India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. 7మండలాల్లోని 360క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్లో 7స్క్రీన్లు అమర్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

ఖమ్మం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల పర్యవేక్షణ కోసం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ను కలెక్టర్ అనుదీప్ పరిశీలించారు. 7మండలాల్లోని 360క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు సీసీ కెమెరాలు, వెబ్ క్యాస్టింగ్ ఏర్పాటు చేశారు. క్రిటికల్ కేంద్రాల పర్యవేక్షణకు కలెక్టరేట్లో 7స్క్రీన్లు అమర్చినట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు.

ఈ నెల 11, 14, 17 తేదీల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటరు గుర్తింపు కార్డు లేని పక్షంలో, ఇతర 18 రకాల గుర్తింపు కార్డులలో ఏదైనా ఒక దానిని వెంట తీసుకెళ్లవచ్చని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ప్రతి ఓటరు ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.

దేశంలో ఈ-కేవైసీ చేయించుకోని కారణంగా రద్దయిన రేషన్ కార్డుల గణాంకాలను తెలపాలని ఖమ్మం ఎంపీ రామసాయం రఘురాం రెడ్డి బుధవారం లోక్సభలో కేంద్రాన్ని కోరారు. దీనికి కేంద్ర వినియోగదారులు ఆహార ప్రజాపంపిణీ సహాయ మంత్రి నిముబెన్ జయంతి బాయ్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. అక్టోబరు నాటికి రాష్ట్రాల వారీగా రద్దయిన కార్డులు, ప్రస్తుత కార్డుల వివరాలను ఆమె సభకు అందించారు.

ఖమ్మం జిల్లాలో ఏడు మండలాల్లోని 172 సర్పంచ్, 1,415 వార్డు స్థానాలకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 నుంచి 1గంట వరకు పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపడతారు. ఈ విడతలో 2,41,137 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోనున్నారు. మొత్తం 2,089 బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి, 4,220 మంది సిబ్బందిని విధుల్లో నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.

చెక్ బౌన్స్ కేసులో భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన భాసబోయిన వేణుకు ఖమ్మం అదనపు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వద్ద 2022లో వేణు రూ.9.90 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు దాఖలైంది. న్యాయాధికారి బిందుప్రియ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్కు రూ.100, ఇంటర్కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్కు రూ.500, ఇంటర్కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
∆} మధిర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.

టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా నూతన అడ్హక్ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అడ్హక్ కమిటీ కన్వీనర్గా టి. సంతోష చక్రవర్తి, కో-కన్వీనర్లుగా అల్లపల్లి నగేశ్, అంతటి శ్రీనివాస్, నంద బాల రామకృష్ణ, వందనపు సామ్రాట్ను ఎన్నుకున్నారు. నూతన నాయకత్వం మాట్లాడుతూ.. జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని, వారి హక్కుల కోసం కృషి చేస్తామని తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.