Mahbubnagar

News August 20, 2025

MBNR: PG పరీక్షలు.. 1792 మంది హాజరు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో పీజీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. బుధవారం యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జిఎన్ శ్రీనివాస్, పరీక్షల నియంత్రణ అధికారిణి డా.ప్రవీణ, పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ డా.డి.మధుసూదన్ రెడ్డి, అబ్జర్వర్ డా.నూర్జహాన్ పరివేక్షించారు. మొత్తం 1911 మంది విద్యార్థులకు గాను.. 1,792 మంది హాజరయ్యారని, 64 మంది గైహాజరయ్యారని ఆమె తెలిపారు.

News August 20, 2025

MBNR: వినాయక చవితి.. DSP కీలక సూచనలు

image

గణేష్ విగ్రహా మండప నిర్వాహకులకు డీఎస్పీ వెంకటేశ్వర్లు కీలక సూచనలు చేశారు.
✒DJలు వినియోగించరాదు.
✒మండపాల వద్ద CCTV కెమెరాలు అమర్చాలి.
✒భక్తుల కోసం క్యూ లైన్, బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలి.
✒రోడ్లపై, కాలిబాటలపై విగ్రహాలను పెట్టరాదు.
✒కేవలం భక్తి గీతాలే వాడాలి.
✒రా.10:00-ఉ.6:00 వరకు స్పీకర్లు నిషేధం.
✒మండపంలో ఎమర్జెన్సీ ల్యాంప్ తప్పనిసరి.
✒వాలంటీర్లందరికి ఫొటో ఐడీ కార్డులు ఉండాలన్నారు.

News August 20, 2025

MBNR: భరోసా సెంటర్లదే కీలకపాత్ర: ఇందిర

image

మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో భరోసా కన్వర్జెన్సీ సమావేశం నిర్వహించారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ అధికారిణి ఇందిర ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భరోసా సెంటర్లు మహిళలు, చిన్నారులు, వృద్ధులు వంటి బలహీన వర్గాల రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా, DM&HO కృష్ణ, అదనపు ఎస్పీ బి.ఎన్.రత్నం పాల్గొన్నారు.

News August 20, 2025

మహమ్మదాబాద్‌లో అత్యధిక వర్షపాతం నమోదు!

image

మహబూబ్ నగర్ జిల్లాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా మహమ్మదాబాద్‌లో 34.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. మూసాపేట మండలం జానంపేట, జడ్చర్ల 30.0, నవాబుపేట 26.5, మహబూబ్ నగర్ అర్బన్ 24.3, హన్వాడ 23.8, భూత్పూర్, దేవరకద్ర 21.3, మిడ్జిల్ 13.5, గండీడ్ మండలం సల్కర్ పేట, చిన్న చింతకుంట 13.3, కౌకుంట్ల 11.3, బాలానగర్‌లో 5.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

News August 19, 2025

MBNR: ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు.. మట్టి వినాయకులే ముద్దు

image

నీటిని కలుషితం చేసి జలచరాలకు హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్(POP) విగ్రహాలకు బదులుగా.. మట్టి వినాయకులే ప్రతిష్ఠించేందుకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలువురు సిద్ధమయ్యారు. ఈనెల 27 నుంచి వినాయక చవితి ప్రారంభం కానుంది. వినాయక మండపాలను సిద్ధం చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. రోజురోజుకు పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణపతి విగ్రహాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. మరి మీరేమంటారు. కామెంట్?

News August 19, 2025

MBNR: 340 ఉద్యోగాలు.. సద్వినియోగం చేసుకోండి

image

MBNRలోని ITI(BOYS) కాలేజ్‌లో ఆర్గనైజ్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, ట్రైనింగ్ విత్ నిర్మాణ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రి ప్రియ Way2Newsతో తెలిపారు. 8 ప్రైవేట్ సంస్థలలో 340 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయన్నారు. SSC, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI ఉత్తీర్ణులై ఉండాలని, వయస్సు 18-30లోపు ఉండాలని, ఆధార్ సర్టిఫికెట్లతో హాజరు కావాలన్నారు.

News August 19, 2025

పాలమూరు: Sep నుంచి రేషన్ పంపిణీ

image

ఉమ్మడి MBNR జిల్లాలో కొత్త, పాత రేషన్ కార్డు లబ్ధిదారులకు సెప్టెంబర్ 1 నుంచి ప్రజా పంపిణీ కేంద్రాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌరసరఫరాల శాఖ సన్నహాలు చేస్తుంది. సెప్టెంబర్ నెల కోటా బియ్యాన్ని రాష్ట్రస్థాయి గోదాముల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్లకు తరలించే ప్రక్రియను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. సన్న బియ్యం తీసుకెళ్లే లబ్దిదారులకు సంచులు ఉచితంగా పంపిణీ చేయనుంది.

News August 19, 2025

పాలమూరు COOL..చల్లబడ్డ వాతావరణం

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాతావరణం చల్లబడింది. గ్రామాలతో పాటు పట్టణాల్లో చలి తీవ్రత పెరుగుతుండడంతో గజగజ వణికిపోతున్నారు. రెండు రోజులుగా చలి తీవ్రత కారణంగా జనాలు ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. మీ మండలంలో వర్షం పడుతుందా? కామెంట్ చేయండి?

News August 18, 2025

MBNR: 24 గంటలు నీటి సరఫరా బంద్

image

మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్ విస్తరణ, వాల్వ్ రిపేర్ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు మొత్తం 24 గంటలు నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు మహబూబ్‌నగర్ మిషన్ భగీరథ గ్రిడ్ డివిజన్ అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. MBNR, NRPT జిల్లాలోని 258 గ్రామాలకు, నారాయణపేట, మక్తల్, దేవరకద్ర పురపాలకలకు పూర్తిగా నీటి సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు.

News August 18, 2025

MBNR: PG పరీక్షలు.. 749 మంది హాజరు

image

పాలమూరు విశ్వవిద్యాలయంలో ఎంఏ, ఎమ్మెస్సీ, MSW, ఎంబీఏ, ఎంసీఏ, M.Com& ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్‌లాక్ 4వ సెమిస్టర్ పరీక్షలు యూనివర్సిటీ పీజీ కాలేజీలో ప్రారంభమయ్యాయి. పీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. పీజీ పరీక్షలకు మొత్తం 767 మంది విద్యార్థులకు గాను.. 749 విద్యార్థులు హాజరయ్యారని, 18 మంది విద్యార్థులు గైహాజరు అయ్యారన్నారు.