Medak

News August 22, 2024

చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం

image

మెగాస్టార్ చిరంజీవికి గురువారం హుస్నాబాద్ ఎమ్మెల్యే బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గతంలో చిరంజీవిని కలిసి దిగిన ఫోటోను మంత్రి పొన్నం ప్రభాకర్ షేర్ చేశారు. నటనలో రారాజు చిరంజీవి అని పేర్కొన్నారు. ఆయన జీవితం ఎంతోమందికి ఆదర్శమని కొనియాడారు.

News August 22, 2024

MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. సెప్టెంబర్‌ 21న ఓటర్ల తుది జాబితా

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్‌ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా షెడ్యూల్‌ ప్రకారం.. సెప్టెంబర్‌ 6న ఓటర్ల జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు.

News August 22, 2024

నేడు పాపన్నపేట బంద్‌కు పిలుపు

image

బంగ్లాదేశ్‌లో హిందువుల ఊచకోతకు నిరసనగా గురువారం మెదక్ జిల్లా పాపన్నపేట పట్టణం బంద్ పాటించనున్నట్లు హిందూ ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ హిందువులపై, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా బంద్‌‌కు పిలుపునిచ్చారు. వ్యాపార, విద్యాసంస్థలు, అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.

News August 22, 2024

సిద్దిపేట: బీటీ రోడ్డు మంజూరు చేయాలని మంత్రికి వినతి

image

అక్కన్నపేట మండలం మలచెరువు తండా, దుబ్బ తండా, తుక్కతండా వరకు BT రోడ్డు మంజూరు చేయాలని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్‌కు గిరిజన నాయకుడు రవీందర్ నాయక్ వినతిపత్రం ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అధికారులను పిలిపించి సంబంధిత తండాలకు రోడ్లు వేయడానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సత్వరమే స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేసిన మంత్రికి రవీందర్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు.

News August 21, 2024

కొండపాక: చెరువులో పడి ఇద్దరు మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చెరువులో ఈత కొడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తగూడెం గ్రామానికి చెందిన వారు.. సిరిసినగండ్లకు బంధువుల ఇంటికి శుభకార్యానికి వచ్చారు. స్నానానికి ఊర చెరువులోకి వెళ్లి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2024

సిద్దిపేట: మూడేళ్ల పాపపై అత్యాచారం.. నిందితుడు అరెస్టు

image

మూడేళ్ల పాపపై అత్యాచారం చేసిన నిందితుడిని సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు 24 గంటల్లో అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాలు.. మైత్రివనంలో నిర్మిస్తున్న ఓ అపార్ట్‌మెంట్‌లో నేపాల్‌కు చెందిన వ్యక్తి వాచ్‌మెన్‌గా పని చేస్తూ భార్య, మనవరాలితో నివాసం ఉంటున్నాడు. 19న పెయింటింగ్ పని చేస్తున్న UPకి చెందిన అజయ్(30) పాపను ఆడిస్తానని అత్యాచారం చేసినట్లు తెలిపారు.

News August 21, 2024

3 నెలల్లో ఏడుపాయల ఆలయంలో ముగ్గురు ఈఓల బదిలీ

image

మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ ఈఓలు నెలకోసారి మారుతున్నారు. ఇటీవల కాలంలో మూడు నెలల్లో ముగ్గురు ఈఓలు మారారు. ప్రస్తుతం తాజాగా దేవాదాయ, ధర్మాదాయ శాఖ అడిషనల్ కమీషనర్ చంద్రశేఖర్‌కు ఏడుపాయల ఈఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తరచూ ఆలయ ఈఓలు మారుతుండడంతో ఆలయ సిబ్బంది, భక్తులు సమస్యలు ఎదుర్కొంటున్నారు.

News August 21, 2024

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మెదక్ ఎంపీ

image

మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావును వారి నివాసంలో కలిసి కొల్చారం మండలంలో ఉన్న వివిధ సమస్యల గురించి చర్చించారు. వచ్చే నెలలో మండలంలో పర్యటించి సమస్యల పరిష్కారంకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు పాతూరి దయాకర్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండు నాని, చిన్న ఘనపూర్ బూత్ అధ్యక్షుడు మంద మహేశ్, తదితరులు పాల్గొన్నారు.

News August 21, 2024

సంగారెడ్డి: ఇక BRS ఎప్పటికీ గెలవదు: జగ్గారెడ్డి

image

KTR రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పొలిటికల్ కోచింగ్ సెంటర్‌లో ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడితే తీసేస్తాం అంటారా? మీరు తీసేస్తే మేం చూస్తూ ఊరుకుంటామా? తెలంగాణ తల్లి మన గుండెల్లో ఉండాలని లోపల ప్రతిష్ఠిస్తున్నాం. BRS ఎప్పటికీ గెలవదు. మళ్లీ గెలిచేది కాంగ్రెస్సే’ అని అన్నారు.

News August 21, 2024

మనోహరాబాద్: ఉరేసుకొని యువకుడి ఆత్మహత్య

image

మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి (పీటీ) గ్రామానికి చెందిన రాజు నిన్న రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రావెల్లి పోచయ్య, వీరమని దంపతుల కుమారుడైన రావెల్లి రాజు(24) రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.