India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రజలు అందించే ప్రతి ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పీ.శ్రీజ, పీ.శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పరిశీలన, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. డీఆర్వో పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.

అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రేపు మార్కెట్లో అన్ని రకాల క్రయవిక్రయాలు నిలిపివేయబడతాయని పేర్కొన్నారు. తిరిగి బుధవారం నుంచి మార్కెట్ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతాయని, రైతు సోదరులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని మార్కెట్ పాలకవర్గం ఒక ప్రకటనలో కోరింది.

ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 20వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని డీఐఈవో కె.రవిబాబు సూచించారు. వచ్చే నెల 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈమేరకు ఈనెల 20లోగా ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. అలాగే, రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం కూడా ఈనెల 20వరకు tgbie.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు మరోసారి సత్తా చాటారు. బాలికలు పైచేయి సాధించి మేటిగా నిలిచారు. ప్రథమ సంవత్సరంలో 78.69% ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 4వ స్థానాన్ని, ద్వితీయ సంవత్సరంలో 87.65% ఫలితాలతో 6వ స్థానాన్ని జిల్లా కైవసం చేసుకుంది. గతేడాది కంటే ఉత్తీర్ణత శాతం గణనీయంగా మెరుగుపడటంతో పాటు, జిల్లా విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మెరవడంపై విద్యాశాఖ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.

ఇంటర్ ఫలితాల్లో ఖమ్మం జిల్లా సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలో 72.06% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 4వ స్థానంలో, ద్వితీయ సంవత్సరంలో 81.60%తో 6వ స్థానంలో నిలిచింది. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం నేటి నుంచి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని డీఐఈఓ రవిబాబు తెలిపారు. మే 13 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు నిరుత్సాహపడకుండా సిద్ధం కావాలని ఆయన సూచించారు.

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.

మధిర మండలం జిలుగుమాడు గ్రామానికి చెందిన దోర్నాల ప్రశాంతి ఇంటర్ ఫలితాల్లో 1000కు 992 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరిచింది. మధిరలో పదో తరగతి పూర్తి చేసి, ఖమ్మంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదివింది. ఆదివారం విడుదలైన ఫలితాల్లో ఈ ఘనత సాధించింది. ప్రశాంతిని కుటుంబ సభ్యులు, అధ్యాపకులు, స్నేహితులు అభినందించారు.

ఇంటర్ 2ndఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఖమ్మం(D)లో రెగ్యులర్ విద్యార్థులు 14627 మంది పరీక్షలు రాయగా 11936 మంది పాసై 81.60 శాతంతో స్టేట్లోనే 6వ ర్యాంక్ వచ్చింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్లో 1928 మందికి 1429 మంది పాసై 74.12 శాతంతో 16వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్లో 1108 మందికి 411 మంది పాసై 37.09%తో 6వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్లో 164 మందికి 79 మంది పాసై 48.17%తో 23rd ప్లేస్ వచ్చింది.
Sorry, no posts matched your criteria.