India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
KMM: ఏప్రిల్ 5 లోపు రాజీవ్ యువ వికాసం పథకం క్రింద షెడ్యూల్డ్ కులాలకు చెందిన నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఆసక్తి అర్హత గల సంబంధిత SC నిరుద్యోగ యువత https://tgobmmsnew.cgg.gov.in వెబ్సైట్ నందు ఏప్రిల్ 5లోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. అభ్యర్థులు పూరించిన దరఖాస్తు ఫారంను సంబందిత ప్రభుత్వ కార్యాలయాల్లో సమర్పించాలన్నారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు మార్కెట్ శాఖ ఉన్నత శ్రేణి కార్యదర్శి నేటి నుంచి నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటించారు. శనివారం (ఇవాళ) అమావాస్య, ఈనెల 30న ఉగాది, 31న రంజాన్, ఏప్రిల్ 1న రంజాన్ పండుగ తదుపరి రోజు సందర్భంగా సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి మార్కెట్ ఏప్రిల్ 2న పునః ప్రారంభం అవుతుందన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని మార్కెట్ శాఖ అధికారులు పేర్కొన్నారు.
సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు సాగర్ కెనాల్లో మునిగి కన్నుమూశాడు. కొణిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపిన వివరాలు.. తనికెళ్లకు చెందిన బత్తుల కనకారావు కుమారుడు సాయి(15) స్థానిక జెడ్పీహెచ్ఎస్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఒక పూట బడికి వెళ్లొచ్చిన ఆయన మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గ్రామ సమీపాన బోనకల్ బ్రాంచి కెనాల్లో ఈతకు వెళ్లాడు. అయితే, కాల్వలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో మునిగి మృతి చెందాడు.
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
ఖమ్మం జిల్లాలో భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. జిల్లాలో శుక్రవారం అత్యధికంగా ఖమ్మం ఖానాపురం పీఎస్, ముదిగొండ(M) పమ్మిలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అటు మధిరలో 41.2, రఘునాథపాలెం, కామేపల్లిలో 41.0, వైరాలో 40.8, కొణిజర్ల, ఖమ్మం(రూ) పల్లెగూడెంలో 40.6, చింతకాని, వేంసూరులో 40.1, సత్తుపల్లి 39.6, తిరుమలాయపాలెం 39.4, కల్లూరులో 38.8 డిగ్రీలు నమోదయ్యాయి.
మిషన్ భగీరథ ఎస్ఈగా జి.శేఖర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ను ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రణాళికాబద్ధంగా ప్యాక్స్ పని చేయాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శుక్రవారం సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ప్యాక్స్లో ఉన్న సభ్యులు యాక్టివ్గా ఉండేలా చూడాలని చెప్పారు. అటు ప్యాక్స్ రైతులకు ఉపయోగపడే నూతన కార్యక్రమాలను చేపట్టేలా ప్రణాళిక చేయాలన్నారు.
ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి రైల్వే బోర్డు ఛైర్మన్ సతీష్ కుమార్ను ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్- మిర్యాలగూడ, డోర్నకల్- గద్వాల రైల్వే లైన్ అలైన్మెంట్ గురించి వివరించారు. పలు సమస్యలు, సూచనలు తెలపగా రైల్వే బోర్డు ఛైర్మన్ సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఇల్లందు సింగరేణి జేకే 5 ఓసీలో గురువారం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు షూటింగ్ జరిగింది. సినిమాలోని పలు సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించారు. చిత్ర యూనిట్ సభ్యులతో సింగరేణి ప్రాంగణమంతా కోలాహలం నెలకొంది. సింగరేణి యాజమాన్యం షూటింగ్ను పర్యవేక్షించింది.
ఎల్ఆర్ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ. 35వేల కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. జిల్లాలో 1,00,800 మంది దరఖాస్తు చేయగా 7,829 మంది మాత్రమే సొమ్ములు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.
Sorry, no posts matched your criteria.