Mahbubnagar

News May 8, 2025

మహబూబ్‌నగర్ రూరల్‌లో భార్యను చంపి భర్త ఆత్మహత్య

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణం జరిగింది. రూరల్ మండలం బొక్కలోనిపల్లిలో ఓ వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన సరిత (28), రాజేశ్(35) దంపతులు. వీరు దినసరి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. కుటుంబ కలహాలు, అనుమానంతో మద్యం మత్తులో రాజేశ్ భార్యను గొడ్డలితో నరికి చంపాడు. అనంతరం రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై, సీఐ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.

News May 8, 2025

తప్పుడు పోస్టులు పెట్టకూడదు: ఎస్పీ

image

దేశంలో ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా సామాజిక మాధ్యమాలలో ఎవరూ తప్పుడు పోస్టులు పెట్టకూడదని మహబూబ్ నగర్ ఎస్పీ జానకి సూచించారు. దేశ సరిహద్దులలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా జిల్లాలో ముందస్తు భద్రత చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు 24 గంటలు విధుల్లో ఉంటారన్నారు. పోలీసులకు ప్రస్తుతం సెలవులను రద్దు చేసినట్టు వెల్లడించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు చేయకూడదన్నారు.

News May 7, 2025

MBNR: నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

మే 4న జిల్లా వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షకు పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశపుహాల్‌లో నీట్ పరీక్ష నిర్వాహకులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 13 కేంద్రాల్లో నీట్ పరీక్షను నిర్వహిస్తున్నామన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దివ్యాంగులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుందన్నారు.

News May 7, 2025

MBNR: సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్ అవర్‌లో ఫిర్యాదు చేయాలి

image

సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్అవర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు అప్రమత్తతే ప్రధాన అస్త్రం అని వెల్లడించారు. ఆన్లైన్ మనీ గేమింగ్ బెట్టింగ్ చట్ట విరుద్ధం అని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బెట్టింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ లాంటి పద్ధతులను నేరగాళ్లు ఉపయోగిస్తున్నారన్నారు.

News May 7, 2025

MBNR: ‘ఒప్పంద అధ్యాపకులకు న్యాయం చేయాలి’

image

పాలమూరు యూనివర్సిటీలోని నిరవధిక సమ్మె చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను మహబూబ్‌గర్ ఎంపీ డీకే అరుణ దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. శనివారం ఎంపీ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ, సమస్యల సాధనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

News May 7, 2025

BREAKING.. గద్వాలలో భర్తను చంపిన భార్య

image

గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. కేటీదొడ్డ మండలం బసాపురం శివారులో భర్తను తన భార్య పద్మమ్మ ప్రియుడుతో కలిసి చంపింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మరో ఇద్దరు సహాయం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 7, 2025

MBNR: నూతన విద్యుత్ సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే భూమి పూజ

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో రు.3.29 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్‌కు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మహబూబ్‌నగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, వివిధ గ్రామాల్లో కరెంటు సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

News May 7, 2025

జడ్చర్ల: బీఆర్ఎస్ జెండా ఆవిష్కరించిన మాజీ మంత్రి

image

జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. గంగాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు వరంగల్ సభకు రావాలని కోరారు.

News May 7, 2025

MBNR: ‘మే 3 నుంచి వేసవి శిబిరం ప్రారంభం’

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో సుద్దాల హనుమంతు సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మే 3 నుంచి ప్రారంభించనున్నామని నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనే విద్యార్థులు పదేళ్లు దాటిన వారికి వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 

News May 7, 2025

నారాయణపేట: బాలికపై అత్యాచారం.. 14 రోజుల రిమాండ్

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. SI బాలరాజు తెలిపిన వివరాలు.. NRPTజిల్లా కోస్గి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి వాసి రమేశ్ ప్రేమిస్తున్నానని చెప్పి మార్చి 5న తనవెంట తీసుకెళ్లాడు. 10రోజుల తర్వాత PSకు వచ్చి తాము పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రమేశ్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.