India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ కోహెడ మండలంలో రేపు పర్యటించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ వీణవంక మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలు. @ ఎండపల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం. @ మెట్పల్లి పట్టణంలో ప్రయాణికుల దినోత్సవం. @ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ ఎత్తివేత. @ లింగ నిర్ధారణ పరీక్షలు జరిపితే చర్యలు తీసుకుంటామన్న కరీంనగర్ కలెక్టర్.
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పలు విమర్శలు చేశారు. కాంగ్రెస్ హామీలే ఓటమికి టికెట్ అని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో చేసిన వాగ్దానాలు తెలంగాణలో కాంగ్రెస్ హామీల మాదిరిగానే పడిపోవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ బూటకపు ప్రచారాలు, బూటకపు హామీలతో ఢిల్లీ తప్పుదోవ పట్టదన్నారు.
భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామ శివారులో బుధవారం రాత్రి ఓ కారు బోల్తా పడిన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు.. వరంగల్ మిల్స్ కాలనీ ఎస్సైగా పనిచేస్తున్న సురేశ్ కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొత్తపల్లి శివారులో టిప్పర్ను తప్పించబోయి.. ఎస్సై ప్రయాణిస్తున్న <<15167764>>కారు పల్టీలు కొడుతూ<<>> పొలాల్లోకి దూసుకెళ్లింది. ఎస్సై క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,31,585 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.80,158, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.36,200, అన్నదానం రూ.15,227,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
@ రుద్రంగి మండలంలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మల్లాపూర్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య. @ కొత్తకొండ వీరభద్ర స్వామి జాతరలో తప్పిపోయిన మహిళ. @ గొల్లపల్లి మండలంలో బోల్తా పడిన కారు. @ జగిత్యాల లో పోలీసులకు క్రీడా పోటీల నిర్వహణ. @ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్న కరీంనగర్ కలెక్టర్.
కాలేశ్వరంలో మే 15 నుంచి 26 వరకు నిర్వహించే సరస్వతీ నది పుష్కరాలపై ఆరుగురు ఉన్నతాధికారులతో ప్రభుత్వం కమిటీ వేసింది. ఈ కమిటీకి చైర్మన్గా కలెక్టర్, సభ్యులుగా ఎస్పీ, దేవాదాయ శాఖ ఆర్జెసి, యాదగిరిగుట్ట వేద పాఠశాల ప్రిన్సిపల్, ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఏఈలు ఉండనున్నారు. పుష్కరాలకు రూ.25 కోట్లు ప్రభుత్వం మంజూరు చేయగా, పనులను ప్రారంభించారు.
పదోన్నతి ద్వారా మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ IPS అన్నారు. కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ASIగా పనిచేస్తూ SIగా పదోన్నతి పొందిన 13 మంది అధికారులను పదోన్నతి చిహ్నాలను అలంకరించి అభినందించారు. CPమాట్లాడుతూ.. క్రమశిక్షణతో విధులు నిర్వహించి ప్రజల్లో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలన్నారు. పోలీస్ అధికారులు రాజు, రాఘవేంద్రరావు ఉన్నారు.
అక్కన్నపేట మండల చౌటపల్లి గ్రామానికి చెందిన పులికాశి సంపత్ (43) రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, పులికాశి సంపత్ కబడ్డీ క్రీడాకారుడు కావడంతో తోటి క్రీడాకారులు, చౌటపల్లి గ్రామస్థులు కలిసి సంపత్కు చెందిన వ్యవసాయ బావి వద్ద భూమిని చదును చేసి కబడ్డీ ‘కోర్టు’ వేసి దానిపై ‘చితి’ ని పేర్చి దహన సంస్కారాలు నిర్వహించారు. ఇది చూసిన వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దేశ రాజధాని ఢిల్లీలో కాంగ్రెస్ నూతన కార్యాలయం ఇందిరా భవన్ ఈరోజు ప్రారంభించారు. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో సైతం ఓ ఇందిరా భవన్ ఉంది. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇందిరాగాంధీపై విధేయతకు చిహ్నంగా తన నివాస గృహానికి ఇందిరాభవన్గా నామకరణం చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఈ భవనంలోనే సాదాసీదాగా నిత్యం తన వద్దకు వచ్చే ప్రజలకు ఆయన అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు.
@ ముస్తాబాద్ మండలంలో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం. @ ఇబ్రహీంపట్నం మండలంలో అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి. @ వేములవాడలో ఆర్ఎంపి క్లినిక్ సీజ్. @ బోయిన్పల్లి మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి. @ మెట్పల్లి మండలంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం.
Sorry, no posts matched your criteria.