Khammam

News March 1, 2025

పెనుబల్లి: చిన్నారిపై అత్యాచారయత్నం.. నిందితుడి అరెస్ట్

image

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని ఓ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నం కలకలంరేపింది. మద్యం మత్తులో ఉన్న దుంప వెంకటేశ్వరరావు చాక్లెట్ ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వీ.ఎం.బంజర్ పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2025

టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ!

image

KMM, WGL, NLG టీచర్ MLC ఎన్నికల రిజల్ట్‌పై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఎవరికి వారు గెలుస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రధానంగా PRTU నుంచి శ్రీపాల్ రెడ్డి, UTF నుంచి నర్సిరెడ్డి, స్వతంత్రంగా పూల రవీందర్, BJP సరోత్తం రెడ్డి, సుందర్‌రాజ్, హర్షవర్ధన్ రెడ్డిలు ఉండగా.. శ్రీపాల్‌రెడ్డి, నర్సిరెడ్డి, రవీందర్‌ల మధ్యే పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. రిజల్ట్ కోసం మరో 2 రోజులు చూడాల్సిందే.

News March 1, 2025

భద్రాద్రి: ఇద్దరు యవకులు మృతి.. అక్కా చెల్లెళ్లకు కడుపుకోత!

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు <<15610313>>గల్లంతయి<<>> మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే మృతులు వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం హరిదాసుపల్లెకు చెందిన హరి ప్రసాద్(20), ఖమ్మం రఘునాథపాలెం రేగులచెలకకు చెందిన పవన్(20) గా పోలీసులు గుర్తించారు. భద్రాచలం స్వామివారి దర్శనానికి వెళ్లగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వీరి ఇద్దరి తల్లులు సొంత అక్కాచెల్లెళ్లు. సీఐ రమేశ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 1, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

image

✓ వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ✓ జమలాపురం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ✓ సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన ✓ ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ✓ వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ✓ మధిర శివాలయంలో హుండీ లెక్కింపు ✓ ఖమ్మం వ్యవసాయ మార్కెట్ పునఃప్రారంభం.

News March 1, 2025

యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు:ఎస్ఐ 

image

పెళ్లి చేసుకుంటానని మహిళను గర్భవతిని చేసి ఓ పాపకు జన్మనిచ్చిన తర్వాత పెళ్లి చేసుకోను అని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు. వివరాల ప్రకారం.. తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన బాధితురాలు (25) ఖమ్మం రూరల్ మండలం ఆరెకోడుకి చెందిన చిర్రా మహేష్ మోసం చేశాడని ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

News March 1, 2025

 ‘మీసేవ’ కేంద్రాల్లో  విజిలెన్స్ తనిఖీలు

image

తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ( టీజీఎస్టీఎస్) ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా  ‘మీసేవ’ కేంద్రాల్లో  విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దీనిలో భాగంగా వరంగల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తమ పరిధిలోని ఖమ్మం జిల్లాలో శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఖమ్మం రూరల్ మండలంలోని కరుణగిరి మీసేవ కేంద్రంలో తనిఖీలు చేశారు.

News March 1, 2025

ఖమ్మం: వేసవి జాగ్రత్తల పట్ల ప్రజలకు వైద్య శాఖ సూచనలు

image

ఖమ్మం: సీజన్ మారే సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి వంటి వ్యాధులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ ఎడ్యుకేటర్ అన్వర్ సూచించారు. వేడి గాలుల ప్రభావంతో వడదెబ్బ, అలసట, వికారం వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉన్నందున ఉదయం 11 గంటల తర్వాత బయటకు వెళ్లకుండా గోరువెచ్చని నీరు, తేలికపాటి ఆహారం తీసుకోవాలని తెలిపారు.  

News February 28, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

> ఖమ్మం:ఉద్యోగ విరమణ పొందిన పోలీసులకు సీపీ సన్మానం> సత్తుపల్లి: కార్యకర్తలపై ఎమ్మెల్యే అసహనం> ఖమ్మం: రూ.3 లక్షల మిర్చి పంట చోరీ> బోనకల్: 2 కార్లు డీ.. ఇద్దరికి గాయాలు> ముదిగొండ: బిల్డింగ్ పై నుంచి పడి కార్మికుడి మృతి> తిరుమలాయపాలెం:యువతిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు >సత్తుపల్లి: మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

News February 28, 2025

మంత్రి తుమ్మల అనుచరుడు గాదె సత్యం మృతి

image

సత్తుపల్లి మాజీ జడ్పీటీసీ సభ్యులు, సీనియర్ రాజకీయ నాయకులు గాదె సత్యనారాయణ (76) ఊపిరితిత్తుల వ్యాధితో శుక్రవారం హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రధాన అనుచరుడిగా మూడున్నర దశాబ్దాల పాటు రాజకీయాలలో సేవలందించారు. ఆయన మృతిపట్ల మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే డా. రాగమయి దయానంద్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఆయా పార్టీల నాయకులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

News February 28, 2025

భద్రాచలం గోదావరిలో ఇద్దరు యువకులు మృతి

image

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్‌(18) గా పోలీసులు గుర్తించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!