India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం రాత్రి జోగు శ్యామల బోనంతో సందడి చేశారు. శ్యామల నెత్తిపై బోనం, చేతిలో త్రిశూలం చర్నాకోలతో ముందుకు సాగుతుండగా యువకులు, మహిళలు, భక్తులు కేరింతలతో హోరెత్తించారు. అనంతరం శ్యామల బోనం వన దుర్గామాత అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఆవిష్కృతమైంది. జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రామాయంపేట మండల కేంద్రంలో గత రాత్రి వ్యవసాయ పొలం వద్ద కుక్కపై చిరుత పులి దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి చిరుత దాడి చేసిన పశువులపాక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలో ఏమైనా ఆనవాళ్లు లభిస్తే చిరుత పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని రైతులకు సూచించారు.SHARE IT
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనకు తెలిసిందే. గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక సందర్బంగా మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒకరు వచ్చారు. ఆయన తీవ్ర మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా.. వాకర్ సాయంతో క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. దీంతో అయన సంకల్పానికి శభాష్ అంటున్నారు.
అదృశ్యమైన మహిళ హత్యకు గురైంది. గజ్వేల్ ACP పురుషోత్తం రెడ్డి వివరాలిలా.. వర్గల్ మం. అనంతగిరిపల్లికి చెందిన యాదమ్మ(40) భర్త చనిపోయాడు. అదే గ్రామానికి చెందిన చిన్నలక్ష్మయ్యతో పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టింది. దీంతో ఈనెల 15న కోమటిబండ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి కల్లులో పురుగు మందు కలిపి తాగించాడు. అనంతరం చీరతో ఉరేశాడు. నిందితుడిని రిమాండ్కు తరలించారు.
మెదక్ జిల్లాలోని అన్ని బోర్డు స్కూల్స్ (సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ)లో 2025-26 గాను 1వ తరగతి నుంచి 10 తరగతుల వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా బోధించాలని ప్రభుత్వం ఆదేశించిందని డీఈవో రాధాకృష్ణ తెలిపారు. ద్వితీయ భాష- సింగిడి, తృతీయ భాష- వెన్నెల పుస్తకాలు బోధించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల యాజమన్యాలు దీనిని అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి సాం. 4గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలు అమలు చేస్తామని, ప్రశాంతంగా ఎన్నికల నిర్వాహణకు సహకరించాలని SP కోరారు. పట్టభద్రుల బరిలో 56 మంది టీచర్స్ పోటీలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
నర్సాపూర్ మండలంలోని తుజాల్ పూర్-అర్జు తాండాకు చెందిన హలవత్ గణేష్(42) ఉరేసుకొని మృతిచెందారు. కూతురు పెళ్లికి చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనోవేదనతో బాధపడేవాడని, ఇంటికి కొద్ది దూరంలో వ్యవసాయ పొలం వద్ద ఉరేసుకున్నాడు. ఈమేరకు అతడి భార్య హలావత్ సాలమ్మ ఫిర్యాదు చేసిందని నర్సాపూర్ ఎస్సై బి.లింగం తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.
మెదక్ జిల్లాలో జరగబోయే ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ MLC ఎన్నికకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 174 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS ఆక్ట్ (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
మహాశివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాత అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మూడు రోజులపాటు జరిగే మహా జాతర ప్రారంభం కాగా రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఏడుపాయల చేరుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకుని ఉపవాస దీక్షలు విటమించారు. జై దుర్గా, వన దుర్గా అంటూ భక్తుల నినాదాలు మారు మ్రోగాయి. క్యూ లైన్లలో భక్తులు పెద్ద ఎత్తున వేచి ఉన్నారు.
Sorry, no posts matched your criteria.