Karimnagar

News January 21, 2025

KNR జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి గ్రామ సభలు

image

ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు నేటి నుంచి ప్రభుత్వం మరోసారి దరఖాస్తులను స్వీకరిస్తోంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితా అధికారులకు చేరింది. తమ పేర్లు రాలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో వారికి మరోసారి అవకాశమివ్వాలని గ్రామసభల్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తులను పరిశీలించి అర్హులను అధికారులు ఎంపిక చేయనున్నారు.

News January 21, 2025

కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి పొన్నం

image

నేటి నుంచి నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కొరకు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తున్న సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, గ్రామ కాంగ్రెస్ కమిటీ సభ్యులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటి సభ్యులు పాల్గొనాలని కోరారు.

News January 21, 2025

సిరిసిల్ల: బిందెలో ఇరుక్కున్న ఓ చిన్నారి తల

image

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సంజీవయ్యనగర్‌లో ఓ చిన్నారి తల నీళ్ల బిందెలో ఇరుక్కుంది. ఎంత ప్రయత్నించినా బిందెలో నుంచి పాప తల బయటికి రాకపోవడంతో బిందెను జాగ్రత్తగా కత్తిరించి పాప తలను జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ ఘటనలో పాపకు ఎలాంటి ప్రమాదం కాలేదు. ఇంత జరుగుతున్నా ఆ చిన్నారి ఏడవకుండా ధైర్యంతో ఉండడానికి చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

News January 21, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.90,177 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.37,948 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.44,260, అన్నదానం రూ.7,969,వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 21, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేపటినుండి గ్రామసభలు. @ మెట్పల్లి మండలంలో బాలిక అదృశ్యం.. కేసు నమోదు. @ భీమదేవరపల్లి మండలంలో గంజాయి సేవిస్తున్న నలుగురిపై కేసు. @ ముత్తారం మండలంలో ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయ పరిసరాలలో పోలీసుల తనిఖీలు. @ ఇబ్రహీంపట్నం మండలంలో పురుగుల మందు తాగి వృద్ధుడి ఆత్మహత్య. @ గణతంత్ర దినోత్సవానికి పకడ్బందీ ఏర్పాటు చేయాలన్న జగిత్యాల అడిషనల్ కలెక్టర్.

News January 20, 2025

ఈనెల 28న కొత్తకొండ హుండీల లెక్కింపు

image

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండలోని వీరభద్రస్వామి ఆలయ హుండీల లెక్కింపు కార్యక్రమం ఈనెల 28వ తేదీన జరుగుతుందని ఆలయ ఈవో కిషన్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం 9.00 గంటలకు జరిగే ఈ లెక్కింపు కార్యక్రమంలో ఆసక్తి ఉన్న వారు పాల్గొనవచ్చన్నారు

News January 19, 2025

సిరిసిల్ల: కూతురితో గొడవ.. తల్లి ఆత్మహత్య

image

ఓ మహిళ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన వేముల నర్సవ్వ (45) ఇంట్లో కూతురితో గొడవ పడింది. దీంతో మనస్తాపం చెంది ఎదురుగా ఉన్న ఓ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. నర్సవ్వ కుమారుడు శేఖర్ ఆదివారం ఉదయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీశారు.

News January 19, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.2,49,539 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,31,444 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.95,765, అన్నదానం రూ.22,330,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News January 19, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కోనరావుపేట మండలంలో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య. @ ముగిసిన కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. @ ఎండపల్లి మండలంలో భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య. @ మెట్పల్లి పట్టణంలో బస్సులో కళ్ళు తిరిగి పడిపోయిన డ్రైవర్. @ కొండగట్టు ఆలయ ఈవో గా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రావు. @ మెట్పల్లి మండలంలో రేషన్ కార్డుల సర్వేను పరిశీలించిన జగిత్యాల అడిషనల్ కలెక్టర్ లత.

News January 18, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.1,34,601 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.78,994 ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.46,250, అన్నదానం రూ.9357 వచ్చినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.