Mahbubnagar

News September 8, 2024

ఉమ్మడి జిల్లాలో గణనీయంగా పెరిగిన BSNL

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. 2 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని, BSNLలో రూ.10 నుంచి రూ.3వేల వరకు ధరలతో 12 రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

News September 7, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✔శ్రీశైలం డ్యామ్..8 గేట్ల ఎత్తివేత
✔NGKL:బొలెరో వాహనం ఢీకొని చిన్నారి మృతి
✔దౌల్తాబాద్:అప్పుడే పుట్టిన శిశువుని పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు
✔పలుచోట్ల వర్షం.. సజావుగా రాకపోకలు
✔ఉమ్మడి జిల్లాలో ఘనంగా వినాయక చవితి వేడుకలు
✔NRPT:10న అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక
✔పలుచోట్ల మట్టి విగ్రహాలు పంపిణీ
✔ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోండి:SIలు

News September 7, 2024

SDNR: దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడి హత్య

image

షాద్‌నగర్ పట్టణ సమీపంలోని హాజీ పల్లి రోడ్డులో ఎల్లయ్య అనే వ్యక్తి దొంగతనం చేస్తుండగా ఆరేళ్ల బాలుడు చూశాడు. ఈ విషయం ఎవరికైనా చెబుతాడేమోనని భయంతో ఎల్లయ్య అనే వ్యక్తి బాలుని బండకేసి బాధడంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి తల పూర్తిగా చిక్కిపోయి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News September 7, 2024

MBNR: ఉమ్మడి జిల్లాలో ఈ మండలాల్లో నిరక్షరాస్యులు ఎక్కువగా!

image

ఉమ్మడి జిల్లాలో నిరక్షరాస్యుల సంఖ్య 2011లో 7,78,184 ఉండగా ఇప్పుడు 10 లక్షలు దాటింది. GDWLలో కేటీదొడ్డి, గట్టు, ధరూర్, NRPTలోని దామరగిద్ద, మద్దూరు, కోస్గి, NGKLలోని బిజినేపల్లి, పెద్దకొత్తపల్లి, తెలకపల్లి, అచ్చంపేట, మన్ననూరు, అమ్రాబాద్, పదర, WNPTలో ఖిల్లాఘణపూర్, పెద్దమందడి, MBNRలో కోయిలకొండ, గండీడ్, బాలన గర్ మండలాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రపంచ అక్షరాస్యతా దినోత్సవంగా ప్రత్యేక కథనం.

News September 7, 2024

మహబూబ్‌నగర్: భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం

image

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్లు జలమయం అయ్యాయి. తాండూర్-మహబూబ్‌నగర్ రోడ్డుపై రాకపోకలకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. అధికారులు ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన కల్వర్టులపై నుంచి వరద నీరు ప్రవహించింది. శుక్రవారం రాకపోకలు అగిపోయాయి.

News September 7, 2024

మండప వివరాలు నమోదు చేసుకోండి: SP

image

వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వివరాలను జిల్లా పోలీస్ శాఖ వారు రూపొందించిన పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని ఎస్పీ జానకి తెలిపారు.https://policeportal.tspolice.gov.in వెబ్ సైట్‌లో నమోదు చేయాలని, భద్రత, బందోబస్తు కోసం మాత్రమేనని, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లు, వదంతులను నమ్మవద్దని, ఎలాంటి సందేహాలు ఉన్నా డయల్ 100కు కానీ, పోలీస్ కంట్రోల్ రూమ్ ఫోన్ 87126 59360కు ఫోన్ చేయాలన్నారు.

News September 6, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!

image

✔శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్
✔ఫ్రీ కరెంట్.. ఉమ్మడి జిల్లాకు రూ.20 కోట్ల భారం
✔మళ్లీ వర్షం..MBNR- తాండూర్ రహదారి బంద్
✔భారీ వర్షం.. పలు చెరువుల నుంచి వరద
✔సుంకేసుల జలాశయం 5 గేట్ల ఎత్తివేత
✔కులగణన పోరాటానికి మద్దతు ఇస్తాం:CPI
✔పలుచోట్ల మట్టి వినాయకులు పంపిణీ
✔రుణమాఫీ కానీ రైతులు ఆందోళన పడొద్దు: కలెక్టర్లు
✔ఫ్రైడే డ్రైడే.. సీజనల్ వ్యాధులపై ఫోకస్
✔ పండుగలు ప్రశాంతంగా జరుపుకోండి:SIలు

News September 6, 2024

MBNR: అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మహిళ డిగ్రీ, పీజీ కళాశాల ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. కామర్స్, ఫిజిక్స్, ఉర్దూ, పొలిటికల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, బోటనీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, హిస్టరీ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 6, 2024

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో EAPCET/NEET/JEE తరగతులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థులకు EAPCET/NEET/JEE తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. తరగతులకు సంబంధించిన కార్యాచరణను రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 6, 2024

MBNR: విద్యుత్ సిబ్బంది లంచం అడిగితే ఫిర్యాదు చేయండి..

image

విద్యుత్ సిబ్బంది ఏదైనా పనికి లంచం అడిగితే ఫిర్యాదు చేయాలని విద్యుత్తు సంస్థ సీఎండి శుక్రవారం ముషారఫ్ ఫరుఖీ తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న సిబ్బంది గానీ అధికారులు కానీ ఏదైనా పనికి లంచం అడిగితే 040-23454884, 7680901912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. విద్యుత్ శాఖలో అవినీతిని అరికట్టేందుకు శ్రీకారం చుట్టారు.