India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ధ్రువీకరణ చట్టం-2025ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ కలెక్టరేట్ ముందు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య పిలుపు మేరకు ఈ నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్ ద్వారా ప్రధాని మోడీకి వినతిపత్రం పంపారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు జగదీశ్ చంద్ర, సత్యనారాయణ, మోహన్ రాజ్ తదితరులు పాల్గొని, పెన్షనర్ల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.

జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ నగేష్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో మండల ప్రణాళిక అధికారులు, సాంకేతిక సహాయకులకు జనగణన ప్రక్రియ, మొబైల్ యాప్ నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వివరాల సేకరణలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఈ కార్యక్రమం ఉంటుందని, ఏప్రిల్లో సన్నాహక పనులు చేపడతామన్నారు.

వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు సమ్మర్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. 917 హ్యాబిటేషన్లలో 1.76 లక్షల కుటుంబాలకు నిరంతర నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 1485 ట్యాంకుల శుభ్రత, బోర్లు, పైపుల మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా పర్యవేక్షణతో పాటు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా నీరు అందించాలని తెలిపారు.

మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలో విద్యుత్ షాక్కు గురై రామావత్ మోత్య(55) మరణించారు. షాబాద్ తండాకు చెందిన ఆయన.. తన వ్యవసాయ క్షేత్రంలోని బోరు స్టార్టర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

మెదక్ పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను నిష్పక్షపాతంగా, వేగంగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా రాంగ్రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి పెట్రోలింగ్ పెంచాలని సూచించారు. డయల్ 100 కాల్స్కు తక్షణమే స్పందించి బాధితులకు భరోసా కల్పించాలని ఆదేశించారు.

హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రెండు బహుమతులు సాధించినట్లు ఇన్చార్జి ప్రిన్సిపల్ సింహారెడ్డి తెలిపారు. ఉపన్యాస పోటీలో పూనం రాజ్ పురోహిత్ తృతీయ బహుమతి సాధించగా, నినాదాల(స్లోగన్స్) పోటీలో అభినయ్ ప్రత్యేక బహుమతి అందుకున్నారు. విజేతలను కళాశాల అధ్యాపక బృందం, తోటి విద్యార్థులు అభినందించారు.

భూభారతి దరఖాస్తుల పరిష్కారంలో తహశీల్దార్లు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. మంగళవారం మెదక్ కలెక్టరేట్లో గూగుల్ మీట్ ద్వారా భూభారతి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ జాబితా తయారీపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల పరిష్కారంలో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మండలాల వారీగా అన్ని దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలన్నారు.

ఈ నెల 28న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరస్పర చర్చల ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం లభిస్తుందన్నారు.

ఈ నెల 28న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. పెండింగ్లో ఉన్న క్రిమినల్ కంపౌండబుల్, సివిల్, కుటుంబ, బ్యాంకు, చెక్ బౌన్స్ కేసులను పరస్పర చర్చల ద్వారా వేగంగా పరిష్కరించుకోవచ్చన్నారు. కోర్టుల చుట్టూ తిరగడం కంటే రాజీ మార్గమే ఉత్తమమని “రాజీయే రాజమార్గం” అని పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో న్యాయం లభిస్తుందన్నారు.
Sorry, no posts matched your criteria.