Medak

News March 27, 2026

ఇంధన కొరతపై వదంతులు నమ్మొద్దు: కలెక్టర్

image

గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతపై వదంతులు నమ్మవద్దని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. జిల్లాలో సరఫరా సమృద్ధిగా ఉందని, బుకింగ్ చేసిన వారికి 100% డెలివరీ జరుగుతోందన్నారు. అవసరానికి మించి నిల్వలు వద్దని సూచించారు. అక్రమ వినియోగంపై తనిఖీలు నిర్వహించి 134 సిలిండర్లు సీజ్ చేసి 23 మందిపై కేసులు నమోదు చేశారు. అధికారిక సమాచారాన్నే నమ్మాలని, సమస్యల కోసం 9391942254 సంప్రదించాలని సూచించారు.

News March 27, 2026

మెదక్: లైంగిక దాడి.. 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

image

తూప్రాన్ మండలంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తూ మెదక్ న్యాయమూర్తి శుభావల్లి తీర్పు ఇచ్చినట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. తూప్రాన్ మండలం జెండాపల్లి గ్రామానికి చెందిన సోమగారి భాస్కర్ (27) బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు వివరించారు.

News March 26, 2026

మెదక్: హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరి: ఎస్పీ

image

రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడం అత్యంత కీలకమని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. మెదక్ టౌన్‌లోని బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో ‘Arrive Alive’ మూడో విడత కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, యువతకు రోడ్డు భద్రతపై సూచనలు అందించారు. వాహనదారులు హెల్మెట్, సీటుబెల్టు ఉపయోగించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, అధిక వేగం, సెల్‌ఫోన్ ఉపయోగం గురించి వివరించారు.

News March 26, 2026

మెదక్: అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు: కలెక్టర్

image

జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ ప్రతిమా సింగ్ హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి శాండ్ కమిటీ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆర్డీవోలు, తహశీల్దార్లు, మైనింగ్, ఇరిగేషన్, పంచాయతీ హౌసింగ్ అధికారులతో కలిసి పాల్గొని మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి ఇసుక సరఫరా మన ఇసుక వాహనం ద్వారా ఆన్‌లైన్ విధానంలోనే నిర్వహించాలని తెలిపారు.

News March 26, 2026

మెదక్: ఆరోగ్యశ్రీ కింద 600 కోట్లకుపైగా బకాయిలు: మంత్రి

image

ప్రజా ప్రభుత్వం ఏర్పడే నాటికి ఆరోగ్యశ్రీ కింద రూ.600 కోట్లకు పైగా, ఈహెచ్‌ఎస్ కింద రూ.130 కోట్ల బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. అసెంబ్లీ క్వశ్చన్ హవర్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు 9.45 లక్షల మందికి ఉచిత వైద్యం అందించామని చెప్పారు. నెలకు సగటున రూ.89 కోట్లు చెల్లిస్తున్నామని, ఇప్పటివరకు రూ.2400 కోట్లకు పైగా విడుదల చేశామని తెలిపారు.

News March 26, 2026

MDK: డబ్బాలలో పెట్రోల్, డీజిల్ నిల్వ నిషేధం: ఎస్పీ

image

డబ్బాలు లేదా ప్లాస్టిక్ కంటైనర్లలో పెట్రోల్, డీజిల్ నిల్వ చేయడం పూర్తిగా నిషేధమని ఎస్పీ డీవీ. శ్రీనివాసరావు తెలిపారు. ఇలాంటి చర్యల వల్ల అగ్ని ప్రమాదాలు, పేలుళ్లు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇంధనాన్ని ఇళ్లలో నిల్వ చేయవద్దని సూచించారు. పెట్రోల్ బంక్ డీలర్లు నిషేధ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

News March 26, 2026

కౌడిపల్లి: ఫిట్స్‌తో పొలంలో రైతు మృతి

image

కౌడిపల్లి మండలం బుజరంపేట(పిర్యా) తండాలో విషాదం నెలకొంది. పొలంలో పనులు చేసుకుంటుండగా అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో రైతు సమ్యా నాయక్ మరణించినట్లు స్థానికులు తెలిపారు. బుధవారం సాయంత్రం ఫిట్స్ రావడంతో ఆయన అదుపు తప్పి పొలంలోని బురదలో పడిపోయారు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో ముఖం బురదలో కూరుకుపోయి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రైతు మృతితో తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News March 25, 2026

గ్రామీణులకు చేరువలోనే నాణ్యమైన వైద్యం: రాజనర్సింహ

image

TVVPని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చడం ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ.. ఈ మార్పుతో ప్రజలకు సమీపంలోనే నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు, ప్రభుత్వ హోదా వంటి ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. జిల్లా ఆస్పత్రుల అభివృద్ధితో హైదరాబాద్‌పై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని చెప్పారు.

News March 25, 2026

మెదక్: కోర్టు పార్కింగ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

image

మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో వాహనాల(2/3/4 wheelers) పార్కింగ్ నిర్వహణ కోసం సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ టెండర్ కాలపరిమితి ఏడాది పాటు (మే 1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2027 వరకు) ఉంటుంది. సీల్డ్ టెండర్లు తెరిచిన అనంతరం బహిరంగ వేలం ద్వారా కాంట్రాక్ట్ కేటాయిస్తారు.

News March 25, 2026

మెదక్: కోర్టు పార్కింగ్ నిర్వహణకు టెండర్ల ఆహ్వానం

image

మెదక్ జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో వాహనాల(2/3/4 wheelers) పార్కింగ్ నిర్వహణ కోసం సీల్డ్ టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తెలిపారు. ఆసక్తి గల వారు ఏప్రిల్ 6 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ టెండర్ కాలపరిమితి ఏడాది పాటు (మే 1, 2026 నుంచి ఏప్రిల్ 30, 2027 వరకు) ఉంటుంది. సీల్డ్ టెండర్లు తెరిచిన అనంతరం బహిరంగ వేలం ద్వారా కాంట్రాక్ట్ కేటాయిస్తారు.