Mahbubnagar

News March 20, 2025

దేవరకద్ర: పాలమూరు-రంగారెడ్డికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటు: ఆల

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఫైరయ్యారు. పాలమూరు జిల్లా నుంచి తాను సీఎం అయ్యానని, ఈ జిల్లాకు అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని రేవంత్ రెడ్డి అన్న మాటలు డొల్ల మాటలేనన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కార్ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

News March 20, 2025

మహబూబ్‌నగర్: చెత్త కుప్పలో మగ్గుతోన్న బాల్యం..!

image

దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని చెబుతున్నా ఇంకా పేదల జీవితంలో మార్పు రావడం లేదు. కడుపు నింపుకునేందుకు ఆ తల్లిదండ్రులు పిల్లలను ఇటుక బట్టీలకు, చెత్త కుప్పల్లో ఏరుకునేందుకు పంపిస్తున్నారు. ఇలాంటి పేదలను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బాల కార్మికులపై, పేదలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఆదుకోవాలని కోరుతున్నారు.  

News March 20, 2025

మహబూబ్‌నగర్: బైపాస్ రోడ్డు నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి 

image

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డును నిర్మించాలని కేంద్ర రోడ్డు రవాణా & రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో గురువారం మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ డీకే అరుణతో కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు.

News March 20, 2025

MBNR: ‘వడదెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలి’

image

వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వడదెబ్బ బాధితులకు తక్షణమే తగిన చికిత్స అందించాలని MBNR కలెక్టర్ విజయేంద్రబోయి వైద్యసిబ్బందిని ఆదేశించారు. జానంపేట PHCని  ఆకస్మిక తనిఖీచేశారు. అన్ని విభాగాలు, రిజిస్టర్లను ఆమె పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని వైద్య సేవలు అందుబాటులో ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News March 20, 2025

ఆసుపత్రిపై ప్రజలకు నమ్మకం పెరగాలి: కలెక్టర్

image

మూసాపేట మండలం జానంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రులదలో అన్ని రకాల వైద్య సేవలు ఉన్నందున, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పట్ల ప్రజలకు నమ్మకం కలిగేలా నడుచుకోవాలని సూచించారు.

News March 20, 2025

మన్యంకొండ హుండీ ఆదాయం రూ.35.26 లక్షలు

image

మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత బుధవారం 2వసారి హుండీ లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించిన సొమ్ము మొత్తం రూ.35,26,085 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో దేవస్థానం ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, అళహరి రామకృష్ణ, ఈవో శ్రీనివాసరాజు, సహాయ కమిషనర్ మదనేశ్వర్, సూపరింటెండెంట్ నిత్యానంద చారి, IDBC మేనేజర్ నీలకంఠ పాల్గొన్నారు.

News March 20, 2025

MBNR: బ్యాంకుల్లో ఉద్యోగం.. APPLY చేసుకోండి

image

బీసీ స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో ఒక నెల నాన్ రెసిడెన్షియల్ ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు బీసీ అభివృద్ధి అధికారిని ఇందిర, BC స్టడీ సర్కిల్ డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. ఉమ్మడి మహబూబ్ నగర్‌కు చెందిన అర్హులైన బీసీ అభ్యర్థులు ఏప్రిల్ 8లోగా సంబంధిత వెబ్ సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, ఏప్రిల్ 12న MBNRలో ఆన్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందన్నారు. ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తామన్నారు.

News March 20, 2025

మహబూబ్‌నగర్‌లో AR కానిస్టేబుల్ సూసైడ్

image

మహబూబ్‌నగర్‌లో ఏఆర్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్నారు. సీఐ అప్పయ్య తెలిపిన వివరాలిలా.. స్థానిక గౌడ్స్ కాలనీలో నివాసముంటున్న 2009 బ్యాచ్ కానిస్టేబుల్ ఆకుల శ్రీనివాస్(38) ఏడాది క్రితం రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన ఆయన మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరేసుకున్నాడు. మృతుడి భార్య మమత ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News March 20, 2025

BUDGET.. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యం

image

రాష్ట్ర బడ్జెట్‌లో ఉమ్మడి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసేందుకు ప్రాధాన్యం ఇచ్చింది. KLIకు రూ.800కోట్లు, కోయిల్‌సాగర్ రూ. 80.73కోట్లు, నెట్టెంపాడుకు రూ.144కోట్లు, సంగంబండకు రూ.98.08కోట్లు, నల్లమలలో పర్యాటక అభివృద్ధికి రూ.242 కోట్లు, కురుమార్తి ఆలయ అభివృద్ధికి రూ.110 కోట్లు, పాలమూరు వర్సిటీకి రూ.50కోట్లు కేటాయించగా పాలమూరు ప్రాజెక్టుకు నిరాశే మిగిలింది. బడ్జెట్‌పై మిత్రమ స్పందన వస్తోంది.

News March 20, 2025

MBNR: రంజాన్ మాసం.. హాలీమ్‌కు సలాం.!

image

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి ఇస్తారు.మీరు తింటే ఎలా ఉందో కామెంట్ పెట్టండి?

error: Content is protected !!