Mahbubnagar

News September 4, 2024

MBNR: ‘మట్టి మేలు’ తలపెట్టవోయ్!

image

పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలనే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే వ్యాపారులు వివిధ ప్రాంతాల నుంచి ఆకట్టుకునే రూపాల్లో ఉన్న మట్టి గణపతి విగ్రహాలను ఇప్పటినుంచే మార్కెట్లో అమ్మకానికి ఉంచుతున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల కన్నా మట్టి విగ్రహాలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని నిపుణులు అంటున్నారు.

News September 4, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలకు మంచి రోజులు రానున్నాయి. పాఠశాలల్లో మరుగుదొడ్లు శుభ్రం చేయడానికి సిబ్బంది లేకపోవడంతో.. విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఉమ్మడి జిల్లాలో 3,227 ప్రభుత్వ పాఠశాలల్లో.. 3,01,693 మధ్య విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలల్లో స్కావెంజర్లు ఏర్పాటుకు ప్రభుత్వం ముందడుగు వేసింది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు అయ్యాయని డీఈఓ రవీందర్ తెలిపారు.

News September 4, 2024

కొనసాగుతున్న జూరాల విద్యుత్ ఉత్పత్తి

image

జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 5 యూనిట్లలో ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్ ఈలు సురేశ్, సూరిబాబు వివరించారు. ఎగువలో 5 యూనిట్ల నుంచి 195 మెగావాట్లు, 130,116 ఎం. యూ. దిగువలో ఇప్పటి వరకు 99,710 ఎంయూ విద్యుదుత్పత్తి చేపట్టామన్నారు. ఇప్పటి వరకు 228.909 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి సాధించామని తెలిపారు.

News September 4, 2024

మహబూబ్ నగర్-విశాఖ ఎక్స్‌ ప్రెస్ రద్దు

image

భారీ వర్షాల కారణంగా MBNR- విశాఖపట్నం, విశాఖపట్నం- MBNR(12862/61) ఎక్స్ ప్రెస్ రైళ్లను నిరవధికంగా రద్దు చేశారు. వరంగల్-ఖమ్మం మధ్యన వరదలకు పట్టాలు దెబ్బతినడంతో ఈ రైలును ఆది, సోమతో పాటు మంగళవారం కూడా దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేశారు. విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు(12862) రోజూ సాయంత్రం 6.20 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి, విశాఖపట్నం నుంచి వచ్చే రైలు (12861) రోజూ ఉదయం 6.45 గంటలకు కాచిగూడకు వస్తుంది.

News September 4, 2024

ప్రభుత్వ వైఫల్యంతో నష్టం వాటిల్లింది: నిరంజన్ రెడ్డి

image

WNP: ప్రభుత్వ వైఫల్యంతో రాష్ట్రమంతా ఈ రోజు అపార నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, కానీ ఈ ప్రభుత్వం ఎలాంటి సోయి లేకుండా, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోలేదన్నారు. ఐదు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తుంటే ఈ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి పోయారని నిలదీశారు.

News September 4, 2024

శ్రీశైలం UPDATE.. నీటి మట్టం 883.80 అడుగులు

image

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను ఎత్తి 2,70,470 క్యూసెక్కులు, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా 67,217 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలో నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. జూరాల నుంచి 2,08,511 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 10,326 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.

News September 4, 2024

MBNR: బీఆర్ఎస్ నేతలకు సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్

image

విపత్కర పరిస్థితుల్లో BRS నేతలు రాజకీయాలు చేయొద్దని AICC కార్యదర్శి సంపత్ కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘భారీ వర్షాలతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా 24 గంటలు తమ ప్రభుత్వం, కాంగ్రెస్ కార్యకర్తలు పని చేస్తున్నారు. BRS నేతలు KTR, హరీశ్ రావు ఇద్దరు రాజకీయ లబ్ధి కోసం విచక్షణ లేకుండా మాట్లాడుతున్నారు. జనాలు తిరగబడి చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని’ ఆయన హెచ్చరించారు.

News September 3, 2024

గద్వాల: వెంకటేశ్వర్ రెడ్డి ఇంట్లో ACB సోదాలు

image

MBNR జిల్లాలో ఏసీబీ రైడింగ్‌లో పట్టుబడిన DSTO దిన్నె వెంకటేశ్వర్ రెడ్డి స్వస్థలమైన గద్వాల పట్టణంలోని ఆయన ఇంట్లోACB అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సోదాలలో నల్గొండ ఏసీబీ ఎస్ఐలు వెంకట్రావు, రామారావు ఆధ్వర్యంలో మొత్తం 9మంది బృందం పాల్గొన్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వర్ రెడ్డి భార్య ప్రవీణను విచారిస్తున్నారు.

News September 3, 2024

ఉమ్మడి జిల్లాల్లో ముఖ్యాంశాలు.!

image

☞MBNR: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో గుడిసె దగ్దం. ☞MBNR:రూ. 10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిఎస్టీఓ ☞WNP:9న వనపర్తి కిరణాషాప్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ రాక ☞అయిజ:ప్రమాదకరంగా మారిన ఐజ చౌరస్తా విద్యుత్ వైర్లు ☞వట్టెం:నీట మునిగిన వేంకటాద్రి రిజర్వాయర్.
 ⁠☞KLKY:ఎల్లికలు లో ఘనంగా ఎల్లమ్మ బోనాలు

News September 3, 2024

MBNR: లంచం తీసుకుంటూ దొరికిన GOVT అధికారి

image

ACB వలలో మరో అవినీతి చేప చిక్కింది. MBNR జిల్లా వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ స్టేట్ ట్యాక్స్ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి రూ.10 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా చిక్కాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ వ్యాపారి సీడ్స్ అండ్ స్క్రాప్ వ్యాపారానికి సంబంధించి జీఎస్టీ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారి వెంకటేశ్వర్ రెడ్డి రూ.50 వేలు డిమాండ్ చేయగా వ్యాపారి ఏసీబీని ఆశ్రయించినట్లు వెల్లడించారు.