Medak

News August 19, 2024

రాఖీ వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్

image

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన రాఖీ పండుగ వేడుకల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావుకు బిజెపి మహిళ నాయకురాళ్లు రాఖీలు కట్టి ఆశీర్వదించారు. ఎంపీ మాట్లాడుతూ.. రాఖీ పండుగ సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయత, అనురాగాలను పంచుతుందన్నారు. బేదాభిప్రాయాలను దూరం చేస్తుందన్నారు. మహిళలందరికీ రఘునందన్ రావు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు.

News August 19, 2024

MDK: ‘రుణమాఫీపై సందేహాలు, విజ్ఞప్తులు స్వీకరించాలి’

image

రైతు రుణమాఫీకి సంబంధించి సమస్యలు, సందేహాల నివృత్తి కోసం వచ్చే విజ్ఞప్తులను స్వీకరించాలని మండల వ్యవసాయ అధికారులను మెదక్ జిల్లా వ్యసాయాధికారి గోవింద్ ఆదేశించారు. రేపటి నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వీటికి సంబంధించి ప్రత్యేక రిజిస్టర్ మెయింటైన్ చేయాల్సిందిగా ఆదేశించారు.

News August 19, 2024

మెదక్: ఒక్క ఫొటో.. ఎన్నో మధుర జ్ఞాపకాలు !

image

ఒక్క ఫొటోతో ఎన్నో మధుర జ్ఞాపకాలు కదులుతాయి. కాలం గిర్రున తిరుగుతున్నప్పటికీ ఫొటో చూడగానే వెనక్కి వెళ్లి ఏండ్ల కింది మధురస్మృతులు మనసులో మొదలవుతాయి. 1000 పదాలు చెప్పలేని భావాన్ని ఒక ఫోటో చెబుతుంది. కాలానుగుణంగా ప్రకృతిలో చోటు చేసుకునే మార్పులను బంధించి పదిలంగా దాచుకొని మళ్లీమళ్లీ చూసుకునే అవకాశం ఫొటోతోనే సాధ్యం. ఆ ఫోటోగ్రఫీ ఒకరోజు ఉంది. అది నేడే ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా స్పెషల్.

News August 19, 2024

రుణమాఫీ కోసం నిరసన చేసిన రైతులను అరెస్టు చేస్తారా.?: హరీశ్ రావు

image

రుణమాఫీ కాలేదని నిరసనకు దిగిన రైతులను అరెస్టు చేస్తారా.? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతుల అరెస్టు హేయమైన చర్య అని విమర్శించారు. ప్రజాపాలన అంటూ అప్రజాస్వామిక విధానాలు పాటిస్తారా అని నిలదీశారు. రుణమాఫీ కాలేదని కలెక్టరేట్లు, బ్యాంకుల చుట్టూ ప్రజలు తిరుగుతున్నారన్నారు.

News August 19, 2024

BREAKING: భూమి అమ్మాలంటూ మహిళపై కత్తితో దాడి

image

తనకే భూమిని అమ్మాలని బెదిరించి పట్టాదారిపై కత్తితో దాడి చేసిన ఘటన శివంపేట మండలం చండి గ్రామంలో చోటు చేసుకుంది. SI మైపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జయమ్మ తన 12 గుంటల భూమిని అమ్మాలనుకుంది. తన సొంత మరిది సూర్యం తనకే అమ్మాలని బూతులు తిట్టి, కత్తితో దాడి చేశారని అన్నారు. దీంతో ఆమె వీపు‌పై గాయాలయ్యాయి. జయమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు SI తెలిపారు.

News August 19, 2024

మెదక్: రేపటి నుంచి ‘ఆరోగ్య మిత్ర’ల సమ్మె

image

రాజీవ్ ఆరోగ్యశ్రీలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు రేపటి నుంచి సమ్మె బాట పట్టనున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న 43 మంది సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 6 నుంచి మంత్రి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవో, సచివాలయ ఉన్నతాధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఉద్యోగ భద్రత కల్పిస్తూ.. డాటా ప్రాసెసింగ్ ఆఫీసర్ (డిపిఓ)గా క్యాడర్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

News August 19, 2024

మెదక్: నేడు రక్షాబంధన్ వేడుకలు

image

జీవితంలో ఎన్ని బంధాలున్నా సోదరీ, సోదరుల అనుబంధం అపురూపమైనది. చెల్లె ఆపదలో ఉంటే అన్న ముందుంటాడు. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. ఇరువురి మధ్య ఉన్న అపురూపమైన బంధాన్ని పండగల చేసుకునే రోజే రక్షాబంధన్ (రాఖీ పండుగ). కృతయుగం నుంచి చేసుకుంటున్న రక్షాబంధన్ పండుగను రాఖీ పౌర్ణమి, రాఖీ పండుగ అంటారు. ఈ రోజే జంధ్యాల పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి చేసుకుంటారు.

News August 19, 2024

మెదక్ రోడ్డు ప్రమాదాలకు నిలయం.!

image

మెదక్ పట్టణంలో ఉన్న ఒకే రోడ్డు వివిధ ప్రమాదాలకు కారణమవుతోంది. రోడ్ల నిర్మాణానికి మట్టి, స్టోన్​డస్ట్​, కంకర తరలించే టిప్పర్లు, కంపెనీలకు వెళ్లే భారీ కంటెయినర్లు రాకపోకలు, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా 2 రోజుల కింద రాందాస్ చౌరస్తాలో రోడ్డ దాటుతున్న వ్యక్తిని టిప్పర్ ఢీకొట్టడంతో మృతి చెందాడు. రింగ్ రోడ్డు లేకపోవడం ఈ సమస్యకు పరిష్కారమని ప్రజలు కోరుతున్నారు.

News August 19, 2024

నేడు మెదక్ కలెక్టరేట్‌లో ప్రజావాణి

image

మెదక్ కలెక్టర్ కార్యాలయం‌లో నేడు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉ.10.30 గంటల నుంచి మ.1.30 గంటల వరకు జిల్లాస్థాయి అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటారని అన్నారు. ప్రజల నుంచి నేరుగా వినతి పత్రాలు స్వీకరించి పరిష్కరిస్తారని వివరించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

News August 18, 2024

సిద్దిపేట: సర్వాయి పాపన్న సేవలు గొప్పవి: మాజీ మంత్రి హరీశ్ రావు

image

సర్దార్ సర్వాయి పాపన్న జయంతి సందర్బంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ లెక్క జరుపుకోవడం సంతోషకరమని, కులం, మతం, జాతి విబేధాలు లేకుండా ఒక సమసమాజ నిర్మాణ స్థాపన కోసం పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు సర్దార్ పాపన్న అన్నారు.