Medak

News August 3, 2024

సంగారెడ్డి: జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

image

సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారిపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో వ్యక్తి శరీరం నుజ్జునుజ్జు అయిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పుల్కల్ పోలీసులు విచారణ చేపట్టారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 3, 2024

సంగారెడ్డి: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!

image

వాతావరణంలోని మార్పుల కారణంగా సంగారెడ్డి జిల్లా ప్రజలు డెంగ్యూ, టైఫాయిడ్‌ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వర పీడితులతో దావాఖానలు కిటకిటలాడుతున్నాయి. ఓపీ కేసులతో పాటు ఔట్ పేషేంట్ కేసులు అధికంగా నమోదైతున్నాయి. జిల్లాలో అధికారికంగా 70 డెంగీ కేసులు నమోదు కాగా, అధికారుల దృష్టికి రాని కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. సంగారెడ్డి జిల్లాలో 1415 టైఫాయిడ్‌ కేసులు నమోదయ్యాయి.

News August 3, 2024

రేపు మహిళా ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపిక

image

ఉమ్మడి మెదక్ జిల్లా మహిళా ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల 4 నిర్వహిస్తున్నట్లు ఫుట్బాల్ అసోసియేషన్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడా కారులు ఫొటో, ఆధార్ కార్డు, పదో తరగతి మెమో లేదా జన్మదిన జిరాక్స్ కాపీలతో ఉదయం 7 గంటలకు మెదక్లో ఇందిరాగాంధీ స్టేడియానికి రావాలని కోరారు.

News August 3, 2024

MDK: చేప.. చెరువుకు చేరేనా?

image

చేప పిల్లల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలస్యమయ్యేల కనిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మత్యశాఖ ఆఫీస్‌లో బిడ్లకు సంబంధించి టెండరు బాక్సు తెరవగా ఒక్కరూ టెండర్‌‌లో పాల్గొనకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో మొత్తం 1,160 చెరువులు, కుంటలు ఉన్నాయి. 227 మత్స సహాకార సంఘాలు ఉండగా వీటిలో 11,013 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడు 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.

News August 3, 2024

సిద్దపేట: పెళ్లి భయంతో యువతి సూసైడ్

image

పెళ్లి భయంతో పురుగుల మందు తాగి యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చేర్యాల మండలంలో జరిగింది. పోలీసుల వివరాలు.. ఆకునూరు గ్రామానికి చెందిన మహేశ్వరి(25)కి ఇటీవల కుటింబీకులు పెళ్లి సంబంధం చూశారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి అంటే భయంతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై దామోదర్ తెలిపారు.

News August 3, 2024

హరీశ్ రావును వదిలిపెట్టేది లేదు: మైనంపల్లి

image

మాజీ మంత్రి హరీశ్ రావునీ వదిలిపెట్టేది లేదని కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హనుమంత రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేటకు వచ్చిన మైనంపల్లిని కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డితో కలిసి మైనంపల్లి హనుమంత రావు మాట్లాడుతూ.. హరీశ్ రావు అక్రమాలు బయటపెడతామన్నారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్ ఛార్జులు పూజల హరికృష్ణ, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

News August 3, 2024

నూతన చట్టాలపై అవగాహన ఉండాలి: సంగారెడ్డి ఎస్పీ

image

పోలీసులు నూతన చట్టాలపై అవగాహన ఉండాలని సంగారెడ్డి ఎస్పీ రూపేష్ అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి ముందస్తు విచారణ చేయాలని సూచించారు. కొత్త చట్టాల అమలులో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులు ఇస్తామని చెప్పారు. సమావేశంలో పోలీసులు పాల్గొన్నారు.

News August 2, 2024

సంగారెడ్డి: స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

image

జిల్లాలో ఈనెల 5 నుంచి నిర్వహించే స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ వల్ల క్రాంతి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయి సిబ్బంది అన్ని శాఖల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News August 2, 2024

ప్రజా పాలనలో ఉపాధ్యాయులకు పదోన్నతులు: మంత్రి పొన్నం

image

కొత్తగా పదోన్నతులు పొందిన ప్రభుత్వ ఉపాధ్యాయులతో హైదరాబాదులో ముఖ్యమంత్రి ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. పొన్నం మాట్లాడుతూ.. దశాబ్దకాలం తరువాత జీవితంలో ప్రమోషన్లు వస్తాయో రావో అనే దాని నుండి ఒక మెట్టు ఎక్కి ప్రజాపాలనలో ఉపాధ్యాయులు ప్రమోషన్లు పొందారని అన్నారు. ఉపాధ్యాయ వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు.

News August 2, 2024

ఇంటింటా ఇన్నోవేటర్ 2024′ దరఖాస్తు గడువు పొడగింపు

image

ఇంటింటా ఇన్నోవేటర్ 2024 కార్యక్రమం కోసం అప్లికేషన్స్ దరఖాస్తు చేసుకునే గడువును ఆగస్ట్ 10 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ప్రకటించింది. ఆవిష్కర్తలు, అంకురాలకు, వ్యవస్థాపకులకు సమ్మిళిత ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థను అందిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం యొక్క మొదటి ప్రతిస్పందనగా గుర్తించబడిందని ఈ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ అన్నారు.