India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మహబూబ్నగర్ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. చిన్నచింతకుంట మండలం ధమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:15కి దమాగ్నాపూర్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మ. 1గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ జానకి పర్యవేక్షిస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా మాగనూరులో 32.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా జాలాపూర్ 31.5 డిగ్రీలు, వనపర్తి జిల్లా వీపంగండ్లలో 30.7 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా సిరివెంకటపూర్ లో 30.3 డిగ్రీలు, నాగర్ కర్నూల్ జిల్లా వాత్త్వర్లపల్లిలో 28.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతల నమోదు అయ్యాయి.
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి ఇటీవలే మరణించిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం తిమ్మాజీపేట మండలం ఆవంచలోని లక్ష్మారెడ్డి ఇంటికి చేరుకొని శ్వేతా రెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా BRS మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సబ్ జూనియర్స్ ఖోఖో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించగా.. ఈ నెల 14, 15న HYDలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని పిడి రూప తెలిపారు. బాలురు:-శివ, తిమ్మప్ప, భీమేష్(నవాబ్ పేట్), రాఘవేందర్, శివరాజ్(TSWRS), అరవింద్,నితిన్ (కర్ని), ఉమర్, అభినవ్(GPనగర్), అజయ్(మద్దూర్), నరహరి, కార్తీక్ (తూడుకుర్తి), ముసాయిద్ అహ్మద్(కోయిలకొండ), సుశాంత్ (మరికల్), సాయిరాం(పెద్దపల్లి).
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సబ్ జూనియర్స్ ఖోఖో జిల్లాస్థాయిలో ఎంపికలు నిర్వహించగా.. ఈ నెల 14,15న HYDలో జరగనున్న రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని పిడి బి.రూప తెలిపారు.
బాలికల జట్టు: శ్రీలక్ష్మి,గీతాంజలి,నక్షత్ర(కల్వకుర్తి), శశిరేఖ,శివాని,రేవతి(కర్ని),లౌక్య,శైలజ(పెద్దపల్లి),తనుజ(కున్సి),కావేరి(నంచర్ల),ప్రణత (నారాయణపేట),పల్లవి(తూడుకుర్తి), సహస్ర (జడ్చర్ల),లిఖిత(పెద్దమందడి),స్వప్న (మరికల్).
సంవత్సరాలు గడుస్తున్నా అటవీ భూముల్లో పోడు సాగు చేస్తున్న రైతులకు పట్టాలు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో సర్వే చేసినా అధికారులు పట్టాలు పంపిణీ చేయలేదు. దీంతో రైతన్నలు నిరీక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని NGKL, MBNR,WNP, NRPT జిల్లాల్లో పోడు భూములు ఉండగా.. 15,583 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యధికంగా NGKL జిల్లాలో 7,514 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం త్వరగా పోడు పట్టాలను అందించి రైతులు కోరుతున్నారు.
గద్వాల జిల్లాలోని జమ్మిచెడు జమ్మలమ్మ దేవస్థానాన్ని ఎప్పుడైనా ఆకాశం నుండి చూసారా ? చూస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దేవస్థానం వారు ఇటీవల డ్రోన్ కెమరా ద్వారా టెంపుల్ వ్యూ ను పై నుండి దేవస్థానాన్ని ఫోటో తీశారు. చుట్టు ముట్టు నిండుగా నీరు ఉండి మధ్యలో ఈ ఆలయం ఉంటుంది .ఓక్క మాటలో చెప్పాలంటే ఈ ఆలయం ద్వీపం వలే ఉంటుంది .
నారాయణపేట మండలం ఎక్లాస్ పూర్ గ్రామంలో 48ఏళ్లుగా ఒకే వినాయకుడిని ప్రతిష్ఠించి ఐకమత్యాన్ని చాటుకుంటున్నారు. సాధారణంగా గ్రామాల్లో, పట్టణాల్లో వాడవాడలా గణనాథుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. అందుకు భిన్నంగా గ్రామంలో ఒకే గణనాథుడిని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేస్తున్నారు. శుక్రవారం శ్రీగిరి పీఠం శివానంద స్వామి వినాయకుడిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఐకమత్యాన్ని కొనియాడారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 15న చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్కు రానున్నట్లు దేవరకద్ర ఎమ్మెల్యే G.మధుసూదన్ రెడ్డి తెలిపారు. MLA మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందగా.. 15న నిర్వహించే దశ దిన కర్మకి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎస్పీ జానకి సీఎం రాకతో ఏర్పాట్లపై సమీక్షించారు.
ఓటర్ జాబితాలో పేరు సవరణకు ఈనెల 21 వరకు అవకాశం కల్పించినట్లు వనపర్తి జిల్లా డిపిఓ సురేష్ కుమార్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నేపథ్యంలో ఆయన శుక్రవారం అమరచింత ఎంపీడీవో కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ఈనెల 19 వరకు ఓటర్లు తమ పేర్లను సవరించుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈనెల 19న అఖిలపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి 28న తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.