India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి జిల్లాలో సీత్లా పండుగ
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వివిధ శాఖల అధికారులతో భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోని జూనియర్ లైన్మెన్ల (జేఎల్ఎం) అభ్యర్థులకు బుధవారం ఎంపిక పరీక్ష నిర్వహిస్తున్నట్లు ఖమ్మం ఎస్ఈ ఏ.సురేందర్ తెలిపారు. రెండు పోస్టుల భర్తీకి స్తంభం ఎక్కే పరీక్ష నిర్వహించడంతో పాటు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చిన నేపథ్యాన వారు హాజరుకావాలని సూచించారు.
బోనకల్ మండలంలోని ఓ ఆశా కార్యకర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాపల్లికి చెందిన జీ.పుల్లమ్మ(38) ఆశా కార్యకర్తగా పనిచేస్తోంది. భర్త బ్రహ్మం మద్యానికి బానిసై ఆమెను వేధిస్తున్నాడు. ఆదివారం కూడా మద్యం తాగొచ్చాడు. ఆమెతో గొడవపడి రాత్రి ఇంటి నుంచి వెళ్లి పాఠశాలలో పడుకున్నాడు. సోమవారం ఉదయం ఇంటికి వెళ్లి చూడగా పుల్లమ్మ విగతజీవిగా ఉంది.
ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కాంట్రాక్ట్ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించి రూ.26 లక్షలు స్వాహా చేసిన ఘటనపై అధికారులు విచారణలో వేగం పెంచారు. ఉద్యోగి రామకృష్ణ వివిధ పాఠశాలకు సంబంధించిన నిధులను డ్రా చేసి ఉండొచ్చని అనుమానంతో అప్రమతమైన అధికారులు ఆ దిశగా పరిశీలిస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ తెలిపారు.
తమిళనాడులోని అరుణాచలంలో గిరి ప్రదక్షణకు వెళ్లే భక్తుల కోసం ఖమ్మం, భద్రాచలం డిపోల నుంచి సూపర్ లగ్జరీ బస్సులు నడిపిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ ఏ. సరీరామ్, భద్రాచలం డిఎం బి.రామారావు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసులు 19న రాత్రి బయలుదేరి 20వ తేదీ రాత్రి అరుణాచలం చేరుకుంటాయని వెల్లడించారు. మార్గమధ్యలో విజయవాడ మీదుగా శ్రీకాళహస్తి, కానిపాకం, శ్రీపురం దర్శనం ఉంటుందని తెలిపారు.
కొత్తగూడెం సింగరేణిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, కార్మికుల పిల్లలకు జేఎన్టీయూ పరిధిలోని మంథని, కొత్తగూడెంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు కేటాయించారు. ప్రవేశలకు గత నెల 30 వరకు ఉన్న దరఖాస్తు గడువును ఈనెల 23 వరకు పొడిగిస్తూ సోమవారం ఉత్తర్వులు విడుదలయ్యాయి. దరఖాస్తులను 23వ తేదీలోగా కార్పొరేట్ కార్యాలయానికి పంపించాలని అధికారులు సూచించారు.
సింగరేణి సంస్థలో ఉద్యోగాల భర్తీకి ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ఈనెల 20, 21 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థులు సింగరేణి సంస్థ వెబ్సైట్ నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సింగరేణిలో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడం ఇదే తొలిసారి.
రాత్రి వేళల్లో మద్యం తాగి పంట పొలాల్లో ఆ మద్యం బాటిళ్ళను పడేసే మందుబాబులు ఒక్కసారి ఆలోచించండి అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలం గట్ల మధ్య మద్యం సేవించి వెళ్లే కొందరు యువకులు బాటిళ్ళను పొలం గట్లపై పగలగొడుతుండడంతో ఆ మద్యం బాటిళ్లు పంట పొలాల్లో పడి సేద్యం చేసే సమయంలో రైతన్నల కాళ్లకు గాయాలు అవుతున్నాయి. నిత్య కృత్యంగా మారిన ఈ పరిస్థితి పై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాకాలం సీజన్లో తొలకరి జల్లులు పడుతున్నప్పుడు తండాల్లో లంబాడా గిరిజనులు జరుపుకునే మొదటి పండుగ సీత్లా పండుగ. కాగా ఖమ్మం, భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఉన్న తండాల్లో మంగళవారం సీత్లా పండుగ వేడుకలు వైభవంగా జరగనున్నాయి. ఇప్పటికే తండాల్లో ఉన్న సీత్లా భవాని వద్ద గిరిజనులు తగు ఏర్పాట్లు చేశారు. వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని లంబాడా గిరిజనులు ప్రతి ఏటా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
భద్రాచలం పట్టణంలోని సోమవారం రాత్రి బ్రిడ్జిపై ఎక్సైజ్ ఎస్ఐ కారును మరొక కారు ఢీకొట్టింది. కారులో ఉన్న ఎక్సైజ్ ఎస్ఐకి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. వెంటనే ఎస్సైని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.