India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
∆} చుంచుపల్లిలో జాబ్ మేళా
∆} చండ్రుగొండలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ పలు శాఖలపై సమీక్ష
∆} సత్తుపల్లిలో డాక్టర్ దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
రైతు రుణమాఫీ ఫిర్యాదులపై వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఖమ్మం జిల్లాలో మాఫీ వర్తించని కుటుంబాలను నిర్ధారించే ప్రక్రియ బుధవారం నుంచి చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.2లక్షల లోపు రుణాలు కలిగిన రైతు కుటుంబ సభ్యుల వివరాలను పంట రుణమాఫీ పోర్టల్లో అధికారులు నమోదు చేయనున్నారు. జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలకు ఇవాల్టి నుంచి నిర్ధారణ ప్రక్రియ మొదలుకానుంది.
ఖమ్మం: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రెవెన్యూ, హౌజింగ్ అధికారులతో రెవెన్యూ, హౌజింగ్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి అట్టి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ బోధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అర గంట క్రీడలకు అన్ని తరగతుల వారికి, అరగంట ఇంగ్లీష్ బోధన ఎంపిక చేసిన తరగతుల వారికి తప్పక ప్రతిరోజు కేటాయించాలని పేర్కొన్నారు.
మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆపై నిప్పంటించుకున్న ఘటన మంగళవారం కొత్తగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన ఇమ్మానుయేల్(54) ఆటో డ్రైవర్ గా వృత్తి నిర్వహిస్తున్నాడు. కాగా మద్యం మత్తులో ఉన్న ఇమ్మానుయేల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో 90% శరీరం కాలిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 27 అడుగుల వద్ద ఉన్న నీటి ప్రవాహం మంగళవారం ఉదయం 10 గంటలకు 28 అడుగులకు చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి గోదావరి 30 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి అధికారులు పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో రెండు నెలల కిందటి వరకు భగ్గుమన్న కూరగాయలు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులపై ప్రభావం చూపాయి. ఏ రకం కొనుగోలు చేయాలన్న కిలో రూ.40పైనే. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండడంతో అన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరగడంతో ధరలు తక్కువ ముఖం పట్టాయి. గత నెలలో టమాట రూ.68 ఉండగా ప్రస్తుతం రూ.29 రూపాయలకు చేరింది. కాకరకాయ రూ.58 రూపాయలు ఉండగా నేడు రూ.24 లభిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద
ఎకరానికి రూ.7,500 చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ఎదురుస్తున్నారు. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని సర్కార్ చూస్తోంది. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.
తమ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు తొలి ఏడాదే ఐదు వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కు కేవలం ఏడాదికి రూ.3 కోట్లు మాత్రమే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసిందని, ఈ ఏడాది 3 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందన్నారు.
Sorry, no posts matched your criteria.