India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవికాలంలో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తత అవసరమని మహబూబ్నగర్ అగ్నిమాపక శాఖ స్టేషన్ హౌస్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. గృహాలు, హాస్పిటల్స్, పాఠశాలలు, కర్మాగారాల్లో ప్రమాదాలు, వరదలు, రోడ్డు, రైలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా ప్రజలకు సేవ చేసేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖ నంబర్ 101కు సమాచారం అందించాలన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా బల్మూరు మండలం లక్ష్మిపల్లి గ్రామానికి చెందిన చిన్నారులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నాలుగేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి గుండాల కుమార్ మృతిచెందగా, అప్పటి నుంచి కూలీ పనులు చేస్తూ పిల్లలను పోషిస్తున్న తల్లి దేవి ఇటీవలే అనారోగ్యంతో మృతిచెందింది. అనాథలుగా మారిన ఆ పిల్లలు ‘అమ్మానాన్న’ కావాలంటూ విలపిస్తున్నారు. ప్రభుత్వం వారిని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.
ఈనెల 17వ తేదీ నుంచి 29వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి పథకంపై అవగాహన కార్యక్రమాలను మండలాల వారీగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి వెల్లడించారు. ముందుగా గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జడ్చర్లలో నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు.
మహబూబ్నగర్ జిల్లాకి చెందిన టి.సత్యం గౌడ్, పుష్పలత దంపతుల కుమార్తె టి.హన్సికకు ఇటీవల గచ్చిబౌలిలో జరిగిన కూచిపూడి ప్రదర్శనలో కనబరిచిన ప్రతిభకు గాను, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా స్థానిక ఎంజే ఇన్స్టిట్యూషన్ మేనేజ్మెంట్ వారు విద్యార్థినిని శాలువాతో సత్కరించారు. ప్రతి విద్యార్థి చదువులోనే కాకుండా ప్రతి రంగంలో రాణించాలని, ఇలాంటి సత్కారాలు ఎన్నో అందుకోవాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూ భారతి – 2025 చట్టంపై రెవెన్యూ అధికారులకు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ‘భూ భారతి’ భూమి హక్కుల రికార్డు – 2025 చట్టంపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, ఇతర రెవెన్యూ సిబ్బందితో పాటు ఇతర అధికారులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వేసవి దృష్టిలో పెట్టుకుని ఉపాధి పథకం కూలీలు వడదెబ్బకు గురికాకుండా వారిని అన్ని విధాలుగా కాపాడాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర పోయి అధికారులను ఆదేశించారు. బుధవారం హన్వాడలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆమె తనిఖీ చేసి కూలీలతో కాసేపు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వేసవి ముగిసే వరకు కూలీలకు పనిచేసే దగ్గర టెంటు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాటు నీటిని సిద్ధంగా ఉంచాలని సూచించారు.
ఆస్తి కోసం తండ్రి మృతదేహానికి కన్న కొడుకు తలకొరివి పెట్టకపోవడంతో చివరకు చిన్న కూతురు పెట్టింది. ఈ ఘటన బుధవారం MBNR పద్మావతి కాలనీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాలనీ వాసి మాణిక్యరావు మృతిచెందారు. దహన సంస్కారాలకు ఏర్పాట్లు జరుగుతుండగా తలకొరివి పెట్టాల్సిన కుమారుడు రూ.కోటి విలువ చేసే ఇల్లు, 10 తులాల బంగారం ఇస్తేనే తలకొరివి పెడతాననడంతో చివరకు బంధువుల సూచనతో చిన్నకూతురు తలకొరివి పెట్టింది.
మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి బుధవారం పోలీస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించి మాట్లాడారు. నెలవారి నేర సమీక్ష, గ్రేవ్, నాన్ గ్రేవ్, యూఐ కేసులు, ఎస్సీ, ఎస్టీ, పోక్సో కేసులు, మహిళలపై నేరాలు, దొంగతనాలు, ఎఫ్ఎస్ఎల్ నివేదికలు, అరెస్టులు వంటి అంశాలు పెండింగ్లో లేకుండా చూడాలన్నారు. నిత్యం పెట్రోలింగ్ నిర్వహించాలని, ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు.
రానున్న పోటీ పరీక్షల సన్నద్ధం చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగులకు జిల్లా కేంద్రంలో బుధవారం ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్, వీఆర్వో, టెట్, వీఆర్ఏ డీఎస్సీ, తదితర పలు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందివ్వనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
✔నీళ్లతో రాజకీయం చేయడం BRSకు తగదు: మక్తల్ ఎమ్మెల్యే✔రైల్వే అధికారులతో ఎంపీ డీకే అరుణ సమీక్ష✔అకాల వర్షం.. దెబ్బతిన్న పంటలు✔GDWL:ఈడ్చుకెళ్లిన ట్రాక్టర్..మహిళ మృతి ✔భూభారతిపై అవగాహన కలిగి ఉండాలి:కలెక్టర్లు✔పలుచోట్ల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం✔‘రజతోత్సవ సభకు తరలిరండి’:BRS✔MBNR: ఉచిత శిక్షణ ప్రారంభం ✔పలుచోట్ల డ్రగ్ అండ్ డ్రైవ్
Sorry, no posts matched your criteria.