India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మహబూబ్ నగర్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆనందరావు బుధవారం బార్ అసోసియేషన్ అధ్యక్షులు బాధ్యతలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. తనకు తన సహచర న్యాయవాదులు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని వెల్లడించారు. న్యాయవాదుల ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు అనంతరెడ్డి పాల్గొన్నారు.

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహబూబ్నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత బుధవారం కార్పొరేషన్ పరిధిలోని 3వ డివిజన్ అప్పన్నపల్లి ఆంజనేయస్వామి దేవాలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. మేయర్ మాట్లాడుతూ.. జిల్లా ప్రజలను ఆంజనేయ స్వామి చల్లగా చూడాలని ఆయన ఆశీర్వచనం ప్రజలపై ఉండాలని కాంక్షించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు నెల రోజుల పాటు 30, 30(ఎ) పోలీసు యాక్ట్–1861 అమలులో ఉంటుందని ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా, ప్రజాధనానికి నష్టం కలిగించే ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేపట్టకూడదని హెచ్చరించారు. అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు.

రాజాపూర్ మండలం రాజాపూర్ టౌన్ సెంటర్ సమీపంలో జాతీయ రహదారి–44పై కొత్తగా నిర్మించనున్న ఫ్లైఓవర్ పనులకు సంబంధించి రోడ్డు డైవర్షన్ల ఏర్పాటుపై జిల్లా ఎస్పీ డి.జానకి కాంట్రాక్టర్ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణ పనుల కారణంగా రహదారిపై వాహన రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో డైవర్షన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

మహబూబ్ నగర్ జిల్లాలో వేసవి ఎండల తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో గండీడ్ మండలం సల్కర్పేటలో అత్యధికంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 37.2, దేవరకద్ర 35.6, చిన్న చింతకుంట మండలం వడ్డేమాన్ 35.3, మహమ్మదాబాద్ 35.2, నవాబుపేట 35.0, మహబూబ్ నగర్ అర్బన్, కౌకుంట్ల 34.9, అడ్డాకుల, నవాబుపేట మండలం కొల్లూరు 34.8, భూత్పూర్ 34.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘ఇప్ప’ (మహువా) చెట్ల పెంపకాన్ని ప్రోత్సహించాలన్న ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చొరవకు ఎమ్మెల్యేలు 52 MLAలు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కరువును ఇప్ప చెట్లు తట్టుకోగలవని, మొక్కల పెంపకం విస్తరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. గ్రామీణ, గిరిజన తండాలలో ప్రజల ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గిరిజనులకు జీవనోపాధి దొరుకుతుందన్నారు.

జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన కానిస్టేబుల్ కటిక రాజశేఖర్ జాతీయ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్లో ప్రతిభ చాటారు. మహారాష్ట్రలోని నాగ్పూర్లో జరిగిన 69వ జాతీయ పోలీస్ డ్యూటీ మీట్లో, ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ విభాగంలో ఆయన సిల్వర్ మెడల్ (రన్నరఫ్) సాధించారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ ఆర్మ్డ్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ను ఉన్నతాధికారులు అభినందించారు.

మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గ్రామర్ హైస్కూల్లో బుధవారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం కానుంది. ఈనెల 9 వరకు ప్రధాన సబ్జెక్టులు, 10 నుంచి 17 వరకు సైన్స్, 18 నుంచి 23 వరకు సాంఘిక శాస్త్రం పేపర్లు దిద్దనున్నారు. తొలి విడతలో 2.10 లక్షల పత్రాల పరిశీలనకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Sorry, no posts matched your criteria.