Medak

News August 24, 2024

సింగూరు ప్రాజెక్టుకు స్వల్ప వరద

image

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సంగారెడ్డి జిల్లా పుల్కల్‌ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్ప వరద వస్తోంది. శుక్రవారం ఇన్‌ఫ్లో 1907 క్యూసెక్కులు, అవుట్‌ ఫ్లో 391 క్యూసెక్కులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు. తాలేల్మ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు 31 క్యూసెక్కులు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌కు 80 క్యూసెక్కులు, మిషన్‌ భగీరథ కోసం 70 క్యూసెక్కులు, వృథాగా 210 క్యూసెక్కుల నీరు వెళ్తున్నట్లు తెలిపారు.

News August 24, 2024

MDK: వీధి కుక్కలు భయపెడుతున్నాయ్..!

image

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. పట్టణ ప్రాంతాలతో పాటు పల్లెల్లోనూ భయపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది కుక్కల దాడులకు గురయ్యారని, పిల్లలను బయటకు పంపాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో కుక్కల బెడద ఉందా కామెంట్ చేయండి.  

News August 24, 2024

కవితతో హరీశ్ రావు ములాఖత్

image

తిహార్‌ జైల్‌లో MLC కవితతో MLA హరీశ్‌రావు భేటీ అయ్యారు. శుక్రవారం ములాఖత్‌‌లో భాగంగా జైల్‌లో కవితను కలిశారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తామంతా అండగా ఉంటామని ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కవితను ED అరెస్ట్‌ చేయగా, ఆ తర్వాత CBI అదుపులోకి తీసుకుంది. ఈ కేసులో అండర్‌ ట్రయల్‌ ఖైదీగా ఆమె జైలులో ఉన్నారు.

News August 23, 2024

కంది: ఐఐటీహెచ్ విన్నూత్న డ్రోన్ తయారీ

image

సంగారెడ్డి జిల్లా కంది IITHలోని ‘టీహాన్‌’ (టెక్నాలజీ ఇన్నోవేషన్‌ హబ్‌ ఇన్‌ అటానమస్‌ నావిగేషన్‌) విభాగం టెక్నాలజీ ఈ-ఫ్లాపింగ్‌ వింగ్స్‌ డ్రోన్లను ప్రయోగాత్మకంగా గాల్లోకి ఎగురవేసి పరీక్షించింది. ఇవి కొండలు, గుట్టలపై, అటవీ ప్రాంతాల్లో జీపీఎస్‌తో నిర్దేశిత లక్ష్యానికి చేరగలదు. వీటి మార్గంలో ఏవైనా అడ్డం వస్తే సెన్సార్లు పసిగడతాయి. ఆటోమేటిక్‌గా ఆ డ్రోన్‌ తిరిగి మళ్లీ ఆపరేటర్‌ దగ్గరకు వచ్చిచేరుతోంది.

News August 23, 2024

మెదక్: వేర్వేరు కారణాలతో ఒకే రోజు నలుగురి సూసైడ్

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో వేర్వేరు కారణాలతో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. మద్యానికి బానిసై తాండూరు పరిధికి చెందిన రాజు(40).. అనారోగ్య సమస్యలతో హుస్నాబాద్‌కు చెందిన రాజిరెడ్డి(65) ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే క్రమంలో భార్య కాపురానికి రావడం లేదని మిరిదొడ్డి మండలానికి చెందిన చంద్రం(30).. మెదక్ జిల్లా శివ్వంపేటకు చెందిన జగదీశ్‌రెడ్డి(24) మిత్రులకు వీడియో కాల్ చేసి ఆత్మహత్య చేసుకున్నాడు.

News August 23, 2024

టేక్మాల్: తల్లి మృతిని తట్టుకోలేక కూతురి సూసైడ్

image

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు ఆత్మహత్య చేసుకున్న ఘటన టేక్మాల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగింది. పాపన్నపేట ASI సంగన్న వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్నకూతురు(14) 8వ తరగది చదుతోంది. కాగా, 9నెలల క్రితం తల్లి అనారోగ్యంతో మృతి చెందగా అప్పటి నుంచి తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడుతుండేది. బుధవారం మనస్తాపానికి గురై ఉరేసుకుంది. గురువారం తండ్రి ఫిర్యాదులో కేసు నమోదైంది.

News August 23, 2024

బండిని విమర్శించిన హరీశ్.. నేడు యాదగిరికి ఎందుకు వెళ్లాడు: ఎంపీ 

image

మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ యాదగిరిగుట్టకు పోదామని హరీశ్ రావుకు సవాల్ విసిరితే వంకరగా మాట్లాడిన ఆయన నేడు యాదాద్రికి ఎందుకు వెళ్లాడని మెదక్ MP రఘునందన్ రావు ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హరీశ్ రావు తీరును ఎండగట్టారు. అధికారం కోల్పోయి, పదవి ఊడిపోవడంతో ఇప్పుడు ఆయనకు దేవుళ్లు గుర్తొస్తున్నారా అని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు.

News August 23, 2024

మెదక్: గృహలక్ష్మికి మరో అవకాశం

image

ఉమ్మడి మెదక్ జిల్లాలో మండల గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందని అధికారులు తెలిపారు. కరెంట్ బిల్లు, ప్రజాపాలన దరఖాస్తు రసీదు, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులతో మండల పరిషత్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 

News August 23, 2024

సంగారెడ్డి: ‘సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలి’

image

సైబర్ నేరాలపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్పీ రూపేష్ పోలీసు అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి గురువారం పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాలకు గురైనప్పుడు డబ్బు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారానే సైబర్ నేరాలకు గురికాకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. అదనపు ఎస్పీ సంజీవరావు పాల్గొన్నారు.

News August 22, 2024

కల్యాణ లక్ష్మి పథకానికి నిధులు విడుదల: మంత్రి పొన్నం

image

బీసీ, ఈబీసీ కళ్యాణలక్ష్మి పథకానికి TG ప్రభుత్వం తాజాగా రూ.1225.43 కోట్లు విడుదల చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. 2024-25 బడ్జెట్‌లో కళ్యాణలక్ష్మి పథకానికి రూ.2175 కోట్లు కేటాయించింది. మొదటిదశలో రూ.1225.43 కోట్లు విడుదల చేసింది. పెండింగ్ దరఖాస్తులతో పాటు తాజాగా అప్లై చేసుకున్న వారికి నిధులు విడుదల చేసినందుకుగాను సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.