Khammam

News June 29, 2024

ఖమ్మం: బావిలో పడ్డ ట్రాక్టర్, దంపతులకు తీవ్రగాయాలు

image

నేలకొండపల్లి మండల పరిధిలోని భైరవునిపల్లి సమీపంలోని వ్యవసాయ బావిలో విద్యుత్ మోటర్‌ను ట్రాక్టర్‌తో కట్టి లాగుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడింది. ట్రాక్టర్‌తో పాటు భార్యభర్తలు మాధవి, బాబు ఒక్కసారిగా బావిలో పడ్డారు. భర్త బాబు కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న వారు అక్కడకు చేరుకొని వారిని బయటకు తీశారు. ఈ ఘటనలో భర్త క్షేమంగా బయటపడగా భార్య మాధవికి తీవ్రగాయాలయ్యాయి.

News June 29, 2024

KMM: ‘సాగుబడి.. ఇక ఇదే ఒరవడి’

image

ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ‘రైతు నేస్తం’ కార్యక్రమాన్ని ప్రభుత్వం విస్తృతపరచాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రతి శాసనసభ నియోజకవర్గంలోని ఓ రైతు వేదికలో మాత్రమే అవగాహన కార్యక్రమాలు జరిగేవి. ఐతే ఇందులో భాగంగా ఖమ్మం జిల్లాలో 16, భద్రాద్రి జిల్లాలో 13 కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు క్లస్టర్ల వారీగా రైతు వేదికలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

News June 29, 2024

డీఎస్ మృతికి మంత్రి పొంగులేటి సంతాపం

image

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని తెలిపారు.

News June 29, 2024

డి. శ్రీనివాస్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు: భట్టి

image

మధిర: ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తరింపజేసిన కీలక నేతల్లో డి. శ్రీనివాస్ ఒకరు అని స్మరించుకున్నారు. రాజకీయ దురంధరుడు, ఉన్నత విద్యావంతుడు, బడుగుల సంక్షేమం కోసం ఆయన కృషి చేశారని భట్టి పేర్కొన్నారు.

News June 29, 2024

త్వరలో మరో రెండు పంప్ హౌస్‌లు ట్రయల్ రన్ : కలెక్టర్

image

అశ్వాపురం మండలం భీమునిగుండం కొత్తూరు వద్ద సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను కలెక్టర్‌ జితేశ్‌ శుక్రవారం సందర్శించారు. ఆయనకు జలవనరులశాఖ అధికారులు మ్యాప్ ద్వారా ప్రాజెక్టు గురించి వివరించారు. ఆయన మాట్లాడుతూ.. పూసుగూడెం, కమలాపురం వద్దనున్న పంప్‌హౌస్‌లు ట్రయల్‌ రన్‌కు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలోని 104 కిలోమీటర్ల సీతారామ ప్రధాన కాల్వ ద్వారా జలాలను వదిలేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు.

News June 29, 2024

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

image

ఖమ్మం పుట్టకోట క్రాస్ సమీపంలో గురువారం రోడ్డుప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి కొత్తపల్లి ప్రవీణ్ కుమార్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల వివరాలిలా.. ముదిగొండ మండల కట్టకూరుకు చెందిన ప్రవీణ్ తనికెళ్ల విజయ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. గురువారం కాలేజీకి వెళ్లి ఫీజు చెల్లించి బైక్‌పై తిరిగి వస్తుండగా వెనక నుంచి లారీ ఢీకొట్టిందని తెలిపారు.

News June 29, 2024

కేసీఆర్‌ ఉక్కుసంకల్పం నెరవేరింది: MLC తాతామధు

image

సీతారామప్రాజెక్టు ట్రయల్‌రన్‌ విజయవంతంతో మాజీ సీఎం కేసీఆర్‌ ఉక్కుసంకల్పం నెరవేరినట్లయిందని MLC తాతామధు తెలిపారు. ఖమ్మంలోని శుక్రువారం ఆయన మాట్లాడారు. గోదావరి జలాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయబోతుండటం సంతోషంగా ఉందన్నారు. ప్రాజెక్టు ఇన్నాళ్లు కుంభకోణమని నిందించిన వారు, ఇప్పుడెలా ట్రయల్‌రన్‌ను ప్రారంభించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

News June 29, 2024

రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు : RMKMM

image

ప్రయాణికుల తమ రిజర్వేషన్ టికెట్లను 8 రోజుల ముందస్తుగా చేసుకున్నట్లయితే రిజర్వేషన్ చార్జీల నుంచి మినహాయింపు ఉంటుందని ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ సరీరామ్ అన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇది డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి నాన్ ఏసి స్లీపర్, లహరి ఏసి స్లీపర్, బస్సులలో వర్తిస్తుందని అన్నారు.

News June 28, 2024

ఖమ్మం: రోడ్డు పక్కన శిశువు మృతదేహం

image

పసి గుడ్డును రోడ్డు పక్కన పడేసిన అమానుష ఘటన కూసుమంచి మండలంలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కూసుమంచి మండలం నాయకన్‌గూడెం నుంచి కోదాడ వెళ్లే 5 నెలల శిశువును రోడ్డు పక్కన ఉంది. మాదిగ కుంట వైపు వెళ్తున్న సతీశ్ అనే వ్యక్తికి శిశువు కనిపించింది. జీపీ సెక్రటరీకి తులసిరాంకీ సమాచారం అందించాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో వారు కూసుమంచి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు.

News June 28, 2024

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసు: సీపీ

image

నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే ఐపీసీ సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం నగరంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. నగరంలో నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతూ పట్టుబడిన 45 మంది ద్విచక్ర వాహనదారులతో పోలీస్ కమిషనర్ మాట్లాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. దొంగతనాలు చేసేవారు నంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నట్లు సీపీ పేర్కొన్నారు.