India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

విద్యార్థులకు మెనూ ప్రకారం రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని తిరుమలగిరిలో ఉన్న గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను ఆదివారం రాత్రి ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు వడ్డించే భోజనంలో మెనూ పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వసతి గృహంలో సమస్యలు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మహబూబ్నగర్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో వర్షం కురిసింది. అత్యధికంగా భూత్పూర్ మండలం కొత్త మొల్గర 55.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. హన్వాడ 37.0, మిడ్జిల్ మండలం కొత్తపల్లి 22.5, జడ్చర్ల 21.0, మహమ్మదాబాద్ 16.0, మహబూబ్ నగర్ 13.5, దేవరకద్ర 12.0, చిన్న చింతకుంట 9.5, కోయిలకొండ మండలం పారుపల్లి 8.5, అడ్డాకుల 4.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఉమెన్స్ హాస్టల్ జనరల్ వార్డెన్గా డాక్టర్ కే. నాగసుధ, ఉమెన్ మెస్ వార్డెన్గా ఆర్. లక్ష్మిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉపకులపతి జి.ఎన్. శ్రీనివాస్ వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పూస రమేష్ బాబు, పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. మధుసూదన్ రెడ్డి, చీఫ్ వార్డెన్ డాక్టర్ ఎం. కృష్ణయ్య పాల్గొన్నారు.

పాలమూరు యూనివర్సిటీలో లాబోరేటరీస్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 14న క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ప్లేస్మెంట్ అధికారి డా.అర్జున్ కుమార్ Way2Newsతో తెలిపారు. ట్రైనీ సూపర్వైజర్/గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/హెల్పర్, వివిధ పోస్టులకు SSC,INTER,ITI,బి.టెక్,B.Sc/M.Sc పూర్తి చేసిన విద్యార్థులు అర్హులన్నారు. ఫొటోలు, అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు, రెస్యూమ్తో హాజరుకావాలన్నారు. SHARE IT.

తెలంగాణ రాబిన్హుడ్గా పేరు పొందిన పండుగ సాయన్న1840-1900లో పేదల పక్షాన పోరాటం చేశారు. MBNR జిల్లా నవాబ్పేట మండలం మెరుగోనిపల్లెకు చెందినవారు. ఆనాటి నిజాం అధికారులను, దేశ్ముఖ్లను ధైర్యంగా ప్రశ్నించారు. కొత్త బహుజన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారు. ఈ కారణంగా 1890 డిసెంబర్ 10న నిజాం సర్కార్ ఆయన తల నరికి జిల్లా కేంద్రంలోని తిర్మలదేవుని గుట్టపై విసిరేశారు. నేడు పండుగ సాయన్న జయంతి. SHARE IT

మహబూబ్ నగర్ జిల్లాలో గడచిన 24 గంటల్లో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా జడ్చర్లలో 114.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయింది. రాజాపూర్ 98.0, అడ్డాకుల 80.8, బాలానగర్ మండలం ఉడిత్యాల 79.8, నవాబుపేట 79.0, భూత్పూర్ 59.8, బాలానగర్, చిన్న చింతకుంట (M) వడ్డేమాన్ 49.0, కౌకుంట్ల 43.3, మహమ్మదాబాద్ 40.0, కోయిలకొండ మండలం పారుపల్లి 18.5, హన్వాడ 10.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ జానకి గురువారం రాత్రి పోలీసు అధికారులతో అత్యవసర కాన్ఫరెన్స్ నిర్వహించారు. నేడు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు వాగులు వంకల వైపు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేయాలన్నారు. పాత ఇండ్లలో నివసించే వారు ఆ ఇండ్లలో ఉండకుండా పునరావాస కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఉమ్మడి జిల్లాలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీస్ సిబ్బంది అవగాహన కల్పించిన పలువురు మోసపోతూనే ఉన్నారు. అనుమానాస్పద లింకులు, వీడియో కాల్స్, డబ్బు వస్తుందన్న ఆశతో క్లిక్ చేయడం వల్ల వచ్చే మోసాలపై హెచ్చరికలు చేస్తున్నారు. మోసపోయినట్టయితే వెంటనే 1930కు కాల్ చెయ్యాలని, www.cybercrime.gov.in పోర్టల్ ద్వారా ఫిర్యాదు చెయ్యాలన్నారు. సైబర్ కేటుగాళ్లతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

జడ్చర్ల మండలం నెక్కొండలో బుధవారం ప్రమాదవశాత్తు కాలు జారి వాగులో పడి ఓ మహిళా గల్లంతైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాలు ప్రకారం.. నెక్కొండ గ్రామానికి చెందిన జ్యోతి (34) వ్యవసాయ పనులకు వెళ్తుండగా కాలు జారి గల్లంతయింది. ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకుని జ్యోతి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలికి నలుగురు కుమారులు, భర్త ఉన్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

వాగులో జారిపడి మహిళా గల్లంతైన ఘటన జడ్చర్ల మండలంలో బుధవారం జరిగింది. గ్రామస్థుల వివరాల ప్రకారం.. నెక్కొండకు చెందిన జ్యోతి (35) పొలం పనులకు వెళ్తుండగా వాగులో జారి పడి గల్లంతు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వాగులో గాలింపు చర్యలు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.