India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
✒గణేష్ ఉత్సవాలు..పలుచోట్ల అన్నదానం
✒తిరుమల శ్రీవారి సేవలో ఎంపీ అరుణ
✒వరద భాదితులకు జితేందర్ రెడ్డి రూ.కోటి విరాళం
✒28న జాతీయ లోక్ అదాలత్
✒కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలు చెల్లించండి:AITUC
✒MBNR:ఇంటర్ అధికారిగా కౌసర్ జహన్
✒NRPT:నేలకొరిగిన వంద ఏళ్లనాటి వృక్షం
✒NGKL:అరుణాచలానికి ప్రత్యేక బస్సు
✒ప్రజాపాలన దినోత్సవ వేడుకలపై కలెక్టర్ల సమీక్ష
✒అరెస్టులు,నిర్బంధాలు BRSకు కొత్తేమీ కాదు:BRS
ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ జితేందర్ తన వంతుగా సీఎం సహాయ నిధికి రూ. కోటి విరాళం ఇచ్చారు. సుదర్శన్ రెడ్డి, ఏపీ మిథున్ రెడ్డి, ఏపీ సంజయ్ రెడ్డితో కలిసి సచివాలయంలో సీఎంకు చెక్కును అందజేశారు. ఇటీవల తెలంగాణలో సంభవించిన వరదలు తనను ఎంతగానో కలిచివేశాయని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు మేలు చేసేందుకు సీఎం రేవంత్ ఆధ్వర్యంలో చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయని అన్నారు.
ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీలో ఈరోజు విషాదం చోటుచేసుకుంది. మరి జిల్లా సిపిఎం పార్టీలో కీలకపాత్ర పోషించిన సీనియర్ నాయకురాలు లక్ష్మీదేవమ్మ(70) మరణించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన అనేక కార్మిక ఉద్యమాల్లో లక్ష్మీ దేవమ్మ చురుకుగా పాల్గొన్నారు. మహిళ ఉద్యమాల నిర్మాణంలోనూ లక్ష్మీ దేవమ్మ చురుకైన పాత్ర పోషించారు. లక్ష్మీ దేవమ్మ మృతి పట్ల సిపిఎం నాయకులు సంతాపం తెలిపారు.
అలంపురంలోని బాల బ్రహ్మేశ్వర ఆలయం లో ఉన్న ద్వారపాలకుల విగ్రహానికి ఈఓ పురేందర్ కుమార్ రంగులు వేయిస్తున్నారు. 60ఏళ్ల క్రితం కళ్ళే రంగస్వామి(కుంటి రంగస్వామి)అనే స్థానిక కళాకారుడు ఈ ద్వారపాలకుల విగ్రహాలను స్వయంగా చేశారు. మంచి రూపలావణ్యం కలిగిన విగ్రహాలను భక్తులు గుర్తించలేకపోతున్నారంటూ ఈవో వాటికి పేయింటింగ్ చేయించారు. ఇంతకాలానికి గుర్తించినందుకు ధన్యవాదాలంటూ కళ్లె వంశీయులు రంగ అన్నారు.
కుల,మత సామరస్యతకు ప్రతీకగా, భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైంది. చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠించి పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. గురువారం గణపతి మండపంలో నిర్వహించిన వేలంపాటలో లడ్డూను గ్రామ ముస్లిం సోదరులు తాజోద్దీన్, మహమ్మద్లు వేలం పాటలో పాల్గొని రూ.15వేలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.
జిల్లా కేంద్రంలో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో అధికారులతో కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఎస్పీ పరేడ్ మైదానంలో సెప్టెంబర్ 17న ప్రజా పాలన దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గుర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని తెలిపారు.
✒వర్షాల EFFECT.. దెబ్బతిన్న పత్తి పంట
✒NGKL:ఉరేసుకొని యువకుడు ఆత్మహత్య
✒నేషనల్ కిక్ బాక్సింగ్లో కోటకొండ బిడ్డకు గోల్డ్ మెడల్
✒ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్
✒ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి:కలెక్టర్లు
✒GDWL: డ్రంక్&డ్రైవ్లో ఆరుగురిపై కేసు నమోదు
✒చట్టాన్ని అతిక్రమిస్తే శిక్షలు తప్పవు: న్యాయమూర్తి శ్రీలత
✒భారీ వర్షం..ఎకరానికి రూ.30 వేలు నష్టపరిహారం ఇవ్వాలి:CPI
నారాయణపేట జిల్లా కోటకొండకు చెందిన గొల్ల అజయ్ క్రీడల్లో సత్తా చాటాడు. జాతీయస్థాయి కిక్ బాక్సింగ్ పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున పాల్గొని గోల్డ్ మెడల్ సాధించారు. అజయ్ నిరుపేద కుటుంబానికి చెందిన బిడ్డ కాగా.. తండ్రి దస్తప్ప వ్యవసాయంతో పాటు గొర్రెల కాపరిగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకున్న అజయ్.. చదువుతోపాటు ఇష్టమైన కిక్ బాక్సింగ్లో మెడల్ సాధించి ఔరా అనిపించాడు.
-CONGRATS
మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతారెడ్డి ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తిమ్మాజిపేట మండలం ఆవంచ గ్రామంలో శ్వేతారెడ్డికి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డి, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యాన్ని కల్పించారు. శ్వేతా రెడ్డి మరణం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. గురువారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా కానాయిపల్లి 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గద్వాల జిల్లా గట్టులో 30.5 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా ఉడిత్యాల్ 29.5 డిగ్రీలు, నారాయణపేట జిల్లా గుండుమల్ లో 29.0 ఉష్ణోగ్రత నమోదయింది. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేటలో 29.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Sorry, no posts matched your criteria.