Medak

News August 8, 2024

రైతుల ఆర్థిక అభివృద్ధిపై మంత్రి పొన్నం దిశానిర్దేశం

image

హుస్నాబాద్ నియోజకవర్గంలోని ములకనూరు రైతు వేదిక సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రైతులు వ్యవసాయ ఆధార అనుబంధ పనుల వల్ల ఆర్థిక వృద్ధిపై మంత్రి పొన్నం దిశా నిర్దేశం చేశారు. రైతులకు పాడి పశువుల ద్వారా ఆవులు, గేదెలు, నాటు కోళ్ళ పెంపకం, చేపల పెంపకం, ఆయిల్ ఫాం, డ్రాగన్ ఫ్రూట్స్, కూరగాయలు ,మామిడి, జామ , బత్తాయి, నిమ్మ ,కొబ్బరి, మునగ, దానిమ్మ, తదితర తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు.

News August 8, 2024

MDK: వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

image

ఉమ్మడి జిల్లాలో నిన్న జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతిచెందారు. న్యాల్కల్ మం.రాంతీర్థకు చెందిన సిద్ధన్న భార్య అంబిక, కుమార్తెతో కలిసి వెళ్తుండగా మరో బైక్ ఢీకొట్టడంతో భార్య స్పాట్‌లోనే చనిపోయింది. మెదక్‌కు చెందిన కానిస్టేబుల్ దుర్గపతి బైక్ అదుపుతప్పి, పాపన్నపేట(M) మహమ్మద్‌పల్లి వాసి <<13798319>>శంకర్<<>> ఆటో అదుపుతప్పి కిందపడి మృతిచెందారు. కొమురవెల్లి మం.లో శ్రీహరి కుక్కను తప్పించబోయి కిందపడి చనిపోయాడు.

News August 8, 2024

సిద్దిపేట: అంబులెన్స్ కొట్టేసి.. మళ్లీ అదే ఆస్పత్రికి

image

ఓ వ్యక్తి అంబులెన్స్‌ను ఎత్తుకెళ్తుండగా యాక్సిడెంట్ కావడంతో మళ్లీ అదే అస్పత్రికి వచ్చిన ఘటన సిద్దిపేటలో జరిగింది. కొండపాకకు చెందిన నవీన్ సిద్దిపేటలో ఆస్పత్రి వద్ద అద్దెకు పెట్టుకున్న అంబులెన్స్‌ను అశోక్ అనే వ్యక్తి వేసుకొని HYD వైపు వెళ్తుండగా దుద్దెడ వద్ద హైవేపై డివైడర్‌ను ఢీకొట్టింది. గాయపడ్డ అతడిని అంబులెన్స్‌లో తిరిగి అదే ఆస్పత్రికి తీసుకొచ్చారు. నిందితుడు మద్దూరు మం. రేభర్తి వాసిగా తెలిసింది.

News August 8, 2024

సిద్దిపేట: ప్రాజెక్టులకు జలకళ

image

సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. గోదావరి జలాలు ఎత్తిపోత ప్రారంభించడంతో అనంతగిరి, రంగనాయకసాగర్ జలాశయాలకు జలాలు చేరుతున్నాయి. ప్రస్తుతం అనంతసాగర్ 1.27, రంగనాయకసాగర్ 1.4 TMCలకు చేరింది. మొత్తం 6600 క్యూసెక్కుల నీటిని నింపేందుకు నిర్ణయించారు. మరో 2రోజుల్లో మలన్నసాగర్ నుంచి కొండపోచమ్మకు నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో మొత్తం 5.50 ఎకరాల్లో సాగు అవుతుందని అధికారుల అంచనా.

News August 7, 2024

పెద్ద శంకరంపేట: కుమారుడిని కొట్టి చంపిన తండ్రి

image

పెద్దశంకరంపేటలో మతిస్తిమితం లేని కుమారుడిని తండ్రి మద్యం మత్తులో రోకలితో కొట్టి చంపినట్లు ఎస్సై శంకర్ తెలిపారు. పోలీసుల వివరాలు.. సాయిలు, భూమమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా.. చిన్న కుమారుడు ప్రదీప్ (16) మానసిక వైకల్యంతో ఉన్నాడు. వైకల్యం భరించలేని తండ్రి మద్యం మత్తులో రోకలి బండతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తాత పెంటయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

News August 7, 2024

మెదక్: పంచాయతీ పోరుకు కసరత్తు !

image

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాలపై అధికారుల దృష్టి సారించారు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు, 14,336 వార్డులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు, మెదక్‌‌లో 469 జీపీలు, 4,082 వార్డులు, సిద్దిపేటలో 499 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

News August 7, 2024

మెదక్: పంచాయతీ పోరుకు కసరత్తు !

image

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాలపై అధికారుల దృష్టి సారించారు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు, 14,336 వార్డులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు, మెదక్‌‌లో 469 జీపీలు, 4,082 వార్డులు, సిద్దిపేటలో 99 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

News August 7, 2024

మెదక్: పంచాయతీ పోరుకు కసరత్తు !

image

స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అందుకు అనుగుణంగా ఓటరు జాబితాల సవరణ, తదితర అంశాలపై అధికారుల దృష్టి సారించారు.. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 1,615 గ్రామ పంచాయతీలు, 14,336 వార్డులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 647 జీపీలు, 5,778 వార్డులు, మెదక్‌‌లో 469 జీపీలు, 4,082 వార్డులు, సిద్దిపేటలో 99 జీపీలు, 4,476 వార్డులు ఉన్నాయి.

News August 7, 2024

BREAKING.. మెదక్: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన హవేలిఘనపూర్ మండలంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మెదక్ టౌన్ PSలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బానోతు దుర్గపతి(50).. స్వగ్రామం ఫరీద్‌పూర్ తండా నుంచి విధులకు బైక్‌పై వెళ్తున్నారు. కూచంపల్లి సమీపంలో కుక్క అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా చనిపోయారు. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

News August 7, 2024

నిందితులకు శిక్ష పడాల్సిందే: మెదక్ SP

image

నిందితులకు శిక్షపడేలా కోర్టు డ్యూటీ పోలీస్ సిబ్బంది కృషి చేయాలని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. పలు కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేసిన సిబ్బందికి DGP నిన్న ప్రశంసా పత్రాలు అందజేశారు. SP మాట్లాడుతూ.. 2023లో హత్య కేసులో రామాయంపేట CI చంద్రశేఖర్, 2021లో మరో కేసులో తూప్రాన్ DSP కిరణ్ కుమార్.. నిందితులకు శిక్ష పడేలా చేశారు. నేర రహిత సమాజం కోసం నిందితులకు కోర్టులో శిక్ష పడేలా పనిచేయాలన్నారు.