ఎంపీ మధు దగ్గరకు తీసుకెళ్లగా.. వైద్యం వికటించి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు HNKలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.

News August 8, 2024

ప్రధాని మోదీని కలిసిన ఈటల రాజేందర్

image

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మల్కాజిగిరి ఎంపీ, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీని నూలు పోగుల దండతో సత్కరించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం ప్రధానితో అభివృద్ధి, పలు సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.

News August 7, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కమలాపూర్ మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి.
@ సిరిసిల్లలో బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం.
@ సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి.
@ సైబర్ మోసానికి గురైన కథలాపూర్ మండల వాసి.
@ జగిత్యాలలో జర్నలిస్టుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన కోరుట్ల ఎమ్మెల్యే.

News August 7, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,82,284 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.89,660, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.75,810, అన్నదానం రూ.16,813 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 7, 2024

కరీంనగర్: బోడ కాకరకాయ కిలో రూ.240

image

కరీంనగర్ జిల్లాలో బోడ కాకరకాయలకు భలే డిమాండ్ పెరిగింది. ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే ఈ బోడ కాకరకాయలను ఇష్టంగా తింటారు. దీంతో మార్కెట్లో దీని రేటు విపరీతంగా పెరిగిపోయింది. మార్కెట్లో ప్రస్తుతం కిలో బొడ కాకరకాయ ధర రూ.240 వరకు పలుకుతోంది. ప్రతి సంవత్సరం అషాఢ, శ్రావణ మాసాల్లో బోడ కాకరకాయలు మార్కెట్లోకి వస్తాయి.

News August 7, 2024

GREAT.. కరీంనగర్ కలెక్టర్ సరికొత్త ఆలోచన

image

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సరికొత్త ఆలోచన చేశారు. గృహిణి ఆరోగ్యంగా ఉంటేనే ఇల్లు, కుటుంబం బాగుంటుందన్న నినాదాన్ని బలంగా గ్రామాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. దీనికోసం అంగన్వాడీ కేంద్రాల్లో ప్రతి శుక్రవారం గ్రామసభ నిర్వహిస్తున్నారు. ఈ సభ క్షేత్రస్థాయిలో గృహిణులు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల పరిష్కారానికి వేదికగా నిలుస్తోంది. ప్రతివారం ఏదో ఒక అంగన్వాడీలో కలెక్టర్ ఈ సభకు హాజరవుతున్నారు.

News August 7, 2024

KNR: నేతన్నలే చేనేత ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లు: కలెక్టర్

image

నేత కార్మికుల కష్టంతో వెలువడే ఉత్పత్తులను ప్రచారం చేయడానికి మనకన్నా పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు ఉండరు కాబట్టి చేనేత వస్త్రాల ప్రచారానికి చేనేత కార్మికులే బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

News August 7, 2024

కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్!

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో 651, జగిత్యాల 781, పెద్దపల్లి 547, రాజన్న సిరిసిల్ల 486 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇది వరకు ప్రభుత్వ పాఠశాలల్లో అతిపెద్ద సమస్యగా విద్యుత్ బిల్లులు ఉండేవని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అనడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు.