Karimnagar

News August 7, 2024

సిరిసిల్ల: మేకల మందపై చిరుత దాడి.. తప్పించుకున్న కాపరి

image

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంటాల ఎద్దుగుట్ట అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి దాటిన తర్వాత మేకల మందపై చిరుత దాడి చేసింది. చిరుత ఒక్కసారిగా మేకల మందపై విరుచుకుపడటంతో పరుగులు తీశాయి. మేకల కాపరి శ్రీనివాస్ కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. తన చేతిలో ఉన్న గొడ్డలితో కాపరి బెదిరించే ప్రయత్నం చేయడంతో చిరుత అతడి వైపు వెళ్లలేదు. చిరుత అక్కడి నుంచి వెళ్లే క్రమంలో ఓ మేకను ఎత్తుకెళ్లినట్లు సమాచారం.

News August 7, 2024

గోదావరిఖనిలో సీనియర్ జర్నలిస్టు ఆత్మహత్య

image

రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన సీనియర్ జర్నలిస్టు ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గోదావరిఖని చౌరస్తా సమీప ప్రాంతంలో ఉంటున్న సీనియర్ జర్నలిస్టు నాయిని మధునయ్య(67) తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన గతంలో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్డ్ అయ్యారు. మధునయ్య మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

News August 7, 2024

తల్లి పాలు అమృతం లాంటివి: కలెక్టర్ పమేలా సత్పతి

image

తల్లి పాలు అమృతం లాంటివని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. కరీంనగర్ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి తల్లి పిల్లలకు జన్మనిచ్చిన 24 గంటల లోపు కచ్చితంగా ముర్రు పాలను పట్టించాలన్నారు. దాని వల్ల తల్లీపిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

News August 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి. @ మెట్పల్లి లో గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్ట్. @ గంగాధర మండలంలో లారీ, బస్సు ఢీ.. లారీ డ్రైవర్ మృతి. @ చందుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యదర్శి సస్పెండ్. @ హుస్నాబాద్‌లో గద్దర్ వర్ధంతిలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. @ ఓదెల మండలంలో వ్యక్తి ఆత్మహత్య.

News August 6, 2024

స్వచ్ఛదనం-పచ్చదనం విజయవంతం చేయాలి: ఆర్.వి.కర్ణన్

image

స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమ నిర్వహణపై సంబంధిత అధికారులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్‌ఛార్జి అధికారి ఆర్.వి.కర్ణన్ సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రతి గ్రామం, పట్టణాల్లోని వార్డుల్లో స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం తాగునీటి సరఫరా, డ్రై డే, ప్రభుత్వ సంస్థలను శుభ్రం చేయడం వంటి కార్యక్రమాలను ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించాలన్నారు.

News August 6, 2024

17 ఏళ్ల తర్వాత రాజన్న ఆలయంలో ఉద్యోగుల బదిలీలు!

image

వేములవాడ శ్రీరాజరాజేశ్వర ఆలయం నుంచి 27 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు. అందులో ఇద్దరు AEOలు, ఇద్దరు పర్యవేక్షకులు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు, DEతో కలిసి 27 మంది ఆలయ ఉద్యోగులను బదిలీ చేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. వీరిని యాదగిరిగుట్ట, కొండగట్టు, కొమురవెల్లి, భద్రాచలం ఆలయాలకు బదిలీ చేశారు. కాగా, ఈ ఉద్యోగులు 17 ఏళ్ల తర్వాత బదిలీ అయినట్లు సమాచారం.

News August 6, 2024

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో బస్ డ్రైవర్లు నిరసన

image

కరీంనగర్ ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో హైర్ బస్సుల డ్రైవర్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం ఉదయం డ్యూటీలో జాయిన్ అయిన ఓ డ్రైవర్‌కు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు చేయడం పట్ల హైర్ బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు డ్రైవర్ తాను మద్యం సేవించనని, అలవాటు లేదని చెప్తున్నా వినలేదని ఆరోపించారు. హైర్ బస్సుల డ్రైవర్ల ఆందోళనతో సమీప గ్రామాలకు వెళ్లే బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

News August 6, 2024

KNR: నేడు పందెం కోళ్ల వేలంపాట

image

పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం పెంచికలపేట గ్రామశివారులో గతనెల 27న కోడి పందాలు ఆడే వారిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. ఈ ఆటలో పట్టుబడిన రెండు పందెం కోళ్లకు నేడు పోలీస్‌స్టేషన్లో వేలం పాట నిర్వహించనున్నట్లు SI తెలిపారు. మంథని కోర్టు ఆదేశాల మేరకు ఉదయం 11 గంటలకు ఆసక్తి కలిగిన వారు వేలంపాటకు హాజరై కోళ్లను దక్కించుకోవాలన్నారు.

News August 6, 2024

KNR: గుండాల జలపాతంలో పడి యువకుడి గల్లంతు

image

పెద్దపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఆసిఫాబాద్ జిల్లాలోని గుండాల జలపాతంలో గోదావరిఖని రమేశ్ నగర్‌కు చెందిన రిషి ఆదిత్య గల్లంతైనట్లు సమాచారం. స్నేహితులతో కలిసి జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన రిషి.. జలపాతంలో దిగి ఈత కొట్టడానికి ప్రయత్నించగా ఆ నీటిలో జారీ గల్లంతయినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు గుండాలకు వెళ్లారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 5, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజావాణిలో 112 ఫిర్యాదులు. @ బోయిన్పల్లి మండలంలో ఉరి వేసుకొని వృద్ధుడి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వ్యక్తి ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన బ్రేక్ దర్శనాలు. @ పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే. @ ధర్మపురి లో స్వచ్చదనం పచ్చదనం లో పాల్గొన్న ప్రభుత్వ విప్. @ కొడిమ్యాల మండలంలో వ్యక్తి హత్య.