India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారీ వర్షాల నేపథ్యంలో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సెలవు రోజు అయినా అధికారులు, సిబ్బంది విధుల్లో ఉండాలని సర్క్యులర్ జారీ చేశారు. సింగూరు నుంచి మంజీరా నదికి భారీగా నీరు విడుదల అవుతున్నందున, వరద పరిస్థితి, సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు నివేదికలు అందించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

రేగోడ్ మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి దేవ్కుమార్ శనివారం తనిఖీ చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు ఎప్పటికప్పుడు సరిపడా లభించేలా, నిల్వలు సక్రమంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అధిక ధరలకు ఎరువులు విక్రయించిన పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జావీద్, AEOలు మహేష్, భూలక్ష్మి పాల్గొన్నారు.

మెదక్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా స్థాయిలో స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాపై కలెక్టర్ రాహుల్ రాజ్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయితీలలో ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితాలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 30వత తేదీ వరకు స్వీకరిస్తామన్నారు.

మహారాష్ట్రలోని లాతూర్, కర్ణాటకలోని సాయిగాంలో కురుస్తున్న భారీ వర్షాలతో వరద నీరు సింగూరు ప్రాజెక్టుకు
సుమారు లక్ష క్యూసెక్కులు వస్తున్నందున పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. సింగూర్ నుంచి లక్ష క్యూసెక్కుల నీరు మంజీరాకు విడుదల చేసే అవకాశం ఉన్నందున మంజీరా నది వరద ఉద్ధృతి ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలు ఎవరూ కూడా ఆ ప్రాంతాలకు వెళ్లొద్దని తెలిపారు.

మెదక్ పోలీస్ విభాగానికి చెందిన హోం గార్డ్ నామ కృష్ణ కుమార్తె నితన్య సిరి జాతీయ స్థాయి కరాటే పోటీలలో అద్భుత విజయాలు సాధించి రాష్ట్రానికి, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. ఎస్పీ శ్రీనివాస రావు శనివారం తన ఛాంబర్లో నితన్య సిరిని సర్టిఫికెట్, మెమెంటో, ఛాంపియన్షిప్ ట్రోఫీతో ఘనంగా సత్కరించారు.

భారీ వర్షాలు, వరదల కారణంగా మెదక్ జిల్లాలో అన్ని చెరువులు నిండుకుండలా మారాయి. కావున వినాయక నిమజ్జనాల సమయంలో భక్తులు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం జిల్లాలో చెరువుల పరిస్థితిపై మాట్లాడారు. మెదక్ జిల్లాలో 2,632 చెరువులు భారీ వర్షాలతో పూర్తిగా నిండిపోయాయన్నారు. వినాయక నిమజ్జన సమయంలో పోలీస్, రెవెన్యూ మున్సిపల్, పంచాయితీ అధికారుల సూచనలు పాటించాలన్నారు.

మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మొత్తం 60 పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో 29 చోట్ల కల్వర్టులు, 14 చోట్ల రోడ్లు పాక్షికంగా దెబ్బతినగా.. 17 చోట్ల రోడ్లకు గండ్లు పడ్డాయని పంచాయతీరాజ్ జిల్లా ఇంజినీర్ నర్సింలు తెలిపారు. దెబ్బతిన్న రోడ్ల తాత్కాలిక మరమ్మతులకు రూ.3.99 కోట్లు, శాశ్వత మరమ్మతులకు రూ.17.11 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపామన్నారు. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నారు.

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విఘ్నేశ్వరుడికి ఎస్పీ డీవీ శ్రీనివాస రావు పూజలు నిర్వహించారు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచేలా పోలీసులకు మనో ధైర్యం ఇవ్వాలని వేడుకున్నారు. గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల కారణంగా రక్షణ చర్యలను ప్రత్యక్షంగా పర్యవేక్షించగా.. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చి మొదటిసారిగా పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ చెరువులు, కుంటలు, వాగులు, వంకలు ఇంకా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రవాహాల దగ్గరగా వెళ్లి చూడటం, వాటి వద్ద ఫోటోలు, సెల్ఫీలు తీయడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరమని ఎస్పీ డివి.శ్రీనివాస రావు హెచ్చరించారు. సెల్ఫీ మోజు కారణంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో వరద నష్టం ప్రాంతాలను సందర్శించడానికి సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మెదక్కు వస్తున్నారు. జిల్లా సరిహద్దులో గల పోచారం డ్యామ్, సర్దన గ్రామ పునరావాస కేంద్రాలు, మెదక్ పట్టణంలో పర్యటించనున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం తెలిపారు.
Sorry, no posts matched your criteria.