Khammam

News April 8, 2025

కేయూలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!

image

కాకతీయ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వర్సిటీలో మొత్తం 258 పోస్టులకు గానూ 77 మంది మాత్రమే పని చేస్తున్నారు.ఇంకా 181 పోస్టుల ఉన్నాయి. అకడమిక్‌ రికార్డ్, పరిశోధనలు, విషయ పరిజ్ఞానం, బోధన నైపుణ్యం, ఇంటర్వ్యూ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాగా ఈ పోస్టుల్లో ఎన్ని భర్తీ చేస్తారనే విషయాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు.

News April 8, 2025

భద్రాద్రి: భార్య మందలించిందని.. భర్త ఆత్మహత్య

image

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జరిగింది. ఎస్ఐ నాగుల్ మీరా తెలిపిన వివరాలిలా.. కారేపల్లి మండలం చేన్నంగులగుట్టకు చెందిన డి.సురేశ్ కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. దీంతో భార్య మందలించడంతో ధనియాలపాడులోని ఓ జామాయిల్ తోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య వెంకటరమణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 8, 2025

ఖమ్మం: వివాహేతర సంబంధం.. వ్యక్తి ప్రాణం తీసింది!

image

మహిళ క్షణికావేశంలో ఓ వ్యక్తిని నెట్టివేయడంతో గోడకు తగిలి మృతిచెందిన ఘటన ఖమ్మంలో చోటుచేసుకుంది. ఖానాపురం పోలీసుల వివరాలిలా.. ఏలూరు జిల్లా చింతలపూడి మండలానికి చెందిన రవిప్రసాద్ గత కొద్దిరోజులుగా ఖమ్మం నగరంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.. రవిప్రసాద్‌ను పక్కకు నెట్టివేయడంతో తలకు గాయాలై మృతి చెందాడు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

News April 8, 2025

KMM: ఊరంతా ఏకమై.. సమస్యలు పరిష్కరించుకొని

image

ఖమ్మం(D) ఏన్కూరు(M) మేడిపల్లి గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది. ఓట్లప్పుడు మాత్రమే ప్రజల వైపు చూసే నాయకులకు ఊరంతా ఏకమై, తమ సమస్యలు పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామని గట్టిగా చెబుతున్నారు. గతంలో ఓట్లు బహిష్కరించి మరీ గ్రామంలో మౌలిక వసతులు సాధించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఊరంతా ఏకమై సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కదులుతున్నారు. ఇలా ప్రతీ చోట ఉంటే గ్రామ స్వరాజ్యం అందినట్లే. దీనిపై మీ కామెంట్..

News April 8, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు..!

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష ∆} ఏన్కూరు మండలంలో ఎంపీ రామ సహాయం పర్యాటన ∆} మధిర ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} కల్లూరులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ ∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన ∆} పెనుబల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం.

News April 8, 2025

విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం: 8వ తరగతి నుంచి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ లైబ్రరీ, రీడింగ్ రూమ్స్, మా పాప- మా ఇంటి మణిదీపం, సన్న బియ్యం, తదితర వాటిపై జిల్లా అధికారులతో సమీక్షించారు. గ్రామాలలో రీడింగ్ రూమ్స్ ఏర్పాటు, వాటి నిర్వహణకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు.

News April 8, 2025

ఖమ్మంలో ఈ నెల 9న జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈ నెల 9న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగం అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాల ఖాళీల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18-35 ఏళ్ళు కలిగి డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, బీ ఫార్మసీ, పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులని అన్నారు. ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.

News April 7, 2025

ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష: కలెక్టర్

image

ఖమ్మం: ప్రజలు సమర్పించిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు.

News April 7, 2025

సీపీఎం నేత మృతి.. ఖమ్మం మార్కెట్‌కు సెలవు

image

సీపీఎం కమిటీ సభ్యులు CITU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కామ్రేడ్ యర్రా శ్రీకాంత్ అంతక్రియల నేపథ్యంలో బుధవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఒక రోజు సెలవు ఇచ్చినట్లు అధికారులు ఈరోజు ఓ ప్రకటనలో తెలిపారు. కావున ఖమ్మం జిల్లా రైతాంగ సోదరులు గమనించి తమకు సహకరించాలని కోరారు.

News April 7, 2025

సారపాకకు చేరుకున్న రాష్ట్ర గవర్నర్

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి మహాపట్టాభిషేకం వేడుకలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సోమవారం సారపాక బీపీఎల్ ఐటీసీ హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు స్వాగతం పలికారు. గవర్నర్ ఐటీసీ గెస్ట్ హౌస్‌కు చేరుకొని గౌరవ వందనం స్వీకరించారు.