Medak

News August 28, 2025

మెదక్: అత్యధికంగా సర్ధనలో 31 సెంమీల వర్షం

image

మెదక్ జిల్లా హవేలీ ఘనాపూర్ మండలం సర్ధనలో అత్యధికంగా 31 సెంమీ (316 మిమీలు) వర్షపాతం నమోదయింది. నాగపూర్‌లో 277.3 మిమీలు, చేగుంటలో 230.5 మిమీలు, రామాయంపేటలో 208, మెదక్‌లో 206 మిమీల వర్షపాతం నమోదైంది. మెదక్ ప్రాంతంలో అత్యధిక వర్షం కురవడంతో మంజీరా నది, పుష్పాల వాగు, నక్క వాగు, మహబూబ్నగర్ కెనాల్ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.

News August 27, 2025

MDK: మూడు నెలల్లోనే కొత్త బ్రిడ్జి మునక

image

జాతీయ రహదారి విస్తరణలో హవేలీ ఘనపూర్ దాటినా తరువాత నాగపూర్ గేట్ వద్ద ప్రమాదకర మలుపును స్ట్రైట్ గా తీర్చిదిద్దారు. నక్క వాగు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కోసం ఇంజినీర్ ప్లాన్ వేశారు. రోడ్డు వేసిన రెండు, మూడు నేలల్లోనే కొత్త రోడ్డు నీట మునిగి రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రవాహంలో కారు కొట్టుకుపోగా ఓ యువకుడిని 4 గంటల తర్వాత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు.

News August 27, 2025

మెదక్: భారీ వర్షాలు.. రైళ్లు రద్దు

image

భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే రద్దు చేసింది. కాచిగూడ- కరీంనగర్ రైలు బిక్నూరు- కరీంనగర్ మధ్య, నాందేడ్-మేడ్చల్ వెళ్లే రైలు కామారెడ్డి- మేడ్చల్ మధ్య, విశాఖ- నాందేడ్ రైలు ఆకంపేట- నాందేడ్ మధ్యలో క్యాన్సిల్ చేయగా, కాచిగూడ నుంచి మన్మాడ్ వెళ్లే రైళ్లు పలు ప్రాంతాలకు డైవర్షన్ చేసినట్లు షెడ్యూల్ విడుదల చేశారు. కాచిగూడ- మెదక్, నిజామాబాద్-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్‌ రద్దు చేశారు.

News August 27, 2025

వినాయక చవితి.. మెదక్ ఎస్స్పీ కీలక సూచనలు

image

గణేష్ మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం ప్రజల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. అలాగే మండపాలను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధిత శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద మహిళలు, యువతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవ్ టీజింగ్‌ను అరికట్టాలని సూచించారు.

News August 27, 2025

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు: మెదక్ ఎస్పీ హెచ్చరిక

image

ర్యాగింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు హెచ్చరించారు. నర్సాపూర్‌లోని బీవీఆర్ఐటీ ఇంజినీరింగ్ కళాశాలలో యాంటీ-ర్యాగింగ్, మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలని, విద్యార్థులు తమ భవిష్యత్తును నాశనం చేసే అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి విద్యార్థికి సైబర్ నేరాలపై అవగాహన ఉండాలన్నారు.

News August 26, 2025

మెదక్ జిల్లాకు వర్ష సూచన.. కలెక్టర్ అల్టర్

image

జిల్లాలో రాబోయే కొన్ని రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వర్షాలు పడుతున్న సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వంతెనలు, వాగులు, చెరువులు, నీటి మునిగే ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు హెచ్చరించారు.

News August 25, 2025

మెదక్: ఎరువుల కొరత తీరాలని వినాయకుడికి వినతి

image

తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత తీరాలని కోరుకుంటూ వినాయకుడికి వినతిపత్రం సమర్పించిన వినూత్న ఘటన హవేలి ఘనపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పలువురు బీఆర్ఎస్ నాయకులతో కలిసి సోమవారం వినాయకుడికి వినతి పత్రం సమర్పించారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎరువుల కొరత తీర్చడంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News August 25, 2025

కౌడిపల్లిలో రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

image

కౌడిపల్లి మండలం ఎల్లమ్మ దేవాలయ సమీపంలో రోడ్ ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హవేలీ ఘనపూర్ మండల కేంద్రానికి చెందిన కొండ నరేష్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై మెదక్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News August 24, 2025

MDK: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్ రాహుల్ రాజ్

image

చిన్నశంకరంపేటలోని మహాత్మా గాంధీ కస్తూర్బా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, విద్యార్థులతో మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంభాషించారు. ఒక ఉపాధ్యాయుడిలా తరగతి గదిలో వారికి పలు ప్రశ్నలు వేశారు. అనంతరం, భోజనాన్ని పరిశీలించి, వంట నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తాజా కూరగాయలు వాడాలని, వంటగదిలో శుభ్రత పాటించాలని వారికి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలని ఆదేశించారు.

News August 24, 2025

MDK: స్వాతంత్ర్య సమర యోధుడు మృతి

image

స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న అల్లాదుర్గం ప్రాంతానికి చెందిన మజ్జిగ ఈశ్వరయ్య (96) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యం కారణంగా ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఏది ఏమైనా స్వాతంత్ర్య సంగ్రామ యోధుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు.