Khammam

News December 4, 2025

తొలి విడత ఎన్నికలు.. 438 నామినేషన్ల ఉపసంహరణ

image

ఖమ్మం జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసినట్లు అధికారులు తెలిపారు. 7 మండలాల్లో కలిపి సర్పంచ్లకు 438, వార్డులకు 556 మంది వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు చెప్పారు. కాగా ఈ నెల 11న జరిగే తొలి విడత ఎన్నికల్లో 7 మండలాల్లో కలిపి 192 స్థానాల్లో సర్పంచ్, 1740 స్థానాల్లో వార్డుల పదవికి ఎన్నికలు జరగనున్నాయి.

News December 4, 2025

మూడో విడత ఎన్నికలు.. తొలిరోజు 90 నామినేషన్లు

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నుంచి 7 మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు సర్పంచ్ పదవికి 90, వార్డులకు 237 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. ఏన్కూరు S-3, W-2, కల్లూరు S-18 W-37, పెనుబల్లి S-23 W-56, సత్తుపల్లి S-11 W-24, సింగరేణి S-11 W-34, తల్లాడ S-12 W-52, వేంసూరు S-12 W-32 నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు.

News December 4, 2025

ఖమ్మం: ఏకగ్రీవాల్లో హస్తం జోరు.. 20కి 19 స్థానాలు కైవసం

image

ఖమ్మం జిల్లాలో గ్రామపంచాయతీ ఏకగ్రీవాల్లో కాంగ్రెస్ హవా స్పష్టమైంది. మొత్తం 20 ఏకగ్రీవ పంచాయతీలకు గాను, 19 స్థానాలను కాంగ్రెస్ మద్దతుదారులు దక్కించుకున్నారు. మిగిలిన ఒక స్థానాన్ని CPI గెలిచింది. Dy.CM భట్టి విక్రమార్క స్వగ్రామం స్నానాల లక్ష్మీపురం సహా, మంత్రులు పొంగులేటి, తుమ్మల నియోజకవర్గాల్లో ఏకగ్రీవాలు కావడం పార్టీకి బలాన్నిచ్చింది. అనేకచోట్ల పోటాపోటీ ఉండటంతో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.

News December 4, 2025

ఖమ్మం: మొదటి విడతలో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీలు ఇవే..!

image

ఖమ్మం జిల్లాలో మొదటి విడత ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామపంచాయతీల వివరాలను అధికారులు వెల్లడించారు. బోనకల్(M)- కలకోట, చింతకాని(M)- రాఘవాపురం, రేపల్లెవాడ, మధిర(M)- సిద్దినేనిగూడెం, సైదల్లిపురం, వైరా(M)- లక్ష్మీపురం, గోవిందాపురం, నారపునేనిపల్లి, రఘునాథపాలెం(M)- మల్లేపల్లి, రేగులచలక, మంగ్యాతండా, రాములుతండా, ఎర్రుపాలెం(M)- గోసవీడు, చొప్పకట్లపాలెం, జమలాపురం, కండ్రిక, గట్ల గౌరారం, కాచవరం.

News December 4, 2025

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 4, 2025

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 4, 2025

ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు: కలెక్టర్

image

పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. అత్యవసర సేవల్లో పనిచేసే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 3, 2025

నకిలీ కాటాలతో రైతుల మోసం.. హైదరాబాద్ ముఠా అరెస్ట్

image

పత్తి కొనుగోలు కేంద్రాల్లో నకిలీ చిప్‌లు అమర్చిన కాటాలతో రైతులను మోసం చేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ముఠాను కల్లూరు ఏసీపీ వసుంధర ఆదేశాల మేరకు తల్లాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్‌లో ఓగిలి శెట్టి శంకర్, జంపాల కోటేశ్వరరావు కీలక వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. వీరి నుంచి ఫోర్జరీ చేసిన చిప్‌లు, మదర్ బోర్డులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News December 3, 2025

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను సజావుగా చేపట్టాలి: అ.కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియను అధికారులు సజావుగా చేపట్టాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.శ్రీజ అన్నారు. బుధవారం తల్లాడ మండలంలో పర్యటించిన అదనపు కలెక్టర్.. రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థులు సమన్వయంతో అధికారులకు సహకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు.

News December 3, 2025

స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పనిచేయాలి: సీపీ

image

ఖమ్మం జిల్లాలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పోలీసు సిబ్బంది పనిచేయాలని సీపీ సునీల్ దత్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులపై బుధవారం ఖమ్మం రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అప్పగించిన భాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని, శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉండాలన్నారు. గ్రామాల్లో ఘర్షణ వాతావరణం లేకుండా పోలీస్ పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని పేర్కొన్నారు.