India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కౌడిపల్లి మండలం తునికి నల్ల పోచమ్మ దేవస్థానం జాతర ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈనెల 17 నుంచి 20 వరకు నాలుగు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా నిర్వహించడానికి దేవదాయ ధర్మాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 17న ధ్వజారోహణం, అభిషేకం, గణపతి పూజ, 18న అగ్నిగుండాలు, బోనాలు, 19న బండ్లు తిరుగుట, 20న పాచి బండ్లు, పల్లకీ సేవ నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది.ఈ జాతరలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండలం నస్కల్కు చెందిన గోపిక వెంకటేశ్ భారత రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకున్నారు. ఉన్నత చదువులకు హర్యానా హిసార్ గురు జంబీశ్వర విశ్వవిద్యాలయం నుంచి ప్రింటింగ్, ప్యాకేజ్ ప్యాకేజ్లో ప్రతిభ కనబరిచారు. ప్రస్తుతం హైదరాబాద్లోని ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా బంగారు పతకం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు.
కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 124గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మెదక్ జిల్లాలో అనేక పెండింగ్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా మంబోజిపల్లి చక్కెర కర్మాగారం పునరుద్ధరించాలి. వనదుర్గ ప్రాజెక్ట్ ఎత్తు పెంపు, కాలువల సిమెంట్ లైనింగ్ పూర్తితో పాటు కాళేశ్వరం కాలువలు పూర్తి చేయాల్సి ఉంది. గత ప్రభుత్వంలో ప్రారంభించిన రామాయంపేట రెవెన్యూ డివిజన్లో అధికారిక కార్యక్రమాలు కొనసాగేలా చూడాలి.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్పల్లి గ్రామానికి చెందిన పోలీస్ హోంగార్డ్ తలారి మహేందర్(39) మంగళవారం రాత్రి మృతిచెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. సోమవారం ఉదయం గుండెపోటు రావడంతో మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణే లక్ష్యంగా ఏఎన్ఎంలు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ఏఎన్ఎంలతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మాతా శిశు మరణాల నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నామని తెలిపారు. గర్భం దాల్చిన మహిళలు పీహెచ్సీ, ప్రభుత్వ ఆసుపత్రులలో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు.
టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాలలో మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ మనోహర్ రావుకు రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకు సాధించారు. మొత్తం 600 మార్కులకు 439.344 మార్కులు సాధించాడు. గ్రూప్-1లో కూడా 430 మార్కులు సాధించాడు. 2020లో స్కూల్ అసిస్టెంట్గా ఉద్యోగంలో చేరి 317 జీఓలో మెదక్ జిల్లాకు వచ్చాడు. స్వగ్రామం సంగారెడ్డి జిల్లా ఉజలంపాడు.
రూ.12 వేల లంచం కోసం ఆశపడి బంగారు భవిష్యత్ ఉన్న ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి పట్టుబడ్డాడు. మెదక్ పురపాలక సంఘంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ నకిరేకంటి జానయ్య గెల్లి శైలజ తన సోదరుడు శ్రీనివాస్కు చెందిన 605 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఓపెన్ ప్లాట్పై దరఖాస్తుపై విచారణ, మ్యూటేషన్ కోసం రూ.20 వేల లంచం డిమాండ్ చేయగా.. రూ.12 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు.
మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో దివ్యాంగుల ప్రజావాణి కార్యక్రమం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా దివ్యాంగుల వద్దకు వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి విశేషణ స్పందన లభిస్తుందని అన్నారు.
కుటుంబ కలహాలతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలో జరిగింది. స్థానికుల వివరాలిలా.. నార్సింగ్కు చెందిన యువకుడు స్వామి(38) ఇటీవల భార్య కాపురానికి రాకపోవడంతో మద్యంకు బానిసగా మారారు. సోమవారం రాత్రి ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిన స్వామి వల్లూరు అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.
Sorry, no posts matched your criteria.