Mahbubnagar

News September 26, 2024

శ్రీశైలం జలాశయానికి 1,02,286 క్యూసెక్కుల ఇన్ ప్లో

image

శ్రీశైలం జలాశయానికి ఎగువ ఉన్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి బుధవారం 1,02,286 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రస్తుతం 875.0 అడుగుల వద్ద 163.5820 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలవిద్యుత్ కేంద్రంలో 13.723 మి.యూ. కుడిగట్టు కేంద్రంలో 2.107 మి.యూ విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఎడమగట్టు, కుడిగట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తికి 49,234 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News September 26, 2024

జూరాలకు 72 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

image

జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరిగింది. మంగళవారం సాయంత్రానికి 51వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. బుధవారం సాయంత్రానికి 72 వేల క్యూసెక్కులకు పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఏడు క్రస్టు గేట్లను ఎత్తి 50,232 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 37,715 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు.

News September 26, 2024

ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా బుధవారం జడ్చర్లలో ఉదండాపూర్, కొత్తకోటలో కానాయపల్లి గ్రామ శివారులో గల శంకర్ సముద్రం రిజర్వాయర్ పనులను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పరిశీలించారు. అనంతరం భీమా ఫేస్-2 అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News September 26, 2024

ఉమ్మడి పాలమూరు జిల్లా ముఖ్యాంశాలు.!

image

☞ఉమ్మడి జిల్లాలో మంత్రుల పర్యటన స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు
☞జిల్లాలో పలు పెండింగ్ ప్రాజెక్టులు పరిశీలించిన మంత్రులు
☞నాగర్ కర్నూలు జిల్లాలో ఘనంగా పార్మాసిస్ట్ డే వేడుకలు
☞కల్వకుర్తి: ఉదృతంగా ప్రవహిస్తున్న దుందుభి నది
☞వనపర్తి జిల్లా లో కానిస్టేబుల్ మిస్సింగ్
☞పలు జిల్లాలో ఘనంగా దీన్ దయల్ జయంతి
☞పలు మండలలో బాధ్యతలు స్వీకరించిన నూతన MEOలు
☞జోగులాంబ శక్తిపీఠాం దర్శించుకున్న భక్తులు

News September 26, 2024

కోయిల్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తివేత

image

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు MBNR, నారాయణపేట జిల్లాల సరిహద్దుగా ఉన్న కోయిల్ సాగర్ ప్రాజెక్టు జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతుంది. దీంతో అధికారులు బుధవారం కోయిల్ సాగర్ ప్రాజెక్టు నాలుగు గేట్లను ఓపెన్ చేసి వరద నీటిని దిగువకు వదిలినట్లు తెలిపారు. ఎగువన ఉన్న మద్దూరు, దౌల్తాబాద్ మండలాల నుంచి వరద ఉద్ధృతి మరింత పెరిగితే ఇతర గేట్లను ఎత్తే అవకాశం ఉందని సూచించారు. బండర్ పల్లి వాగుకు వరద కొనసాగుతుంది.

News September 25, 2024

MBNR: 10 రూపాయల నాణేల చలామణిలో అయోమయం!

image

ఉమ్మడి జిల్లాలో 10 రూపాయల నాణేల చలామణిలో ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ఈ‌ నాణేలు చెల్లవంటూ.. కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండడంతో వీటిని తీసుకోవడానికి, చెలామణి చేయడానికి జనాలు ఆసక్తి చూపడం లేదు. సరుకుల కొనుగోళ్ల సమయంలో చిల్లర కోసం దుకాణదారులు రూ.10 నోట్లకు బదులు నాణేలను ఇస్తే వాటిని తీసుకునేందుకు చాలామంది నిరాకరిస్తున్నారు. అధికారులు స్పందించి దీనిపై వివరణ ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు.

News September 25, 2024

జోగుళాంబా దేవి బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే ప్రముఖులు వీరే !

image

అక్టోబర్ 3-12వ తేది వరకు అలంపూర్ జోగుళాంబ ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాలకు తెలంగాణ ప్రభుత్వం సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, అడిషనల్ డీజీపి మహేశ్ భగవత్, ఐజీ ఎం.రమేష్, ఎండోమెంట్ కమీషనర్ హనుమంతరావు, ఏపి జితేందర్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ హాజరుకానున్నారు. ఈ మేరకు ఈఓ పురేందర్, ప్రధాన అర్చకులు ఆనంద్ శర్మ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు ఇచ్చారు.

News September 25, 2024

కొడంగల్: ఉదయం నుంచే బ్యాంకు వద్ద రైతుల పడిగాపులు

image

బ్యాంకులలో తీసుకున్న రుణాలు నేటి వరకు మాఫీ అవ్వకపోవడంతో రైతులు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ తిరిగుతున్నారు. రోజు వందల మందికి పైగా బ్యాంకుకు వస్తుండడంతో వారిని అదుపు చేయడం సిబ్బంది కష్టంగా మారింది. రుణమాఫీ కోసం వచ్చే రైతుల రద్దీని నియంత్రించడానికి ప్రతిరోజు 50 మంది రైతులకు టోకెన్‌లు ఇస్తున్నారు. టోకన్లు తీసుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి రైతులు బ్యాంకుల వద్దకు వచ్చి పడిగాపులు కాస్తున్నారు.

News September 25, 2024

రాజాపూర్: అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

image

మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి శివార్లలోని నేషనల్ హైవే 44పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజాపూర్ మండలం చొక్కంపేట గ్రామానికి చెందిన యువ కాంగ్రెస్ నేత వెంకటేశ్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. ముదిరెడ్డిపల్లి నుంచి మహబూబ్ నగర్ వైపు బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. మృతదేహాన్ని బాదేపల్లి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

News September 25, 2024

KLPR: అన్ని కళాశాలల్లో ఇన్‌ఛార్జ్‌ల పాలన

image

KLPR: మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 5 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. కొల్లాపూర్ పట్టణంలో ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్ కళాశాలలు, పానగల్, వీపనగండ్ల, కోడేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో శాశ్వత ప్రాతిపదికన ప్రిన్సిపళ్లు లేకపోవడంతో ఇన్‌ఛార్జ్‌ల పాలనలో నడుస్తున్నాయి. పదోన్నతుల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేయవలసి ఉంది.