Mahbubnagar

News September 3, 2024

MBNR: అతిథి అధ్యాపకుల సేవలను వినియోగించుకునేందుకు ఉత్తర్వులు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అతిథి ఆధ్యాపకుల సేవలను 2024-25 విద్యా సంవత్సరానికి వినియోగించుకునేందుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కొత్తగా జూనియర్ కళాశాలలో అధ్యాపకులను నియమించనుంది. ప్రస్తుతం వీరి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది. వీరు విధుల్లో చేరే వరకు అతిథి అధ్యాపకులను కొనసాగించనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

News September 3, 2024

NGKL: 14 కిలోమీటర్ల మేర నిలిచిన వరద నీరు..

image

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన వట్టెం ప్యాకేజీ 7 సర్జిపుల్ పంప్ హౌస్‌లోకి దాదాపు 14 కిలోమీటర్ల మేర వరద నీరు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ నీటిని మోటర్ల ద్వారా ఎత్తి పోయడానికి దాదాపు 15 రోజులు పట్టనున్నట్లు సమాచారం. పంప్ హౌస్‌లో ఉన్న మోటార్లకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవీందర్ మీడియాకు తెలిపారు.

News September 3, 2024

గణేశ్ విగ్రహాలకు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

image

జిల్లాలో ప్రతిష్ఠించే గణేశ్ విగ్రహాలకు అనుమతి తీసుకోవాలని, మండపాల నిర్వహకులు https://policeportal.tspolice.gov.in/index.htm పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలని SP జానకి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ కళాభవన్‌‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవ సమితి నాయకులు, నిర్వహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్ని విగ్రాహాలు ప్రతిస్ఠిస్తారో తెలియజేస్తే అందుకు అనుగునంగా బందోబస్తు నిర్వహిస్తామన్నారు.

News September 3, 2024

భారీ వర్షాలు.. 10 పూర్తిగా, 524 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 30,950 ఇళ్లు కూలడానికి సిద్ధంగా ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. అందులో 20 వేల ఇళ్లను పాక్షికంగా నేల మట్టం చేశారు. ఇటీవల వర్షాలకు ఉమ్మడి జిల్లాలో 10 ఇళ్లు పూర్తిగా, 524 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మరో 11 వేల ఇళ్లకు నోటీసులు ఇచ్చి వదిలేశారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల కోసం లబ్ధిదారుల నుంచి మొత్తం 2.14 లక్షల దరఖాస్తులొచ్చాయి.

News September 3, 2024

శ్రీశైలం UPDATE

image

శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్ల ద్వారా 4,71,730 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్తు కేంద్రాల 67,785 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగరుకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 884.10 అడుగుల (210.5133 TMCలు)గా ఉంది. జూరాల నుంచి 3,20,805 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 4,479 క్యూసెక్కుల వరద శ్రీశైలంలోకి చేరుతుందని అధికారులు తెలిపారు.

News September 3, 2024

MBNR: భారీ వర్షాలు.. ఈ సీజన్లోనే 9 మంది మృతి!

image

ఈ సీజన్లోనే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలకు మట్టి మిద్దెలు, గోడలు కూలి మొత్తం తొమ్మిది మంది ప్రాణాలు వదిలారు. NGKL జిల్లాలోనే 6 మృతి చెందారు. WNPT జిల్లాలో ఓ వృద్ధుడు, NRPT జిల్లాలో తల్లీకుమార్తెలు మరణించారు. గత నాలుగేళ్లుగా పాలమూరులో మట్టి మిద్దెలు కూలి మొత్తం 20 మంది మృతి చెందారు. మట్టి మిద్దెలో నివసిస్తున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నారు.

News September 3, 2024

MBNR: వరద బీభత్సం..

image

మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తీవ్ర నష్టం వాటిల్లింది. పత్తి, జొన్న, మొక్కజొన్న పంటలు నీట మునిగి తీవ్రంగా దెబ్బతిన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో 622, నారాయణపేట జిల్లాలో 3,020, నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,202, గద్వాల జిల్లాలో 170 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. వనపర్తి జిల్లాలో 230 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో పత్తి, మొక్కజొన్నతో పాటు ఇతర పంటలు నీట మునిగినట్లు గుర్తించారు.

News September 2, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు!!

image

✒Deputy CM పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
✒అత్యవసర పరిస్థితిలో ఫోన్ చేయండి:SPలు
✒భారీ వర్షాలు.. పిల్లల పట్ల జాగ్రత్త:కలెక్టర్లు
✒ఘనంగా వైయస్సార్ వర్ధంతి వేడుకలు
✒పలుచోట్ల పొంగిపోతున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం
✒కోయిల్‌సాగర్ ప్రాజెక్టు వద్ద భారీ బందోబస్తు
✒భారీ వర్షం..కూలిన 50కి పైగా మట్టిమిద్దెలు
✒మరో రెండు రోజులు భారీ వర్షాలు.. బయటికి రాకండి: కలెక్టర్లు

News September 2, 2024

ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాల వల్ల పంటలకు నష్టం

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వాగులు, చెరువుల ద్వారా చేరిన నీరు పంట పొలాలను ముంచెత్తింది. నీళ్లు ఎక్కువ రోజులు ఉంటే.. వరి పంటకు తెగుళ్లు సోకే అవకాశం ఉంటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలో పెసర పంట దెబ్బతింది.

News September 2, 2024

MBNR: భారీ వర్షం.. కూలిన 50కి పైగా మట్టిమిద్దెలు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షానికి తడిసి 50 వరకు మట్టి మిద్దెలు కూలిపోవడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం అయ్యవారిపల్లిలో వర్షానికి రెండు ఇళ్లు కూలిపోయాయి. NGKLలోని జామా మజీదు వెనక మట్టి మిద్దె కూలింది. GDWLలోని అయిజ, వడ్డేపల్లి మండలం కొంకల, జూలకల్లు, ఇటిక్యాల మండలం షాబాద్లో మట్టిమిద్దె పడిపోయాయి. MBNR అర్బన్, గ్రామీణం మండలాల్లో పలుచోట్ల మట్టి మిద్దెలు కూలిపోయాయి.