Khammam

News July 17, 2024

ఖమ్మం: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

ఇన్‌స్టాలో పరిచయమైన బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోక్సో కేసు నమోదయింది. పోలీసుల వివరాలు..ఖానాపురానికి చెందిన 9వతరగతి బాలిక ఖమ్మంకు చెందిన ఓ యువకుడికి ఇన్‌స్టాలో పరిచయమైంది. దీంతో యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. ఇంటికి వెళ్లిన తరువాత గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై భాను తెలిపారు.

News July 17, 2024

తల్లిదండ్రులు మందలించారని బాలిక సూసైడ్

image

తల్లిదండ్రులు మందలించారని ఓ బాలిక పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుండాల మండలంలో చోటుచేసుకుంది. సీఐ రవీందర్ వివరాల ప్రకారం.. గుండాల మండలం సాయనపల్లికి చెందిన రమ్య గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఇటీవల ఇంటికి వచ్చిన రమ్యను మళ్ళీ హాస్టల్‌కి వెళ్ళమని తల్లిదండ్రులు మందలించారు. హాస్టల్‌కు వెళ్లడం ఇష్టం లేక పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

News July 17, 2024

పాలేరు అభ్యర్థులకు నోటీసులు

image

అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు
నుంచి పోటీ చేసిన అభ్యర్థుల్లో వ్యయ వివరాలు వెల్లడించని ఇద్దరికి ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఎన్నికల నియామవళి ప్రకారం పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారానికి వెచ్చించిన ప్రతీ ఖర్చు వివరాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. కానీ పాలేరులో రామిరెడ్డి సుంకిరెడ్డి, రామసహాయం మాధవీరెడ్డి వివరాలు సమర్పించకపోవడంతో నోటీసులు పంపారు. 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని తెలిపారు.

News July 17, 2024

‘ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయి’

image

ఆదాయ పన్ను ఎగవేతదారులపై చర్యలుంటాయని ఖమ్మం ఆదాయపన్ను అధికారి ఉమామహేశ్వర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డీడీవోలకు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలుపై ఆదాయపన్ను అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి ఆదాయపన్ను ముఖ్య ఆదాయ వనరులని, ఆదాయపన్ను క్రింద వసూలయ్యే ప్రతి పైసా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చవుతుందన్నారు.

News July 16, 2024

ఖమ్మం: వృద్ధురాలి హత్య

image

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్యతండాకు చెందిన సక్రి(65)ని దుండగులు హత్య చేశారు. స్థానికుల వివరాలిలా.. సక్రి రోజూ పనికి వెళ్తుంటుంది. ఇవాళ ఇంటి నుంచి బయటకు రాలేదు. చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. 

News July 16, 2024

ఖమ్మంలో అమ్మమ్మపై మనవడి హత్యాచారం

image

ఖమ్మంలో దారుణం జరిగింది. అమ్మమ్మపై మనవడు హత్యాచారం చేశాడు. స్థానికుల వివరాలు. ఉదయ్(24) తన అమ్మమ్మ రాంబాయి(80) వద్ద ఉంటున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ ఉదయ్ ఆమెను మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో ఆమెపై హత్యాచారం చేశాడు. స్థానికులు నిందితుడిని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 16, 2024

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే కఠిన చర్యలు: DMHO భాస్కర్ నాయక్

image

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని DMHO భాస్కర్ నాయక్ అన్నారు. అడ్వైజరీ కమిటీ సమావేశం నిర్వహించారు. సరైన కారణం లేకుండా అబార్షన్ చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

News July 16, 2024

కొత్తగూడెం: పోలీసుల ఎదుట మావోల లొంగుబాటు 

image

చర్ల మండల సరిహద్దు ఆనుకొని ఉన్న ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహన్ ఎదుట రూ.20 లక్షల రివార్డ్ కలిగిన నలుగురు మావోయిస్టులు లొంగిపోయారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు. వీరంతా గతంలో పలు విధ్వంసకర ఘటనల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 

News July 16, 2024

రేపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపు(బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బుధవారం మొహర్రం, తొలి ఏకాదశి పండుగ సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నామన్నారు. తిరిగి గురువారం మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని పేర్కొన్నారు.

News July 16, 2024

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్య

image

ఖమ్మం రోటరీ నగర్‌లో వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. అర్ధరాత్రి అమ్మమ్మను మనుమడు కొట్టి చంపినట్లు స్థానికులు తెలిపారు. దురలవాట్లకు బానిసైన అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.