India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బుధవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాల డీసీసీ కమిటీలతో మీటింగ్ పెట్టారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నా ఎందుకు వ్యతిరేకత వస్తోందని అడిగారు. జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ బలంపై ఆమె చర్చించారు. కాంగ్రెస్పై BRS చేస్తోన్న ఆరోపణలను క్షేత్రస్థాయి నుంచే బలంగా తిప్పికొట్టాలని దిశానిర్దేశం చెసినట్లు సమాచారం. కాగా DCCలతో నేడు ఢిల్లీలో పార్టీ అధిష్ఠానం సమావేశం కానుంది.

పంట గిట్టుబాట ధర రాలేదని కౌలు రైతు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. గ్రామానికి చెందిన బోనగిరి ఉప్పలయ్య అనే కౌలు రైతు తాను పండించిన 40 క్వింటాళ్ల మిర్చి అమ్మితే గిట్టు బాటు ధర రాకపోవడంతో మనస్తాపం చెంది ఉరేసుకొని బలవన్మరణం చెందాడని తెలిపారు. మృత రైతుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఇంటిలో ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే విధంగా జిల్లాలో ‘మా పాప-మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ దంపతుల కుమార్తెను ఎత్తుకొని, సంబురం వ్యక్తం చేశారు.

విద్యార్థులు ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగడమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. కొనిజర్ల(M) తనికెళ్లలోని బాలికల గురుకుల డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో అభ్యర్థుల ఇంటర్వ్యూ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ విద్యార్థులలో ఉత్తమమైన ప్రతిభ కలిగిన వారికి ప్రైవేట్ కంపెనీలో అవకాశం కల్పిస్తే మెరుగ్గా రాణిస్తారని కలెక్టర్ పేర్కొన్నారు.

భద్రాచలంలో హఠాత్తుగా కూలిన భవనాన్ని ట్రస్ట్ పేరుతో విరాళాలు సేకరించి నిర్మాణం చేపట్టారట. నిబంధనలకు విరుద్ధంగా అలాగే నాసిరకం పిల్లర్లతో పాత భవనంపైనే నాలుగు అంతస్తుల నిర్మాణం చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధికారులు కూడా ఈ నిర్మాణాన్ని చేపట్టవద్దని హెచ్చరించారు. అటు యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే చనిపోయినట్లు తెలుస్తోంది.

ఖమ్మంలో తొలి ఆయిల్పామ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వేంసూరు మండలం కల్లూరిగూడెంలో రూ.250 కోట్లతో, 48 ఎకరాల్లో ఫ్యాక్టరీ నిర్మించనుండగా, ఈ ఉగాదికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. భద్రాద్రి జిల్లా అశ్వారావుపేటలో ఒక ఫ్యాక్టరీ ఉండగా, మరొకటి వేంసూరులో నిర్మిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.10లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతుండటం గమనార్హం.

ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఖమ్మం నగరంలోని రిక్కా బజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా సెంటర్ను తనిఖీ చేసి, పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. ఎండ తీవ్రత దృష్ట్యా విద్యార్థులకు చల్లని తాగునీరు సరఫరా చేయాలని, పరీక్ష కేంద్రానికి వచ్చే ప్రతి విద్యార్థినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించాలని తెలిపారు..

ఎల్ఆర్ఎస్ ఫీజుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించిన రాయితీ గడువు ముంచుకొస్తోంది. ఈ నెల 31తో రాయితీ గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా 99,913 దరఖాస్తులు ఉండగా.. 61,343దరఖాస్తులు ఫీజు చెల్లింపునకు అర్హత సాధించాయి. ఇందులో 5,731 మంది దరఖాస్తుదారులే ఫీజు చెల్లించారు. దరఖాస్తులకు ఫీజు చెల్లింపు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడం గమనార్హం.

రైతుభరోసా నగదును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఖమ్మం జిల్లాలో 59,061 మంది రైతుల ఖాతాల్లో మంగళవారం రూ.60.87 కోట్లు జమ అయ్యాయని అధికారులు వెల్లడించారు. ఐదెకరాల మేర సాగు భూమి కలిగిన రైతుల ఖాతాల్లో నగదు జమ ప్రక్రియ కొనసాగుతోందని సమాచారం. జిల్లాలో ఇంకా 86 వేల మంది రైతులకు వారికి ఉన్న భూమి ఆధారంగా రూ.156 కోట్ల సాయం అందాల్సి ఉంది.

రాముడు నడిచిన నేల భద్రాద్రి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆలయ అభివృద్ధికి మొదటి విడతగా రూ. 34.45 కోట్లను కేటాయించింది. ఆలయ నూతన డిజైన్ను విడుదల చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రుల చొరవతో భద్రాద్రి దివ్య క్షేత్రానికి కొత్తశోభ రానుంది. ముందుగా ప్రభుత్వం మాడవీధుల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. శ్రీరామనవమి పర్వదినాన అభివృద్ధి పనులను సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు.
Sorry, no posts matched your criteria.