Khammam

News January 23, 2026

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి: ఖమ్మం అదనపు కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఓనర్లు, డీలర్లు, సేల్స్ అధికారులు, పంప్ ఆపరేటర్లకు సీపీఆర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. హార్ట్ ఎటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చన్నారు. సీపీఆర్‌కు వైద్య అనుభవం అవసరం లేదని, సాధారణ ప్రజలు కూడా చేయవచ్చన్నారు.

News January 22, 2026

ఖమ్మం: ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేశ్వరరావు

image

ఖమ్మం జిల్లా ఎమ్మార్పీఎస్ టీఎస్ అధ్యక్షుడిగా హెచ్చు వెంకటేశ్వరరావును ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపన్న, జాతీయ ఉపాధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు ప్రకటించారు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన ఈయన ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ 28 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడారన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల హక్కుల కోసం పోరాడుతూ సంఘాన్ని ముందుండి నడిపించాలని కోరారు.

News January 22, 2026

ఖమ్మం: గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ సమస్యలపై కలెక్టర్ సమీక్ష

image

ప్రజలకు సత్వర న్యాయం అందేలా అధికారులు మెరుగైన సేవలు అందించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో తహశీల్దార్లు, ఎంపీడీవోలతో గ్రామ పారిశుద్ధ్యం, రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ రెవెన్యూ దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

News January 22, 2026

ఖమ్మం జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు

image

ఓటీపీఎస్ (ఆన్‌లైన్ ట్రాన్సిట్ పాస్ సిస్టమ్) ద్వారా ఇసుకను పూర్తి పారదర్శకంగా సరఫరా చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో గురువారం తహశీల్దార్లు, ఎంపీడీవోలతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్, యాప్ లాంచ్ తర్వాత మాన్యువల్ పంపిణీ నిలిపివేయాలని ఆదేశించారు. ముందుగా ఇందిరమ్మ ఇళ్లకు, గృహ అవసరాలకు ఇసుక సరఫరా చేయనున్నట్లు తెలిపారు.

News January 22, 2026

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో ‘నిఘా’ వైఫల్యం

image

ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత గాలిలో దీపమైంది. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో మెడికల్ కౌన్సిల్ నిబంధనల కోసం పెట్టిన 12 మినహా, మిగిలినవన్నీ మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. నిర్వహణ లోపంతో కీలక నేరాలు జరిగినప్పుడు ఫుటేజీ లభించక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. కోట్లు వెచ్చిస్తున్నా పర్యవేక్షణ కరువైందని రోగులు వాపోతున్నారు. అధికారులు స్పందించి ఆసుపత్రిలో భద్రతను కట్టుదిట్టం చేయాలని కోరుతున్నారు.

News January 22, 2026

ఖమ్మం: మున్సిపల్ పోరు.. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక..!

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. పార్టీలన్నీ గెలుపు గుర్రాల వేటలో పడ్డాయి. ఆశావహులు భారీగా ఉండటంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు సవాలుగా మారింది. కాంగ్రెస్‌లో పోటీ తీవ్రంగా ఉండటంతో సర్వేల ఆధారంగా ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. అటు బీఆర్ఎస్ సైతం సర్వేలతో పాటు వార్డుల్లో పట్టున్న నేతల కోసం కసరత్తు చేస్తున్నాయి. అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేస్తూ గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి.

News January 22, 2026

మహిళా సమాఖ్యలకు ఆర్టీసీ ‘అద్దె’ తోడ్పాటు

image

మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్దె బస్సుల పథకం ఉమ్మడి జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని 21 మండల సమాఖ్యలు నిర్వహిస్తున్న బస్సులకు ఆర్టీసీ రూ.87.52 లక్షల అద్దె చెల్లించింది. ఒక్కో బస్సుకు నెలకు సగటున రూ.69,468 ఆదాయం లభిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 లక్షల నిధులతో ప్రారంభమైన ఈ ప్రక్రియ మహిళలను విజయవంతమైన వ్యాపారవేత్తలుగా మారుస్తోంది.

News January 22, 2026

ఖమ్మం: సర్కారీ బడులకు మహర్దశ.. రూ.7.44 కోట్ల విడుదల

image

ఖమ్మం జిల్లాలోని 1,183 ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం రూ.7.44 కోట్ల నిధులు మంజూరు చేసింది. మౌలిక వసతులు, మరమ్మతుల కోసం రూ.4.99 కోట్లు, సివిల్ పనులకు రూ.78.85 లక్షలు కేటాయించారు. కరాటే, క్రీడలు, బాలికా సాధికారిత కార్యక్రమాలకూ ప్రత్యేక నిధులు ఇచ్చారు. పాఠశాలల యాజమాన్య కమిటీల ద్వారా ఈ నిధులను వెచ్చించి, బడుల రూపురేఖలు మార్చాలని విద్యాశాఖ నిర్ణయించింది.

News January 22, 2026

ఖమ్మంలో జేఈఈ మెయిన్స్‌ షురూ.. తొలిరోజు 98 శాతం హాజరు!

image

ఖమ్మం జిల్లాలో జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఐదు కేంద్రాల్లో జరిగిన ఈ పరీక్షకు విద్యార్థులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. మొత్తం 1,748 మంది అభ్యర్థులకు గాను 1,721 మంది (98.4%) హాజరైనట్లు కో-ఆర్డినేటర్ పార్వతీరెడ్డి తెలిపారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. గంట ముందుగానే తనిఖీలు పూర్తి చేసి విద్యార్థులను లోపలికి అనుమతించారు.

News January 22, 2026

ఖమ్మం: ‘మాకు స్తోమత లేదు.. అక్కడే పూడ్చండి’

image

పొట్టకూటి కోసం వేలాది మైళ్ల దూరం నుంచి వచ్చిన ఆ వలస కూలీకి చివరకు సొంతూరి మట్టి కూడా కరవైంది. బిహార్‌కు చెందిన రాజన్‌రామ్‌ పందిళ్లపల్లి సమీపంలో సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌ రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, అంత దూరం వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లే స్తోమత తమకు లేదని వారు కన్నీరుమున్నీరయ్యారు. దీంతోఅన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు బుధవారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు.