India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్హత ఏదైనా డిగ్రీ అని, 20-33 ఏళ్లు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు.
అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా పాత మొబైల్స్, పాడైన మొబైల్స్ కొంటామంటూ మీ దగ్గరికి వస్తే అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సిపి సునీల్ దత్ సూచించారు. సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడాలని సీపీ సూచించారు.
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో ఇల్లెందు వాసులు మృతిచెందారు. బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చెరువులో ఈత కొడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇన్ఫార్మర్ నెపంతో ఒక దళిత మహిళను హతమార్చడం హేయమైన చర్య అని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. చర్ల(M)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చెన్నాపురం గ్రామ శివారులో స్థానికుల సమాచారం మేరకు ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై చర్ల పోలీస్ స్టేషన్లో Cr.No.81/2024 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
న్యాయవాదితో సహా ఏడుగురుకి జైలు శిక్ష విధిస్తూ బుధవారం మూడో అదనపు జుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి వి.శివ నాయక్ తీర్పునిచ్చారు. ఓ కేసులో అసలు ముద్దాయికి బదులు నకిలీ వ్యక్తిని ప్రవేశ పెట్టినందుకు గాను న్యాయవాదితో సహా ఏడాది జైలు శిక్ష, 1,000 జరిమానా విధిస్తూ మొదటి శ్రేణి న్యాయవాది తీర్పునిచ్చారు.
ములకలపల్లి మండలం కొత్తూరు శివారులో నిన్న రాత్రి ట్రాక్టర్ బోల్తాపడి తాటి ప్రసాద్, నాగమణిలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అశ్వాపురం మండలం తుమ్మలచెరువుకి చెందిన తాటి ప్రసాద్(25), ములకలపల్లి మండలం కమలాపురానికి చెందిన నాగమణితో వివాహం నిశ్చయమైంది. వ్యవసాయం పనులు పూర్తయిన తర్వాత మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం, వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే వారిని కాలం కాటేసింది.
నల్గొండ జిల్లా నిడమనూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న టి.స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయి ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వైద్య సిబ్బంది పనితీరు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి అంటే పునర్జన్మ ఇచ్చే దేవాలయం అని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్కి నివేదిక ఇస్తానన్నారు
సత్తుపల్లికి చెందిన పరిమి లోకేశ్కుమార్ వెండితెరపై దూసుకెళ్తున్నాడు. లఘు చిత్రం నుంచి వెండితెర స్థాయికి ఎదిగి అందరి మన్ననలు పొందుతున్నాడు. తాజాగా విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో ‘ఆత్రం’ పాత్ర పోషించి తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశాడు. విడుదలకు సిద్ధమైన సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన ‘గోట్’ చిత్రంలోనూ నటించాడు. మరో నాలుగైదు చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు దక్కాయి.
మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చి ఓ వ్యక్తి మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. హుటాహుటిన పోలీసుల సాయంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుజురాబాద్కు చెందిన ఓంకార్(25) ఏడాది క్రితమే మణుగూరు యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మణుగూరు ఎస్సై మేడా ప్రసాద్ కేసు నమోదు చేశారు.
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేలంపాట
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} వైరాలో ఎంపీ RRR పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
Sorry, no posts matched your criteria.