Medak

News August 21, 2024

MDK: రుణమాఫీపై రైతుల్లో గందరగోళం

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన రుణమాఫీ ప్రక్రియలో రైతుల్లో సందేహాలు మొదలయ్యాయి. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా రైతులు గందరగోళానికి గురయ్యారు. రుణమాఫీలో ఆధార్, రేషన్ కార్డులను ప్రభుత్వం జోడించడంతో అర్హత ఉన్న అవ్వడం లేదని వాపోతున్నారు. రూ.2 లక్షల పై వారు ఉన్న మిత్తి డబ్బులు ఎప్పుడు చెల్లించాలో తెలియడం లేదు అంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.

News August 21, 2024

వర్గల్ నవోదయలో ప్రవేశాలు.. SEP 16 చివరి తేదీ

image

ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని వర్గల్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశాలకు వచ్చే ఏడాది జనవరి 16న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న విద్యార్థులు సెప్టెంబర్ 16లోగా www.navodaya.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
SHARE IT..

News August 20, 2024

సంగారెడ్డి: బీజేవైఎం రాష్ట్ర కమిటీలో ముగ్గురికి చోటు

image

భారతీయ యువ మోర్చా రాష్ట్ర కమిటీలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ముగ్గురికి చోటు దక్కింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెల్ల మహేందర్ విడుదల చేసిన రాష్ట్ర కమిటీలో సంగారెడ్డి జిల్లాకు చెందిన నరేన్ పాండే, సోమ అనిల్, సిద్దిపేట జిల్లాకు చెందిన గుండెల రాజుకు చోటు కల్పించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.

News August 20, 2024

15వ ఫైనాన్స్ నిధులు రావాలంటే స్థానిక ఎన్నికలు జరగాలి: ఎంపీ

image

గ్రామాల అభివృద్ధికి 15వ ఫైనాన్స్ నిధులు రావాలంటే ప్రభుత్వం తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అధ్యక్షతన రామాయంపేటలో నిర్వహించిన సభలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంకా పాలనపై పట్టు రావడం లేదన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, అందరికీ చేయాలని ఎంపీ అన్నారు.

News August 20, 2024

రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ప్రతిపక్షాలు: మంత్రి పొన్నం

image

హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని, రాష్ట్రంలో రైతాంగం ఆందోళన చెందవద్దు అని కోరారు. రైతు రుణమాఫీ అందరికీ  చేస్తామని తెలిపారు. ఎవరికైనా రుణమాఫీ కాకపోతే మండల కార్యాలయాల్లో, వ్యవసాయ అధికారులను కలిసి అప్లికేషన్ ఇవ్వాలని కోరారు.

News August 20, 2024

సిద్దిపేటలో కాంగ్రెస్ Vs బీఆర్ఎస్

image

సిద్దిపేట జిల్లా కేంద్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తలపెట్టిన ర్యాలీకి ఉమ్మడి జిల్లాలోని నాయకులు, కార్యకర్తలు వాహనాలలో సిద్దిపేటకు బయలుదేరారు. మరోవైపు సిద్దిపేటలో మాజీ మంత్రి హరీశ్ రావు ఆధ్వర్యంలో రుణమాఫీ కానీ గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

News August 20, 2024

ప్రమాదానికి గురైన వారిని రక్షించడానికి వెళ్లిన వ్యక్తి మృతి

image

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి డివైడర్ పైకి ఎక్కింది. కారులో ఇరుక్కుపోయిన వారిని రామ గౌడ్ అనే వ్యక్తి రక్షించడానికి వెళ్లారు, ఇదే క్రమంలో అతివేగంగా వచ్చిన మరో ఆటో రామ గౌడ్‌ను బలంగా ఢీ కొట్టింది. దీంతో రామ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News August 20, 2024

సంగారెడ్డి: ‘రుణమాఫీ కానీ వారు దరఖాస్తు చేసుకోండి’

image

రైతు రుణమాఫీ కాని వారు మండల వ్యవసాయ శాఖ అధికారులు, నోడల్ అధికారులను కలిసి ఫిర్యాదు చేయవచ్చని కలెక్టర్ వల్లూరు క్రాంతి సోమవారం తెలిపారు. బ్యాంకర్ల వల్ల జరిగిన తప్పిదాలు, కుటుంబ నిర్ధారణ జరగనివి, మిస్సింగ్ డాటా, పంట రుణమాఫీ వచ్చి తిరిగిన రైతులు వాటిపై ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అధికారులకు తగిన పత్రాలు సమర్పించి పంట రుణమాఫీ పొందాలని చెప్పారు.

News August 20, 2024

మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర

image

మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. వ్యాధి నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ నివారణ మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

News August 19, 2024

తూప్రాన్: నర్సంపల్లిలో మహిళ దృశ్యం

image

తూప్రాన్ మండలం నర్సంపల్లి గ్రామంలో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం కానుకుంటకు చెందిన తుడుం మరియమ్మ అలియాస్ పెంటమ్మ(32) అదృశ్యమైనట్లు ఎస్సై శివానందం తెలిపారు. కుటుంబ విషయంలో భర్త కరుణాకర్ తో గొడవపడి 5న నర్సంపల్లి లోని సోదరుడు హనుమంతు ఇంటికి వచ్చింది. 15న బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు. మరియమ్మ కోసం వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదని వివరించారు.