India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నియోజకవర్గంలోని హకీంపేట్లో ఐటీఐ, జూ.కళాశాల, పీహెచ్సీ, 8 నుంచి 12 వరకు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ నూతన భవన నిర్మాణానికి ప్రభుత్వం జీవో జారీ చేసిందని కడా ప్రత్యేక అధికారి కె.వెంకట్ రెడ్డి తెలిపారు. కొడంగల్ను విద్యాహబ్గా మార్చేందుకు సీఎం ప్రత్యేక చొరవతో ఇప్పటికే మెడికల్, పశువైద్య కళాశాలలు, గురుకుల సమీకృత భవనాలు, ఇంజినీరింగ్ కళాశాలను మంజూరు చేసినట్లు తెలిపారు.
మహబూబ్నగర్ పట్టణంలో షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై సర్వే చేపట్టినట్లు సీఐటీయూ జిల్లా కోశాధికారి బి.చంద్రకాంత్, టౌన్ కన్వీనర్ రాజ్ కుమార్ ఆదివారం తెలిపారు. మాల్స్, రైల్వే కార్మికుల్లో నాన్ ఎంప్లాయిమెంట్ సర్వే నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు తమ సమస్యలను వివరించారు.
బిజినేపల్లి మండలం వట్టెం శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నాగర్కర్నూలు కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రసాద్ ఆధ్వర్యంలో వెంకటేశ్వరస్వామికి కలెక్టర్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు కలెక్టర్కు స్వాగతం పలుకగా, అర్చకులు శేషవస్త్రాలు, తీర్థ ప్రసాదాలు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం కలెక్టర్ ఆలయ పరిసరాలను 2గంటల పాటు పరిశీలించారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న వేలాది వ్యవసాయేతర భూములకు గతంలో రైతుబంధు పథకం ద్వారా పలువురు రూ.కోట్లు అందుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా కేవలం సాగు పొలాలకు మాత్రమే రైతు భరోసా అందించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. త్వరలో రైతులకు రాష్ట్ర సర్కారు రైతు భరోసా ద్వారా తీపికబురు చెప్పేందుకు కార్యచరణ పూర్తి చేసే పనిలో నిమగ్నమయింది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహబూబ్నగర్ జిల్లా జానంపేటలో 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. నారాయణపేట జిల్లా కృష్ణ లో 35.7 డిగ్రీలు, గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 35.6 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపనగండ్లలో 31.9 డిగ్రీలు, నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్లో 29.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దేవరకద్ర ఎమ్మెల్యే గవినుల మధుసూదన్ రెడ్డి తండ్రి గవినుల కృష్ణారెడ్డి దశదిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు తన సంతాపాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంశీ చందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం వారి స్వగ్రామానికి వెళ్లి నాగం జనార్దన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఉమ్మడి MBNR జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో MPC, BIPC విద్యార్థులకు ఇటీవలే విద్యాశాఖ ఆదేశాల మేరకు నీట్, JEE, ఎఫ్ సెట్ పై ఉచిత శిక్షణ ప్రారంభించారు. మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. దాదాపు 17,300 మంది చదువుతున్నారు. ప్రతిరోజు ఏడో పిరియడ్లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా కళాశాల ప్రిన్సిపాల్లు విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని రాజాపూర్ మండల సబ్ ఇన్స్పెక్టర్ రవి నాయక్ అన్నారు. రాజాపూర్ మండల కేంద్రంలో శనివారం జాతీయ రహదారి 44పై బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియమ నిబంధనను ప్రతి ఒక్కరు పాటించాలన్నారు. లైసెన్స్ లేని వారికి ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు ఇవ్వకూడదన్నారు. అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. చిన్నచింతకుంట మండలం ధమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:15కి దమాగ్నాపూర్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మ. 1గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ జానకి పర్యవేక్షిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.