India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సైబర్ క్రైమ్ బాధితులు గోల్డెన్అవర్లో పోలీసులకు ఫిర్యాదు చేయాలని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ శనివారం ఒక ప్రకటన ద్వారా సూచించారు. సైబర్ క్రైమ్ అరికట్టేందుకు అప్రమత్తతే ప్రధాన అస్త్రం అని వెల్లడించారు. ఆన్లైన్ మనీ గేమింగ్ బెట్టింగ్ చట్ట విరుద్ధం అని వెల్లడించారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బెట్టింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా ఫ్రాడ్ లాంటి పద్ధతులను నేరగాళ్లు ఉపయోగిస్తున్నారన్నారు.

పాలమూరు యూనివర్సిటీలోని నిరవధిక సమ్మె చేస్తున్న ఒప్పంద అధ్యాపకులను మహబూబ్గర్ ఎంపీ డీకే అరుణ దీక్షా శిబిరానికి చేరుకొని సంఘీభావం తెలిపారు. శనివారం ఎంపీ మాట్లాడుతూ.. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ, సమస్యల సాధనకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,యూనివర్సిటీ ఒప్పంద అధ్యాపకులు పాల్గొన్నారు.

గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. పోలీసుల వివరాలు.. కేటీదొడ్డ మండలం బసాపురం శివారులో భర్తను తన భార్య పద్మమ్మ ప్రియుడుతో కలిసి చంపింది. హత్యకు వివాహేతర సంబంధమే కారణమని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరికి మరో ఇద్దరు సహాయం చేశారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సమీపంలో రు.3.29 కోట్లతో నూతనంగా నిర్మించిన విద్యుత్తు సబ్ స్టేషన్కు ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్ రెడ్డి శనివారం భూమి పూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నూతన విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే మహబూబ్నగర్ పట్టణంలోని కొన్ని ప్రాంతాలు, వివిధ గ్రామాల్లో కరెంటు సమస్య తీరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

జడ్చర్ల మున్సిపాలిటీ కావేరమ్మ పేట, రాఘవేంద్ర కాలనీ, జడ్చర్ల మండలం గంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆ పార్టీ జెండాను ఈరోజు ఆవిష్కరించారు. గంగాపూర్ గ్రామంలో మహిళలు బోనాలతో ఆయనకు స్వాగతం పలికారు. జడ్చర్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలు వరంగల్ సభకు రావాలని కోరారు.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సుద్దాల హనుమంతు సంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో వేసవి శిక్షణ శిబిరాన్ని మే 3 నుంచి ప్రారంభించనున్నామని నిర్వాహకుడు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనే విద్యార్థులు పదేళ్లు దాటిన వారికి వివిధ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. SI బాలరాజు తెలిపిన వివరాలు.. NRPTజిల్లా కోస్గి పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను వికారాబాద్ జిల్లా దోమ మండలం మల్లేపల్లి వాసి రమేశ్ ప్రేమిస్తున్నానని చెప్పి మార్చి 5న తనవెంట తీసుకెళ్లాడు. 10రోజుల తర్వాత PSకు వచ్చి తాము పెళ్లి చేసుకుంటామని చెప్పాడు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రమేశ్కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

MBNR, GDWL, NGKL, WNP, NRPT జిల్లాల్లో ఇళ్ల ముందు నిలిపిన పలు బైక్లను రాత్రిళ్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గద్వాల ఎస్ఐ కళ్యాణ్ తెలిపిన వివరాలు.. గద్వాల వాసి వంశీ, మరో ఏడుగురు కలిసి బైక్లను చోరీ చేసేవారు. గతంలో ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి 35బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వంశీని శుక్రవారం ధరూర్మెట్లో అరెస్ట్ చేసి మరో 5 బైక్లను సీజ్ చేశారు.

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 5 బ్యాక్ లాగ్ పరీక్షలకు సంబంధించి టైం టేబుల్ విడుదలైన విషయం తెలిసిందే. ఈనెల 28 నుంచి పరీక్షలు ప్రారంభం కానుండగా మరో 3 రోజులే మిగిలి ఉంది. వివరాలకు www.palamuruuniversity.com వెబ్సైట్ చూడండి. ఇక ఫీజు రియంబర్స్మెంట్ కోసం PU పరిధిలోని MBNR, GDWL, NGKL, WNP, NRPTలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చాయి. SHARE IT

యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా ఉండవెల్లి PS పరిధిలో జరిగింది. SI మహేశ్ తెలిపిన వివరాలు.. బొంకూరు గ్రామ వాసి K.మధు(34) బయటకు వెళ్లి వస్తానని భార్యకు చెప్పి వెళ్లాడు. అనంతరం తనకు తెలిసిన వ్యక్తి రాముడికి ఫోన్ చేసి ‘మా తాతల ఆస్తి నాకు సరిగా పంచలేదు.. అందుకే పొలం వద్ద పురుగు మందు తాగి చనిపోతున్నా’ అని చెప్పాడు. స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడు. కేసు నమోదైంది.
Sorry, no posts matched your criteria.