Mahbubnagar

News March 10, 2025

MBNRలో 700 ఏళ్ల నాటి మర్రిచెట్టు!

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 700 ఏళ్లనాటి మర్రి చెట్టు అందరినీ ఆకట్టుకుంటుంది. దేశంలోనే అతిపెద్ద పరిమాణం గల మూడో చెట్టుగా ఇది పేరుగాంచింది. దూరం నుంచి చూస్తే కొండలాగా కనిపించే ఇది దగ్గరికెళ్ళి చూస్తే వెయ్యిమందికి నీడనిచ్చే పెద్ద గొడుగులాగా మారిపోతుంది. మూడెకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న దీని పక్కనే మ్యూజియం, జింకలపార్కు ఉన్నాయి. మహబూబ్ నగర్ పట్టణానికి 4KM దూరంలోనే ఉంది. సందర్శించారా? కామెంట్ చేయండి.

News March 9, 2025

BREAKING: SLBC టన్నెల్‌లో మృతదేహం గుర్తింపు

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించారు. టీబీఎం మెషీన్‌లో మృతదేహం ఇరుక్కున్నట్టు నిర్ధారించారు. మృతుడు టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్‌సింగ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసేందుకు సహాయక బృందాలు డ్రిల్లింగ్ చేస్తున్నాయి. అయితే TBM ముందు భాగంలో దుర్వాసన వస్తున్నందున్నారు. ఆచూకీ కోసం 15 రోజులుగా శ్రమిస్తున్నారు.

News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News March 9, 2025

SLBC వద్ద భయం.. భయం.!

image

SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం 12 రెస్క్యూ టీంలు శ్రమిస్తున్నాయి. దాదాపుగా 1500 టన్నుల బరువు, 150 మీటర్ల పొడవు ఉన్న టన్నెల్‌ను తవ్వితే మట్టి, రాళ్లు పడే ప్రమాదం ఉందని రెస్క్యూ టీంలు అంచనా వేస్తున్నాయి. కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ పర్యవేక్షణలో రెస్క్యూ టీంలు పనులను చేపట్టాయి. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు మరో 2 రోజులు పట్టే అవకాశం ఉందంటున్నారు.

News March 9, 2025

MBNR: “CMను కలిసిన పాలమూరు VC”

image

వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో మహిళా దినోత్సవ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పాలమూరు విశ్వవిద్యాల ఉపకులపతి ఆచార్య జిఎన్. శ్రీనివాస్ కలిసి విశ్వవిద్యాలయ అభివృద్ధి గురించి చర్చించారు. ఇంజనీరింగ్, లా కళాశాలల ప్రారంభోత్సవం, బోధన, బోధనేతర ఖాళీలు భర్తీ, అదనపు పోస్టుల మంజూరు తదితర అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

News March 9, 2025

MBNR: నిప్పంటుకుని వృద్ధురాలు మృతి

image

ప్రమాదవశాత్తు ఓ వృద్ధురాలి చీరకు నిప్పు అంటుకుని మృతి చెందిన ఘటన చిన్న చింతకుంట మండలం ఉంద్యాల గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రామ్ లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన గొల్ల వెంకటమ్మ (65) తన ఇంటి ముందు చెత్తాచెదారం అంతా ఊడ్చి చెత్తకుప్పకు నిప్పంటిచగా ప్రమాదవశాత్తు ఆ వృద్ధురాలి చీరకు అంటుకోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందింది.

News March 9, 2025

MBNR: ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధురాలు.!

image

ఓ వృద్ధురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్ఐ రామ్‌లాల్ నాయక్ వివరాలు.. గ్రామానికి చెందిన చాకలి బాలకిష్టమ్మ మానసికస్థితి సరిగ్గా లేక ఒంటరిగా ఉంటుంది. దుప్పటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టింది. స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒంటరితనాన్ని భరించలేక ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొందని ఎస్ఐ తెలిపారు.

News March 9, 2025

గిగా కంపెనీతో పాలమూరు రూపురేఖలు మారతాయి: కేంద్ర మంత్రి

image

అమర్ రాజా కంపెనీ ప్రతిష్ఠాత్మకంగా రూ.3,225 కోట్లతో నిర్మిస్తున్న గిగా ఫ్యాక్టరీతో పాలమూరు రూపురేఖలు మారడం ఖాయమని కేంద్ర రైల్వే శాఖ సమాచార ప్రసార ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అన్నారు. శనివారం దివిటిపల్లి గ్రామంలో కంపెనీ ప్రారంభం అనంతరం మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డిలతో కలిసి నూతనంగా నిర్మిస్తున్న ప్లాంటును పరిశీలించారు.

News March 8, 2025

నేడు పాలమూరుకు కేంద్రమంత్రి రాక

image

కేంద్ర రైల్వే, టెక్నాలజీ ఇన్ఫర్మేషన్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి అశ్విని వైష్ణవ్ నేడు MBNR జిల్లాకు రానున్నారు. స్థానిక ఎంపీ డీకే అరుణతో కలిసి జిల్లాలో పలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 10:30 గంటలకు దివిటిపల్లిలోని అమరరాజు బ్యాటరీ కంపెనీ ఏర్పాటుకు నిర్వహించే భూమి పూజలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొంటారని బీజేపీ శ్రేణులు పేర్కొన్నారు.

News March 8, 2025

MBNR: క్రమబద్ధీకరణతో ప్రజలకు లబ్ధి చేకూర్చండి: ప్రిన్సిపల్ సెక్రటరీ

image

అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరణ చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని ప్రజలకు లబ్ధి కల్పించేలా కృషి చేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,  అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో ఎల్ఆర్ఎస్ పథకంపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలతో పాటు గ్రామపంచాయతీలో ప్రచారం చేపట్టాలన్నారు.

error: Content is protected !!