Mahbubnagar

News October 4, 2025

అడ్డాకుల: ప్రేమ జంటకు వివాహం

image

ప్రేమించి, పెళ్లికి నిరాకరించిన ప్రియుడితో యువతికి జిల్లా అదనపు ఎస్పీ జోక్యంతో న్యాయం జరిగింది. కందూర్‌కు చెందిన శివ, రాధ ప్రేమించుకున్నారు. రాధ గర్భవతిగా మారడంతో శివ పెళ్లికి నిరాకరించాడు. దీంతో బాధితురాలు జిల్లా అదనపు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అడ్డాకుల ఎస్సై శ్రీనివాస్ చొరవ తీసుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి కందూర్ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో వారికి వివాహం జరిపించారు.

News October 4, 2025

MBNR: పల్లె పోరు.. ఓటర్ లిస్ట్ UPDATE..!

image

మహబూబ్ నగర్ జిల్లాలో ZPTC,MPTC ఎన్నికలకు ఓటర్ లిస్ట్ తుది జాబితాను అధికారులు ఇప్పటికే విడుదల చేశారు. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,99,852 మంది ఓటర్లు ఉండగా..పురుషులు 2,48,222 మంది, మహిళలు 2,51,349 మంది ఇతరులు 11 మంది ఉన్నట్లు ఓటర్ లిస్ట్ ఫైనల్ చేశారు. జిల్లా వ్యాప్తంగా పురుషుల ఓటర్ల కంటే 3,127 మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.

News October 3, 2025

MBNR: ఖర్చులకు డబ్బు ఇవ్వలేదని యువకుడి మృతి

image

ఖర్చులకు డబ్బులు ఇవ్వలేదని యువకుడు గడ్డి మందు తాగి మృతి చెందిన ఘటన మహమ్మదాబాద్ PS పరిధిలో చోటుచేసుకుంది. SI శేఖర్ రెడ్డి వివరాలు.. జానంపల్లికి చెందిన కొమ్ము అమరేందర్(23) తన ఖర్చులకు ఇంట్లో డబ్బులు అడగగా లేవు తర్వాత ఇస్తామని చెప్పగా.. మనస్తాపానికి గురై ఇంట్లో గడ్డి మందు తాగాడు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న మృతి చెందారు. తల్లి కొమ్ము రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదయినట్లు SI తెలిపారు.

News October 3, 2025

MBNR: స్నాతకోత్సవం.. PU దేశంలోనే గిన్నిస్ రికార్డు

image

పాలమూరు విశ్వవిద్యాలయం (PU) MBNRలో 2008లో ఏర్పాటు చేశారు. 2010 నవంబరు 12న NSS(జాతీయ సేవా పథకం) విభాగం ఆధ్వర్యంలో 2,500 మందితో ‘లార్జెస్ట్ బేర్పుట్ వాక్’ అనే కార్యక్రమం నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయంగా పాలమూరు యూనివర్సిటీ రికార్డు సృష్టించింది. ఈనెల 16న స్నాతకోత్సవం సందర్భంగా.. Way2News ప్రత్యేక కథనం.

News October 2, 2025

మహబూబ్‌నగర్: ఎస్పీ కార్యాలయంలో గాంధీ జయంతి

image

జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జానకి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. గాంధీజీ సత్యం, అహింస, సమానత్వం కోసం జీవితాంతం పోరాటం చేశారని ఆమె కొనియాడారు. ఆయన బోధనలు నేటికీ ప్రతి ఒక్కరికీ మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని ఎస్పీ పేర్కొన్నారు.

News October 2, 2025

మహబూబ్‌నగర్: దసరాకు నిరంతర పెట్రోలింగ్: ఎస్పీ

image

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు, పోలీసు సిబ్బందికి ఎస్పీ డి.జానకి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సందర్భంగా ప్రజల జీవితాల్లో సంతోషం, విజయం నిండాలని ఆకాంక్షించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లావ్యాప్తంగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, నిరంతర పెట్రోలింగ్ కొనసాగుతోందని ఆమె వెల్లడించారు.

News October 1, 2025

MBNR: AHTU.. 14 అవగాహన కార్యక్రమాలు- SP

image

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (AHTU) ఆధ్వర్యంలో సెప్టెంబర్ నెలలో పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలలో 14 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పిల్లలు– మహిళలను మాయమాటలు చెప్పి అక్రమ రవాణా చేసే వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద సమాచారం తెలిసిన వెంటనే డయల్100కు సమాచారం ఇవ్వాలన్నారు.

News October 1, 2025

గండీడ్: ఆర్టీసీ బస్సు కండక్టర్‌కు గుండెపోటు

image

మహబూబ్ నగర్ నుంచి తాండూర్‌కు వెళ్లే ఆర్టీసీ బస్ (TS06UD9559) కండక్టర్‌కు గుండెపోటు రావడంతో బస్సులోనే కుప్పకూలాడు. బుధవారం మధ్యాహ్నం బస్సు రంగారెడ్డి పల్లి సమీపంలోకి రాగానే కండక్టర్ సురేష్ గుండెపోటుకు గురయ్యారు. ప్రయాణికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది జానమ్మ, చాంద్‌లు ప్రథమ చికిత్స నిర్వహిస్తూ మెరుగైన వైద్యం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News October 1, 2025

MBNR:11న PUలో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్

image

పాలమూరు వర్సిటీలోని పీజీ కళాశాల సెమినార్ హాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవు ఈనెల 11న నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డాక్టర్ SN అర్జున్ కుమార్ Way2Newsతో తెలిపారు.TGCHE & బల్క్ ఆధ్వర్యంలో QC, QA, కెమిస్ట్, మెషిన్ ఆపరేటర్లు మొదలైన ఖాళీలు ఉన్నాయని, ఈనెల 8లోగాhttps://forms.gle/ctBZNQ1ByU5B6xKB6 వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, డిగ్రీ, ఇంటర్,ITI పురుష అభ్యర్థులకు మాత్రమే అర్హులన్నారు.

News October 1, 2025

కౌకుంట్ల: వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

కౌకుంట్ల మండల కేంద్రంలో మంగళవారం వాగు దాటుతుండగా గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఇస్రంపల్లికి చెందిన అలివేలు సురక్షితంగా బయటపడగా, శాఖాపుర్‌కు చెందిన మంగలి రమేష్ మృతదేహాన్ని బుధవారం ఎస్డీఆర్‌ఎఫ్, గజ ఈతగాళ్ల బృందం గాలింపులో కనుగొంది. వరద ఉద్ధృతికి వీరు వాగులో కొట్టుకుపోయారు.