India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోడల్ స్కూల్లో 2025 – 26 సంవత్సరానికి సంబంధించి 6 – 10 తరగుతుల్లో అడ్మిషన్లకు మార్చ్ 10వ తేదీ వరకు అవకాశం ఉందని కోమటిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ విజయ లక్ష్మి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… https:///telanganams.cgg.gov.in వెబ్సైట్లో నేరుగా దరఖాస్తు తీసుకోవచ్చు అన్నారు. ఏప్రిల్ 13న దరఖాస్తు చేసిన వారికి పాఠశాలలోనే ప్రవేశ పరీక్ష ఉంటుందని చెప్పారు.
మెదక్ జిల్లాలో ఏడుపాయల జాతర ముగింపు తర్వాత విషాదం నెలకొంది. పోతంశెట్టిపల్లి శివారులో 2వ బ్రిడ్జి వద్ద మంజీరా నదిలో మునిగి ఇద్దరు యువకులు చనిపోయారు. శనివారం స్నానం కోసం నలుగురు యువకులు దిగారు. వీరిలో కృష్ణ(20), షామా(21) ప్రమాదవశాత్తు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు యువకులు బయటపడ్డారు. మృతదేహాలను మెదక్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ ఇందిరా నగర్కు చెందిన వారిగా గుర్తించారు.
మార్చి 1 నుంచి 31 వరకు మెదక్ జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని తెలిపారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే మెదక్ జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానుంది. జిల్లాలో మొత్తం 1,076 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా 885 మెయిన్, 191 మినీ సెంటర్లు ఉన్నాయి. జిల్లాలో 52 టీచర్, 340 ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం తాజా నిర్ణయంతో అంగన్వాడీల్లో సిబ్బంది కొరత తీరనుంది.
మెదక్ జిల్లాలో అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏడుపాయల దేవస్థానం. మహాశివరాత్రి పురస్కరించుకుని నేడు రథోత్సవం సందర్భంగా అమ్మవారిని వేకువజామున మంజీరా నీళ్లతో అభిషేకం చేసి వివిధ రకాల పువ్వులు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమతో అర్చకులు విశేష అలంకరణ చేశారు. తథానంతరం భక్తులకు దర్శనం కల్పించారు. వివిధ జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.
సదాశివపేటలో <<15595690>>మహిళ హత్య <<>>జిల్లాలో కలకలం రేపుతోంది. CI మహేశ్ గౌడ్ వివరాలిలా.. నందికందికి చెందిన చిన్నలక్ష్మి(39) అనంతసాగర్లో కుమార్తె శిరీష వద్దకు వెళ్లి 26న తిరిగి ఇంటికొచ్చింది. అదేరోజు రాత్రి పని ఉందని భర్తకు చెప్పి సదాశివపేటకు వచ్చింది. నిన్న ఉదయం MPDO ఆఫీసు సమీపంలో లక్ష్మి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతురాలి తమ్ముడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఉమ్మడి MDK- KNR- NZB- ADB పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రులు 11.39శాతం, టీచర్ల ఓటింగ్ 8.36 శాతం పెరిగింది.
ఏడుపాయల మహా జాతరలో భాగంగా గురువారం రాత్రి జోగు శ్యామల బోనంతో సందడి చేశారు. శ్యామల నెత్తిపై బోనం, చేతిలో త్రిశూలం చర్నాకోలతో ముందుకు సాగుతుండగా యువకులు, మహిళలు, భక్తులు కేరింతలతో హోరెత్తించారు. అనంతరం శ్యామల బోనం వన దుర్గామాత అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఆవిష్కృతమైంది. జాతరలో ఎడ్ల బండ్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
రామాయంపేట మండల కేంద్రంలో గత రాత్రి వ్యవసాయ పొలం వద్ద కుక్కపై చిరుత పులి దాడి చేయడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం రాత్రి చిరుత దాడి చేసిన పశువులపాక వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. సీసీ ఫుటేజీలో ఏమైనా ఆనవాళ్లు లభిస్తే చిరుత పులిని బంధించేందుకు బోను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు. రాత్రి వేళల్లో ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దని రైతులకు సూచించారు.SHARE IT
ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైంది. ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఒక్క ఓటు తేడాతో ప్రభుత్వాలు కూలిపోయిన సంఘటనలు మనకు తెలిసిందే. గురువారం ఎమ్మెల్సీ ఎన్నిక సందర్బంగా మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి ఒకరు వచ్చారు. ఆయన తీవ్ర మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నా.. వాకర్ సాయంతో క్యూ లైన్లో నిలబడి ఓటు వేసి వెళ్లారు. దీంతో అయన సంకల్పానికి శభాష్ అంటున్నారు.
Sorry, no posts matched your criteria.