Khammam

News July 17, 2024

ప్రయాణికులారా.. సమస్యలు ఉంటే సంప్రదించండి

image

మహాలక్ష్మి పథకం నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిన కారణంగా ఎదురయ్యే సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడానికి వీలుగా డిపోలకు చెందిన నంబర్లలో సంప్రదించాల్సిందిగా రీజనల్ మేనేజర్ సరిరామ్ ఒక ప్రకటనలో ప్రయాణీకులకు విజ్ఞప్తి చేశారు. ఖమ్మం 99592 25979, మధిర 73829 25289, సత్తుపల్లి 9959 225990, భద్రాచలం 9959 225987, కొత్తగూడెం 9959 225982, మణుగూరు 89853 61796 సంప్రదించాలన్నారు.

News July 17, 2024

రైతు రుణమాఫీపై అనుమానాలు: మాజీ ఎమ్మెల్యే రేగా

image

రైతు రుణమాఫీపై సందేహాలున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆంక్షలు లేవంటూనే ఉత్తర్వులను సవరించడం లేదని మండిపడ్డారు. రైతుల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.

News July 17, 2024

డీఎస్సీ పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: CP సునీల్ దత్

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో జులై 18 నుంచి ఆగష్టు 5 వరకు జరిగే DSC పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS చట్టం అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మంలోని 6 పరీక్ష కేంద్రాలలో జులై 18 తేదీ నుంచి ప్రతి రోజు 163 ఆంక్షలు అమలులో ఉంటాయని చెప్పారు. పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా ఉండొద్దని సూచించారు.

News July 17, 2024

ఖమ్మం: రైలు కింద పడి వ్యక్తి మృతి 

image

ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండల పరిధిలోని ఎర్రుపాలెం, తొండల గోపవరం గ్రామాల మధ్య రైల్వే ట్రాక్‌పై 35 సంవత్సరాల వయసు ఉన్న యువకుడు రైలు కింద పడి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు రైల్వే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

News July 17, 2024

ఖమ్మం: ఈతకు వెళ్లి ముగ్గురి మృతి 

image

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు (s) మండలం బొప్పారంలో ఈతకు వెళ్లి ఖమ్మం జిల్లా వాసులు ముగ్గురు మృతి చెందారు. వివరాలిలా.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం  అశ్వారావుపేట, జూపేడ గ్రామానికి చెందిన శావల్య రాజు (45) అతడి కూతురు శ్రావల్య ఉష (12), శ్రీపాల్ రెడ్డి (40 ) హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఓ శుభకార్యానికి వచ్చి క్వారీ గుంతలో ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో నీట మునిగి మృత్యువాత పడ్డారు.  

News July 17, 2024

రైతు ఆర్థికంగా బలపడడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా బలపడటానికి రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.

News July 17, 2024

రైతు ఆర్థికంగా బలపడడమే తమ లక్ష్యం: మంత్రి పొంగులేటి

image

వ్యవసాయం మరింత లాభసాటిగా మార్చాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆర్థికంగా బలపడటానికి రైతాంగానికి అండగా ఉంటామని చెప్పారు. అందుకే రైతులకు రుణమాఫీ చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం బాగుంటేనే రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం బాగుంటుందని అభిప్రాయపడ్డారు. రేపటి నుంచి రుణమాఫీ కార్యక్రమం ప్రారంభమవుతుందని మంత్రి వెల్లడించారు.

News July 17, 2024

సుప్రీం తీర్పు రేవంత్ రెడ్డికి చెంపపెట్టు: మాజీ మంత్రి సత్యవతి

image

మిద్యుత్ కమిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. కేసీఆర్‌పై ఏదో ఒకటి ఆపాదించాలనే కుట్రకోణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డియల కనిపిస్తుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వం వెసే కమిషన్లు కక్ష సాధింపుల కోసమేనని అన్నారు. రేవంత్ తీరు మార్చుకోవాలని హితవు పలికారు. 

News July 17, 2024

సింగరేణి బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు

image

సచివాలయంలో సింగరేణి అధికారులతో బొగ్గు గనులపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమీక్షా సమావేశం నిర్వహించారు. మరో నాలుగు నెలల్లో ఒడిశా నైనీ బ్లాక్ నుంచి బొగ్గు ఉత్పత్తి ప్రారంభం కావాలన్నారు. సింగరేణి తొలిసారిగా తెలంగాణ వెలుపల చేపడుతున్న ప్రాజెక్టు కాబట్టి … రాష్ట్ర ప్రభుత్వ, కంపెనీ ప్రతిష్టను పెంచేలా మైనింగ్ చేపట్టాలని, స్థానికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పనిచేయాలన్నారు.

News July 17, 2024

కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీస్

image

బయ్యారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ కల్పనాదేవికి రామారావు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలను మంగళవారం ఆయన సందర్శించారు. పాఠశాలలోని 9 ,10 తరగతి విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోతో ఉన్న కొత్త పాఠ్య పుస్తకాలు ఉండగా, మాజీ సీఎం ఫొటోతో ఉన్న పాఠ్యపుస్తకాలను స్పెషల్ ఆఫీసర్ పంపిణీ చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని స్పెషల్ ఆఫీసర్‌కి షోకాజ్ నోటీసు జారీచేశారు.