India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలలో సౌర విద్యుత్ ఏర్పాటుకు 3 రోజులలో నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్ర రెడ్డి, మహిపాల్ రెడ్డి, డీఎం రెడ్ కో రవీందర్ చౌహన్, జిల్లా అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ ఉండాలన్నారు.

లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్, పరిహారం ఇప్పించేంతవరకు భరోసా సెంటర్ అండగా నిలుస్తుందని ఎస్పీ శ్రీనివాస్ రావు అన్నారు. మెదక్ పట్టణంలో గల భరోసా కేంద్రాన్ని ఏఎస్పీ మహేందర్తో కలిసి సందర్శించారు. లైంగిక, భౌతిక దాడులకు గురైన బాధితులకు భరోసా సెంటర్లో కల్పించే న్యాయ సలహాలు, సైకలాజికల్ కౌన్సెలింగ్, వైద్య పరంగా తీసుకుంటున్న చర్యలు, మహిళల కేసులపై అరా తీశారు.

అధిక వర్షాలపై కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులతో సమీక్షించారు. రానున్న 72 గంటల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో తగు ఆదేశాలు జారీ చేశారు. అధిక వర్షాలు వల్ల జిల్లాలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ నగేశ్ తదితరులు పాల్గొన్నారు.

రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించి నివేదికలు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. గత జూన్ 30న సంగారెడ్డి జిల్లా పాశమైలారంలో సంభవించిన అతిపెద్ద విస్ఫోటనాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు.

ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకోవాలని జిల్లా గ్రంథాలయాల సంస్థ ఛైర్ పర్సన్ చిలుముల సుహాసిని రెడ్డి
సూచించారు. నర్సాపూర్ శాఖ గ్రంథాలయంలో నేషనల్ లైబ్రరి డే నిర్వహించారు. ఫాదర్ ఆఫ్ లైబ్రరి సైన్స్గా పిలిచే పద్మశ్రీ S.R రంగనాధన్ జయంతి సంధర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మెదక్-కామారెడ్డి జిల్లా సరిహద్దుల్లో గల పోచారం ప్రాజెక్టు నీటిమట్టం మంగళవారం ఉదయం 20 అడుగులకు చేరింది. ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా కామారెడ్డి, లింగంపేట, గాంధారి నుంచి వస్తున్న వాగులు పారడంతో ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. ఓవర్ ఫ్లో కావడానికి మరో అర అడుగు దూరంలో ఉంది. 20.5 అడుగుల నీరు వస్తే ప్రాజెక్టు ఓవర్ ఫ్లో కానుంది. ప్రాజెక్ట్ నిండుకోవడంతో పర్యాటకుల సందడి నెలకొంది.

ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయ హుండీని దేవాదాయ, ధర్మాదాయ శాఖ సమక్షంలో శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ సభ్యులు, ఆలయ సిబ్బంది సోమవారం లెక్కించారు. గడిచిన 46 రోజుల హుండీని లెక్కించగా రూ.26,59,009 ఆదాయం సమకూరింది. దేవదాయ శాఖ స్పెషల్ ఆఫీసర్ సులోచన, ఈఓ చంద్రశేఖర్, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. స్థానిక ఎస్సై శ్రీనివాస్ గౌడ్, సిబ్బంది ఆధ్వర్యంలో పర్యవేక్షణ కొనసాగింది.

జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టరే నగేష్ సూచించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతపూర్లో 2025 -26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి(ఇంగ్లీష్ మీడియం)లో ప్రవేశం కోసం లక్కీ డ్రా తీశారు.

పాపన్నపేట తహసీల్దార్ కార్యాలయంను మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం సందర్శించారు. భూభారతి దరఖాస్తులను పరిశీలించారు. ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయో తదితర వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తగు సూచనలు చేశారు. ఇందిరమ్మ ఇళ్ల నమూనా భవనాన్ని పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ సతీష్ కుమార్ తదితరులు ఉన్నారు.

వెల్దుర్తి పోలీస్ స్టేషన్ను సోమవారం మెదక్ ఎస్పీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదు అవుతున్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు రికార్డులను తనిఖీ చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
Sorry, no posts matched your criteria.