India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 12,682 మెట్రిక్ టన్నుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే 25,773 టన్నుల ఎరువులను పంపిణీ చేశామని వివరించారు. పంపిణీ కేంద్రాల వద్ద రైతులకు నీడ, తాగునీటి వసతులు కల్పించినట్లు పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో ఏవైనా ఇబ్బందులు ఉంటే వెంటనే మండల వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఆయన సూచించారు.

ఖమ్మం జిల్లా ఆవిర్భవించి 72 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జిల్లా పరిపాలనా ప్రస్థానాన్ని అధికారులు గుర్తుచేసుకున్నారు. 1953 OCT 1న జిల్లా ఏర్పడగా, ఇప్పటివరకు 51మంది కలెక్టర్లు సేవలందించారు. తొలి కలెక్టర్గా జి.వి. భట్ బాధ్యతలు చేపట్టగా, ప్రస్తుతం అనుదీప్ దురిశెట్టి కొనసాగుతున్నారు. వీరిలో ఎ. గిరిధర్ అత్యధికంగా 4 ఏళ్ల 21 రోజుల పాటు కలెక్టరుగా పనిచేసి రికార్డు సృష్టించారు.

తమ భూములను అక్రమంగా కబ్జా చేశారని, న్యాయం చేయాలని కోరుతూ పలువురు వృద్ధ మహిళలు సోమవారం ‘ప్రజావాణి’లో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజను వేడుకున్నారు. ఏళ్ల తరబడి తమ స్థలాల కోసం ఎదురుచూస్తున్నామని, కబ్జాదారుల నుంచి రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల ఫిర్యాదుపై స్పందించిన కలెక్టర్.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

చింతకాని మండల పరిధిలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్కు సోమవారం భారీగా ఎరువుల నిల్వలు చేరుకున్నాయి. సీఐఎల్ కంపెనీకి చెందిన మొత్తం 2,640.30 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వచ్చినట్లు టెక్నికల్ ఏఓ పవన్ కుమార్ తెలిపారు. ఇందులో 20.20.0.13 రకం 1,339.80 టన్నులు, 28.28.0 రకం 1,300.50 టన్నులు ఉన్నాయని వివరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలించి రైతులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.

పదవి వచ్చినా పాత వృత్తిని వదలక ఆదర్శంగా నిలుస్తున్నారు కల్లూరు మండలం తెలగవరం సర్పంచ్ యల్లమందల విజయలక్ష్మి. స్వయం సహాయక సంఘ సభ్యురాలైన ఆమె, కుటుంబ పోషణ కోసం ఇంటి వద్దే కారం, పిండి మిల్లు నడుపుతున్నారు. సర్పంచిగా ఎన్నికైన తర్వాత కూడా ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా, తన వృత్తిని కొనసాగిస్తూనే గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. శ్రమను నమ్ముకున్న ఆమె తీరును చూసి స్థానికులు ప్రశంసిస్తున్నారు.

విద్యుత్ వినియోగదారుల సమస్యల తక్షణ పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా బాట’ కార్యక్రమం జిల్లాలో నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఉదయం 8 గంటల నుంచి మండలాల వారీగా ఈ శిబిరాలు నిర్వహిస్తామని ఎస్ఈ శ్రీనివాసాచారి తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది, జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ఫిర్యాదులను అక్కడికక్కడే పరిష్కరిస్తారన్నారు.

విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నర్సింహులగూడెం పాఠశాలలో పనిచేస్తున్న జి.వీరయ్యను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ఏడాది అక్టోబరులో ఇతనిపై పోక్సో కేసు నమోదు కావడంతో పాటు సస్పెన్షన్ వేటు పడింది. సమగ్ర విచారణ అనంతరం నివేదిక ఆధారంగా డీఈఓ ఈ బర్తరఫ్ నిర్ణయం తీసుకున్నారు.

మాజీ మంత్రి KTR రేపు ఖమ్మం రానున్న తరుణంలో ఐదుగురు కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరి BRSకు ఝలక్ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహంతో నగరపాలక సంస్థలో బీఆర్ఎస్ బలం గణనీయంగా తగ్గింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలే లక్ష్యంగా మంత్రి తుమ్మల పావులు కదుపుతుండగా, మరికొంతమంది కార్పొరేటర్లు కాంగ్రెస్ బాటలో ఉన్నట్లు సమాచారం. కీలక నేత పర్యటనకు ముందే ఈ వలసలు జిల్లా రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.

ఖమ్మం జిల్లాలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమంపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో 75శాతం మంది విద్యార్థులు అనర్గళంగా చదివేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. రెండో దశను 45 రోజుల పాటు సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఫొనెటిక్స్ పద్ధతిలో పదాలను నేర్పించాలని సూచించారు. మొదటి దశలో మంచి ఫలితాలు వచ్చాయని, అదే ఉత్సాహంతో పిల్లల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపరచాలని కోరారు.

ఖమ్మం జిల్లాలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమంపై కలెక్టర్ అనుదీప్ సమీక్ష నిర్వహించారు. నెల రోజుల్లో 75శాతం మంది విద్యార్థులు అనర్గళంగా చదివేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని ఆదేశించారు. రెండో దశను 45 రోజుల పాటు సమర్థవంతంగా అమలు చేయాలని, ముఖ్యంగా ఫొనెటిక్స్ పద్ధతిలో పదాలను నేర్పించాలని సూచించారు. మొదటి దశలో మంచి ఫలితాలు వచ్చాయని, అదే ఉత్సాహంతో పిల్లల్లో అక్షరాస్యత నైపుణ్యాలను మెరుగుపరచాలని కోరారు.
Sorry, no posts matched your criteria.